
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్లక్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

Delhi University | ఏడు లక్షల మందికి 8 వేల గదులు.. గత్యంతరం లేకనే పీజీల్లో బస..!

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి.. (Bigg Boss Telugu 10 Day 1 Promo)

ధురంధర్ నటి సారా అర్జున్ (Sara Arjun) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా హ్యాపీ ప్లేస్ (సంతోషాన్చిచ్చే ప్రదేశం) అని క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్గా మారాయి.
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ లిస్ట్.. టాప్లో రిషి సార్.. జాక్ పాట్ కొట్టిన సామాన్యులు.. వారానికి ఎంతంటే!!

ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తుల భర్తీ అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం Telangana Cabinet Expansion : తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్ : కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముహుర్తం ఖరారైనట్టేనా? : ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్? వారికే బెర్త్ దక్కనుందా? : ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు

OnePlus Nord CE 6 : కొత్త వన్ప్లస్ ఫోన్ కొంటున్నారా? క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్తో కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ ఫోన్ 8000mAh బ్యాటరీతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో మొత్తంగా రూ. 35వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వన్ప్లస్ నార్డ్ సిఇ 6పై తగ్గింపులు, ఆఫర్లు, ధర వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ధర, ఆఫర్లు : వన్ప్లస్ నార్డ్ సీఇ 6 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ. 36,920 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డులపై రూ. 34,720 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ. 29,250కు తగ్గుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 29,250 వరకు తగ్గించవచ్చు. కానీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రేటు ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వన్ప్లస్ నార్డ్ సిఇ 6లో 6.78-అంగుళాల 1.5K ఎఫ్హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 2772×1272 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీ, 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 3840Hz పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 3600 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ అడ్రినో 810 జీపీయూతో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్తో రన్ అవుతుంది. Read Also : Redmi 17 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17 5G ఫోన్ అతి చౌకైన ధరలో.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే? వన్ప్లస్ నార్డ్ సీఈ 6 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది. కొలతలు 16.25 సెం.మీ

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ను పోలీస్ స్టేషన్కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

