
మన సంప్రదాయం, అతిథి మర్యాదలు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందాయో మరోసారి నిరూపితమైంది. దేశ రాజధాని ఢిల్లీలో చిక్కుకుపోయిన ఒక అమెరికన్ పర్యాటకురాలికి స్థానిక వ్యక్తి అంది
ంచిన నిస్వార్థ సాయం ఇప్పుడు ఇంటర్నెట్లో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. అమెరికాకు చెందిన ట్రావెలర్ సియెర్రా లిలియన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఆమె మొబైల్ ఫోన్ పూర్తిగా స్విచ్ఛాఫ్ అయిపోయింది. దాంతో క్యాబ్ బుక్ చేసుకోవడానికి గానీ, గూగుల్ మ్యాప్స్ చూసుకోవడానికి గానీ, ఎవరినైనా సంప్రదించడానికి గానీ వీల్లేకుండా ఆమె రోడ్డుపై తీవ్ర ఆందోళనతో నిలబడాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆమె అవస్థను గమనించిన ఒక స్థానిక వ్యక్తి (ఆమె ప్రేమగా 'అంకుల్ జీ' అని పిలుచుకుంది) చొరవ తీసుకుని సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. కేవలం ఆమె ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మాత్రమే సాయం చేయకుండా, ఆమెను ఎంతో ఆదరంగా తన ప్రదేశంలోకి ఆహ్వానించాడు. కంగారుపడుతున్న ఆమెకు చాయ్, చల్లని మజ్జిగ ఇచ్చి సేదదీర్చాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న ఆవులను, మొక్కలను చూపించి, ఆపై అక్కడి స్థానిక ఆలయానికి కూడా తీసుకువెళ్లాడు. ఆమె ఫోన్ ఆన్ అయ్యేంతవరకు ఆమెకు పూర్తి రక్షణగా, తోడుగా నిలిచాడు.వైరల్గా మారిన 'అతిథి దేవోభవ' వీడియోతనకు ఎదురైన ఈ అద్భుత అనుభవాన్ని సియెర్రా తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకుంది. నిస్వార్థంతో కూడిన ఆ వ్యక్తి ఆతిథ్యం భారతదేశ ఫిలాసఫీ అయిన 'అతిథి దేవోభవ' (అతిథే దేవుడు) అనే మాటకు నిలువెత్తు రూపమని కొనియాడింది. తాను భారతదేశంలో పర్యటించిన వెంబడి ఇక్కడి