
ఆ గ్రామంలో రాత్రయితే చాలు కోళ్లు, మేకల అరుపులు.. ఉదయం చూస్తే కనిపించని వాటి జాడ.. గత కొన్ని ములుగు జిల్లా వెంకటాపురం మండలం మర్రిగూడెం గ్రామంలో ఇదే జరుగుతుంది. అవును రాత్రి వేల గ్రామంలోకి ప్రవేశించి కోళ్లు, మేకలను మింగేస్తోందో కొండచిలువ. తాజాగా బుధవారం తెల్లవారుజామున గ్రామంలోకి వచ్చిన కొండచిలువను గమనించిన స్థానికులు.. దాన్ని కర్రలతో కొట్టి హతమార్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.