టెక్ దిగ్గజం గూగుల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ ఏఐ మోడల్ "జెమినీ 3.8 ఫ్లాష్ సైబర్"ను పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. సైబర్ భద్రతకు సంబంధించిన లోపాలను అత్యంత వేగంగా గుర్తించి, వాటిని అంతే వేగంగా సరిదిద్దడంలో ఈ మోడల్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.ఈ ఏఐ మోడల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన పరిశ్రమల ప్రామాణిక 'సైబర్జిమ్' బెంచ్మార్క్లో ఇది 86.2 శాతం స్కోరును సాధించిందని ఆయన తెలిపారు. అదేవిధంగా, లోపాలను సరిచేసే విషయంలో 'CWE-బెంచ్' పరీక్షలో 47.2 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. గూగుల్ అందిస్తున్న ఇతర ఫ్లాష్ మోడల్స్ తరహాలోనే ఇది కూడా వేగవంతమైన పనితీరును, తక్కువ ఖర్చుతో కూడిన లభ్యతను కలిగి ఉంటుందని సుందర్ పిచాయ్ వివరించారు.గూగుల్ నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో దాదాపు 20 ప్రోగ్రామింగ్ భాషల్లోని లోపాలను కనుగొనడంలో ఈ మోడల్ 70 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును నమోదు చేసినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి పనితీరును కనబరుస్తూనే, "ఫ్లాష్" స్థాయి వేగంతో, సరసమైన ధరకే ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఇప్పుడో ఓ ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో అల్లుఅర్జున్ ఒకటి కాదు.. ఏకంగా మూడు విభిన్న షేడ్స్లో కనిపించబోతున్నారట. ఈ మూడు పాత్రల లుక్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయని టాక్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట. సాధారణంగా ఒక హీరో మూడు పాత్రల్లో కనిపిస్తే..వాళ్ల మధ్య అన్నదమ్ముల బంధమో, తండ్రీ కొడుకుల సంబంధమో, గత జన్మ కనెక్షన్లో ఉంటుందని ఊహిస్తాం. కానీ రాకాలో మాత్రం ఈ ముగ్గురు క్యారెక్టర్స్కు ఎలాంటి సంబంధం ఉండదట. ముగ్గురూ తమ తమ ప్రపంచాల్లో, తమ తమ కథల్లో కనిపిస్తారని..అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ మూడు కథలు ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి కలుస్తాయని టాక్. మూడు పాత్రల జీవితాలు వేర్వేరు..వాళ్ల సమస్యలు వేర్వేరు..వాళ్ల నేపధ్యాలు కూడా వేర్వేరుగా ఉంటాయట. కానీ ఏదో ఒక కీలకమైన సంఘటన ఈ ముగ్గురినీ ఒకే కథలోకి తీసుకొస్తుందట. Manasa Varanasi : పువ్వుతో తెలుగు అందం.. మానస వారణాసి క్యూట్ ఫోటోలు.. ముగ్గురికీ సంబంధం లేదు. కానీ ముగ్గురి కథ ఒక్కటే అనే కాన్సెప్ట్ సినిమాలో మెయిన్ హైలైట్గా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అల్లుఅర్జున్ కూడా ఈ మూడు షేడ్స్ కోసం తన లుక్, మేనరిజమ్స్, యాక్టింగ్లో పూర్తిగా కొత్త వేరియేషన్స్ చూపించబోతున్నారనే టాక్ ఉంది. ఒక పాత్రలో పూర్తిగా రఫ్ అండ్ రా లుక్లో..మరో పాత్రలో స్టైలిష్గా..ఇంకో పాత్రలో ఇప్పటివరకు చూడని డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మూడు పాత్రలు ఎందుకు ఒకేలా కనిపిస్తాయి.? వాళ్ల జీవితాల్లో ఒకే విధమైన సంఘటనలు ఎందుకు జరుగుతాయి.? చివరికి ఈ ముగ్గురి కథలు ఎలా కలుస్తాయి.? అన్నదే రాకాలో అసలు సస్పెన్స్ అంటున్నారు. నిజంగా ఇదే కాన్సెప్ట్తో

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున నిర్మించిన పళ్ల బురుసు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందే ఒక హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (సెప్టెంబర్ 02) నుంచే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమంగ్ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమైంది. అది కూడా ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరు ‘ది రన్నర్’ (The Runner). ‘వండర్ వుమెన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన గాల్ గాడోట్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. ప్రముఖ దర్శకుడు కెవిన్ మెక్డొనాల్డ్ తెరకెక్కించిన ది రన్నర్ సినిమా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గాల్ గాడోట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ది రన్నర్ సినిమా అందుబాటులో ఉంది. ‘ద రన్నర్’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. లండన్లో కొడుకుతో జీవించే ఓ మహిళ.. ఆ పిల్లాడ్ని ఓ రోజు స్కూల్లో దిగబెట్టి వస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత ఒక కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఒక గంటలో తాను

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్స్టేషన్కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

