
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Wife try to kill her husband in tamil nadu: సమాజంలో నైతిక విలువలు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ముఖ్యంగా భార్యభర్తల పవిత్రమైన బంధంకు బీటలు వారిందని చెప్పుకొవచ్చు. కొంత మంది దంపతులు చేస్తున్న హత్యాకాండాలు మొత్తం పెళ్లి అనే పవిత్రమైన బంధంను ప్రశ్నార్థకంగా మార్చేసింది. పెళ్లితర్వాత పక్కచూపులు చూస్తు, వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్యలు భర్తల్ని, భర్తలు తమ భార్యల్ని చంపుకుంటున్నారు. కొన్ని చోట్ల సుపారీలు ఇచ్చి మరీహత్యలు చేయిస్తున్నారు. ఇంకా ఇన్సురెన్స్ డబ్బుల కోసం మొగుళ్లను కొంత మంది భార్యలు అత్యంత పాశావికంగా హత్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన సభ్య సమాజంను సిగ్గుతో మరోసారి తలదించుకునేలా చేసింది.
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. తిరువిడైమరుదూర్ తాలుకాలోని పుళిదికుడికి చెందిన కూలీ రవీంద్రన్ (54), ఉమారాణి (48) కి పెళ్లై 27 ఏళ్లయ్యింది. వీరి కొడుకు విదేశాల్లో ఉన్నాడు. కూతురుకు పెళ్లైంది. రవింద్రన్ కొత్త ఇల్లు కట్టడానికి పాలారీ డ్యామ్ , ఇతర గ్రూప్ ల నుంచి రూ. 10 లక్షల రుణం తీసుకున్నారు.
భర్త చనిపోతే అప్పులు ఎగ్గొట్టవచ్చని భావించి భార్య ఉమారాణి కన్నింగ్ స్కెచ్ వేసింది. తన తమ్ముడు జ్ఞానశేఖరన్ తో కలిసి ప్లాన్ తో నిద్రిస్తున్న భర్త చేవిలో విషంన చిన్న సీసాలో నింపిఆ డ్రాప్స్ ను చేవిలో వేశారు. దీంతో భర్త రవీంద్రన్ కు ఒక్కసారిగా మెళకువ రావడంతో తన భార్యను, ఆమె సోదరుడ్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే ఎలాగోలా వారినుంచి తప్పించుకుని స్థానికులకు ఈ విషయం చెప్పాడు. ఆ తర్వాత అతడ్ని కుంభకోణం ఆస్పత్రికి తరలించారు.
Read more: Siya Goyal: కేతన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. లోయలోకి ఎవరు తోశారో ఆధారాలు లేవన్న పూణే పోలీసులు.!. లైడిటెక్టర్ అనుమతి కోరుతు వాదనలు..!.
స్థానికులు సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడు సమయంకు ఆస్పత్రిలోకి రావడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసుల విచారణలో మూడునెలల క్రితమే ఇద్దరు టీలో విషంను కల్పి తాగించేందుకు ప్రయత్నించారని అతను చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలొ కూడా జెట్ స్పీడ్ లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ తో నోరెళ్ల బెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.