
తాను అద్దెకిచ్చిన ఫ్లాట్లపై ఏకంగా రూ.18 కోట్ల రుణాలు తీసుకున్నారని తెలిసి ఢిల్లీకి చెందిన ఓ వితంతువు నివ్వెరపోయారు.
కేవలం అద్దె ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని కేటుగాళ్లు పన్నిన ఈ భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్ట్ చేసింది.వివరాల్లోకి వెళితే, తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్కు చెందిన ఉషా రాణి సేథి (55) అనే వితంతువు 2012లో తన రెండు ఫ్లాట్లను సచిన్, సంజయ్ అనే వ్యక్తులకు అద్దెకిచ్చారు. కొంతకాలం తర్వాత వారు ఇల్లు ఖాళీ చేశారు. అయితే, 2013లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి ఉషా రాణికి రూ.70 లక్షల లోన్ డిఫాల్ట్ అయినట్లు నోటీసులు వచ్చాయి. దీంతో షాక్కు గురైన ఆమె పోలీసులను ఆశ్రయించారు.పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితులు ఉషా రాణి పేరుతో నకిలీ పాన్ కార్డు సృష్టించి, ఆమె సంతకాలను ఫోర్జరీ చేశారు. ఒడిశాకు చెందిన మరో మహిళ పాన్ కార్డు వివరాలు సంపాదించి, ఆమె స్థానంలో వేరే వ్యక్తిని పెట్టి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉషా ఫ్లాట్లను సచిన్ పేరు మీద అమ్మినట్లు నకిలీ సేల్ డీడ్ సృష్టించారు.ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి, సచిన్ తన బావమరిది సంజీవ్ దీక్షిత్తో కలిసి వివిధ బ్యాంకుల నుంచి రూ.18 కోట్ల వరకు రుణాలు, ఓవర్డ్రాఫ్ట్లు పొందారు. ఈ డబ్బును 11 షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి కాజేశారు.నిందితుడు సంజీవ్ దీక్షిత్పై గతంలో సీబీఐ