
తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఉత్తర భారత ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. బంగాళాఖాతం నుంచి జమ్మూకశ్మీర్ వరకు దాదాపు 1500 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన భారీ రుతుపవన ద్రోణిని...
తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఉత్తర భారత ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. బంగాళాఖాతం నుంచి జమ్మూకశ్మీర్ వరకు దాదాపు 1500 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన భారీ రుతుపవన ద్రోణిని (మేఘాల చరియ) ఉపగ్రహ చిత్రాలు తాజాగా గుర్తించాయి. ఇన్శాట్-3డీఎస్ శాటిలైట్ పంపిన ఈ చిత్రాలు.. తూర్పు భారతదేశం నుంచి హిమాలయ ప్రాంతం వరకు దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల బలాన్ని, వాటి వేగాన్ని సూచిస్తోందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.ఈ రుతుపవన ద్రోణి అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమను దేశం లోపలికి లాక్కునే ఒక బలమైన అల్పపీడన ప్రాంతం. ఇది జూన్ నెలలో హిమాలయాల పాదాల వద్ద కేంద్రీకృతం కావడం వల్లే అక్కడ భారీ వర్షాలు కురిశాయని, అదే సమయంలో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి మైదాన ప్రాంతాలు ఎండలతో ఎండిపోయాయని అధికారులు వివరించారు. అయితే, ఇప్పుడు ఈ ద్రోణి క్రమంగా దక్షిణం వైపుగా తన సాధారణ స్థానానికి కదులుతుండటంతో.. రానున్న రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.మొదటి వారంలో ఢిల్లీకి రుతుపవనాలు వాతావరణ శాఖ అంచనా ప్రకారం, జులై 1 నుంచి 4 మధ్య కాలంలో ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు గణనీయంగా పెరుగుతాయి. దీనికి తోడు ఈ వారంలోనే బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో, గాలిలో తేమ శాతం మరింత పెరిగి వర్షాలు ఉద్ధృతం కానున్నాయి. ఫలితంగా ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా,