
India vs England T20I: ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టబోతున్నాడు.
ఇంగ్లాండ్తో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్లో ఈ యువ విస్పోటక బ్యాటర్ టీమిండియా తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న ఓ ఆటగాడి స్థానంలో వైభవ్కు అవకాశం దక్కనుంది.
ఐపీఎల్ ‘ఆరెంజ్ క్యాప్’ హీరో వైభవ్ సూర్యవంశీ..
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. మైదానంలో దిగితే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లీగ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. సీజన్లో ఆడిన 16 మ్యాచ్ల్లో ఏకంగా 48.50 అద్భుత సగటుతో, 237.31 మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలతో పాటు ఒక సుడిగాలి శతకం కూడా ఉంది. ఈ అసాధారణ ప్రదర్శనతోనే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..
ఐర్లాండ్ సిరీస్లో తప్పిన అవకాశం.. అభిమానుల్లో నిరాశ ఐపీఎల్లో అంతలా అదరగొట్టిన వైభవ్కు ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అభిమానులంతా ఆశగా ఎదురుచూశారు. కోచ్ గౌతమ్ గంభీర్ తొలి మ్యాచ్లోనే ఈ యువ సంచలనానికి డెబ్యూ క్యాప్ ఇస్తాడని భావించినా, అది సాధ్యపడలేదు. మొదటి మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైన తర్వాత, రెండో మ్యాచ్లోనైనా వైభవ్ను జట్టులోకి తీసుకుంటారని అనుకున్నారు. కానీ, అక్కడ కూడా నిరాశే ఎదురవడంతో అభిమానులు మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!
ఇంగ్లాండ్పై తొలి మ్యాచ్లోనే ఎంట్రీ.. ఆ ఫ్లాప్ ప్లేయర్పై వేటు!
ఐర్లాండ్ సిరీస్లో నిరాశ ఎదురైనా, జులై 1 నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వైభవ్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం జరిగే తొలి పోరులోనే వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగబోతున్నాడని సమాచారం. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఘోరంగా విఫలమైన సూర్యాంశ్ షెగ్డే స్థానంలో వైభవ్ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. ఫామ్లో లేని ఆటగాళ్లను పక్కనపెట్టి, యువ రక్తాన్ని ప్రోత్సహించే కోచ్ గౌతమ్ గంభీర్, ఈ మ్యాచ్లో వైభవ్కు అరంగేట్రం చేసే సువర్ణావకాశాన్ని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంగ్లాండ్తో తలపడే భారత అంచనా తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..