
టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, జట్టు యాజమాన్యంపై తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కాడు. గతేడాది (2025) ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో తనను సరిగ్గా వినియోగించుకోలేదని సంచలన...
టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, జట్టు యాజమాన్యంపై తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కాడు. గతేడాది (2025) ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో తనను సరిగ్గా వినియోగించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) 2026-27 సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.ఆ సిరీస్లో తనకు తగినన్ని బౌలింగ్ అవకాశాలు ఇవ్వలేదని, సరైన సమయంలో తనను బౌలింగ్కు తీసుకురాలేదని శార్దూల్ అన్నాడు. "లీడ్స్ టెస్టులో నేను బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ వికెట్లను వెంటవెంటనే తీశాను. అయినా నన్ను వెంటనే బౌలింగ్ నుంచి తప్పించారు. ఆ సమయంలో మరికొంత సేపు బౌలింగ్ చేసి ఉంటే, మనం ఓడిపోయిన ఆ మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో" అని శార్దూల్ అభిప్రాయపడ్డాడు.2-2తో డ్రాగా ముగిసిన ఈ సిరీస్లో శార్దూల్ కేవలం 2 మ్యాచ్లే ఆడాడు. మొత్తం మీద 27 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో 46 పరుగులు చేశాడు. అయితే, మాంచెస్టర్ టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లో 88 బంతులు ఎదుర్కొని 41 పరుగులు చేసి, జట్టు మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించానని గుర్తుచేశాడు.సిరీస్ మధ్యలో ఈ విషయంపై కెప్టెన్ శుభ్మన్ గిల్ లేదా కోచ్ గౌతమ్ గంభీర్తో చర్చించలేదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. గత దేశవాళీ సీజన్లో అద్భుతంగా రాణించానని, ఇప్పుడు తిరిగి టెస్ట్ జట్టులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని 34 ఏళ్ల శార్దూల్ స్పష్టం