ఫారెన్ వెడ్డింగ్కు బ్రేక్.. గోల్డ్ కొనుగోళ్లకు చెక్! మోదీ సూచన వెనుక అసలు ఆర్థిక లెక్క ఇదే బంగారం, విదేశీ టూర్లకు డబ్బు తగ్గిస్తే రూపాయి బలపడుతుందా? మోదీ ‘స్వదేశీ’ పిలుపు వెనుక ఆర్థిక కారణాలేంటి? Narendra Modi Swadeshi : బంగారం కొనొద్దు.. విదేశాల్లో పెళ్లిళ్లు వద్దు.. ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా చెబుతున్న మాట.. అసలు మోదీ ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు ఇదే దేశంలో ఆర్థిక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి బంగారం కొనడం లేదా విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అది వారి వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తుంది. కానీ, కోట్లాది మంది ఒకేసారి ఇలాంటి (Narendra Modi Swadeshi) ఖర్చులు చేస్తే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుందనేది అక్షర సత్యం.. మరి మోదీ చెప్పినట్టు ఈ ఖర్చులను తగ్గిస్తే నిజంగానే భారత్కు లాభమా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడే దేశం. అందులో ముఖ్యంగా ముడి చమురు, బంగారం దిగుమతుల్లో కీలక వాటా మనదే. ఇందుకోసం విదేశాలకు డాలర్లు చెల్లించాలి. అలాగే, విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం భారతీయులు ఖర్చు చేసే డబ్బు కూడా దేశం నుంచి బయటకు పోతోంది. రూపాయిపై ఒత్తిడికి కారణం ఇదే : ఇలాంటి విదేశీ చెల్లింపులు అలాగే పెరుగుతుంటే కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి పెరుగుతోంది. దిగుమతుల కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా రూపాయిపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరం లేని విదేశీ ఖర్చులను తగ్గించుకుంటే డాలర్ డిమాండ్ను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అన్నదే ఈ వాదన వెనుక ఉన్న ఫైనాన్షియల్ లాజిక్. ప్రస్తుతం భారత్ విదేశీ మారక నిల్వలు సుమారు 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగితే అప్పుడు ఈ పరిస్థితి వేగంగా

ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్తో పంచుకోలేకపోతారు. ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్తో పంచుకోలేకపోతారు. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లల మార్కులు, ఆటల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. వారికి తామున్నామన్న భరోసా కల్పించడం, ఎమోషనల్గా దగ్గరవడం ముఖ్యమంటున్నారు. దీన్నే ‘ఎలిఫెంట్ పేరెంటింగ్’ అంటారు. మరి, దీనివల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.. ⚛ ఏనుగుల్ని పరిశీలిస్తే.. అవి వాటి పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తాయి. ఎప్పుడూ వాటికి దగ్గరగా ఉంటూనే వాటిని సంరక్షిస్తుంటాయి. ఇలా పిల్లల్ని మన రక్షణ వలయంలో ఉంచుకోవడం వల్ల వారిలో ఒక రకమైన ధైర్యం అలవడుతుంది. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారంటున్నారు నిపుణులు. ⚛ గున్న ఏనుగు తన తల్లితోనే కాదు.. ఇతర ఏనుగులతోనూ ప్రేమగా ఉంటుంది. ఇందుకు ఆ పిల్ల ఏనుగు తల్లే కారణం. ఎందుకంటే తల్లి ఏనుగు చిన్న వయసు నుంచే తన పిల్లల్ని ఇతర ఏనుగులతో కలిసిపోయేలా ప్రోత్సహిస్తుందట! ఇలా మనమూ మన పిల్లలకు.. మన బంధువులు, స్నేహితులతో కలుపుగోలుగా ఉండడం నేర్పితే.. వారిలో సామాజిక నైపుణ్యాలు అలవడతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల అనుబంధాల విలువ తెలుసుకోవడంతో పాటు నలుగురిలోనూ దూసుకుపోయే శక్తి లభిస్తుందంటున్నారు. ⚛ ఏనుగులు తమ తోటి జంతువులు చేసే పనుల్ని సునిశితంగా పరిశీలిస్తాయట. ఈ క్రమంలోనే పిల్ల ఏనుగులు చాలా విషయాలు నేర్చుకుంటాయట!

గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడినట్లేనని చాలామంది నమ్ముతారు. అయితే, అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేసి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు మాజీ టెక్కీల జీవితాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అనిశ్చితి వారిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి.ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ నలుగురు తమ బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. వీరిలో మెటా మాజీ ఉద్యోగిని బ్రిట్నీ బాల్ (37) ఏడాదికి 180,000 డాలర్ల వేతనం అందుకునేవారు. గూగుల్లో పనిచేసిన జాసన్ జాంగ్ (25) వార్షిక వేతనం 200,000 డాలర్లకు పైమాటే. ఇక మైక్రోసాఫ్ట్లో 23 ఏళ్లు సుదీర్ఘ అనుభవం ఉన్న జో ఫ్రెండ్ (62) 250,000 డాలర్ల వేతనం అందుకుంటుండగా, ఇంటెల్లో అంతే కాలం పనిచేసిన శ్రీరామ్ రామకృష్ణ (57) 180,000 డాలర్ల వేతనం పొందేవారు. ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా లేఆఫ్కు గురవడం వీరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం వారు ఊహించిన దానికంటే అత్యంత కష్టతరంగా మారింది. బ్రిట్నీ బాల్ ఏకంగా 8,000కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రీరామ్ రామకృష్ణ ఏడాది కాలంగా ఉద్యోగ వేట సాగిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రిట్నీ తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడమే కాకుండా, జీవన వ్యయాన్ని తగ్గించుకోవడానికి వాషింగ్టన్ డీసీ నుంచి వేరే

ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, నదులు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే వర్ష సంబంధిత ఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) వెల్లడించాయి (Uttarakhand heavy rain). భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు (Uttarakhand rain alert). భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి (12 dead Uttarakhand). అల్మోరాలోని ఒడ్యూదా గ్రామంలో తెల్లవారుజామున ఓ ఇంటి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఘటనలో అల్మోరా పట్టణంలోని ధార్కితుని ప్రాంతంలో పాత ఇంటి గోడ కూలి ఇద్దరు నేపాలీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్లోని కండోలీ బ్రిడ్జి సమీపంలో భారీగా ప్రవహించిన నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను రక్షించారు. ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

వివో V80 లైట్ 5Gలో భారీ 10,000mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండనుంది సెల్ఫీల కోసం 32MP HD వైడ్-యాంగిల్ కెమెరా Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. సెప్టెంబర్ 3న వివో V80 లైట్ 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ మలేషియా మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది. ఇటీవలే ఈ ఫోన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది. వివో V80 లైట్ 5G మలేషియాలో లాంచ్ కాకముందే ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ 10000mAh బ్యాటరీ (Vivo V80 Lite 5G) స్పెషల్ అట్రాక్షన్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో V80 లైట్ 5G లాంచ్ ముందు ఈ ఫోన్ ఇతర స్పెషల్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లాంచ్ తేదీ, ధర (అంచనా) : ఈ వివో V80 లైట్ 5G ఫోన్ సెప్టెంబర్ 3న మలేషియా మార్కెట్లోకి లాంచ్ కానుంది. లాంచ్ ముందే ఈ ఫోన్ ఫీచర్లపై తెగ చర్చ నడుస్తోంది. ప్రీ-ఆర్డర్లు ముందే ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ ఫోన్ను 3 మెయిన్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేయనుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! అందులో 6GB+128GB, 6GB+256GB, 8GB+256GB వేరియంట్లు ఉన్నాయి. అలాగే, పింక్, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా లభించనుంది. ఈ ఫోన్ ధర RM9,999.00గా కంపెనీ నిర్ణయించినట్టు అంచనా. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ వివో V80 లైట్ 5జీలో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఈ మోడల్ నంబర్తో పాటు, డైమెన్సిటీ చిప్సెట్ కూడా

ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో "ఇ.ఎం.ఐ" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు. బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన తీవ్రమైన ఫ్లాష్ ఫ్లడ్స్ ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. అక్కడ సంభవించిన ఐస్, రాక్ కొండచరియల విరిగిపాటు కారణంగా కొండప్రాంతాలు తీవ్రంగా ఊడ్చిపెట్టుకుపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏకంగా 1,127కి చేరినట్లు అధికారులు అధికారికంగా నిర్ధారించారు. వేలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ భారీ ప్రమాదం తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తీవ్ర విపత్తు సమయాన రియల్ హీరో, సినీ నటుడు సోనూ సూద్ స్వయంగా రంగానికి దిగి నేపాల్ ప్రజలకు అండగా నిలిచారు. ఆయన సెప్టెంబర్ 1న కాఠ్మండు చేరుకుని, ఆ తర్వాత సెప్టెంబర్ 2న అత్యంత ప్రభావిత ప్రాంతాలైన త్రిశూలి బజార్, నువాకోట్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయికి వెళ్లిన సోనూ సూద్ అక్కడ సర్వస్వం కోల్పోయిన వరద బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన తక్షణ ఉపశమనాన్ని అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు అవసరమైన ఆహారం, దుప్పట్లు, ఇతర అత్యవసర సహాయ సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. దీంతో అక్కడ నిరాశ్రయులైన వేలాది మందికి తక్షణ ఉపశమనం లభించినట్లయింది. ఇదిలా ఉండగా, బాధితులతో మాట్లాడే సమయంలో సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా వరదల్లో సర్వస్వం కోల్పోయిన 8 ఏళ్ల చిన్నారి క్రిస్టినాను కలిసి ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె పడిన బాధను చూసి కలచివేతకు గురైనట్లు ఆయన చెప్పారు. ఈ కష్టసమయంలో బాధితులను ఆదుకునేందుకు అందరూ కలిసి రావాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం కూడా నేపాల్ వైపు చూడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నేపాల్ ప్రజలు తమ ఇళ్లు, కుటుంబాలు, చివరకు పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో సీప్లేన్ ల్యాండింగ్కు ఉన్న అవకాశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర శాఖ అధికారులు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాజీవ్గాంధీ భవన్లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, హెలీ టూరిజం, సీప్లేన్ సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక మిగిలిన పనులను త్వరితగతిన చేపట్టి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను రెండు వారాల్లో పిలిచి, డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎంకు తెలిపారు. అదే నెలలో విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం.ఆదిలాబాద్ విమానాశ్రయంలో కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా కార్గో, ప్యాసింజర్ టెర్మినల్తో పాటు ఎంఆర్ఓ (MRO) (Maintenance, Repair and Overhaul) సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టులో రన్వేకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రన్వే అంశంపై ఉన్న సాంకేతిక అంశాలను త్వరగా పరిష్కరించి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హెలికాప్టర్ సేవలను

Nirmal: రాహుల్ గాంధీ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది: ఎమ్మెల్యే! ఈ వార్తకు సంబంధించిన

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

తనకు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఇప్పటికే రాతపూర్వకంగా వివరించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వ్యక్తిగతంగా కలిసి తాజా పరిణామాలపై మాట్లాడినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర ముఖ్య నేతలకు కూడా తన వాదనను లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో తనపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించానని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరానని తెలిపారు. పార్టీ నాయకత్వం తన వివరణ విన్న తర్వాత ఆలోచిస్తామని చెప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై వేచి చూస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ జీవితంతో ముడిపెట్టడం సరికాదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తెకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని, ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె మరో కుటుంబంలో భాగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చని అన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను ఖండించబోనని, అదే సమయంలో సమర్థించబోనని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది అనేక అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారని, కేవలం తన కుమార్తె కావడం వల్ల ఆమె మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తాను, తన భర్త రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు వేరని, కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలు వేరని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. తనపై మాత్రమే చర్యల విషయంలో చర్చ జరగడంపై కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తన విషయంలో ఒక విధమైన ప్రమాణాలు, క్యాబినెట్లోని ఇతర సామాజిక వర్గాల నేతల విషయంలో మరో విధమైన ప్రమాణాలు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇతర మంత్రులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై పార్టీ వైఖరి

హైదరాబాద్ ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభిస్తు్న్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పుకొచ్చారు. నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ మధ్య ఈ కారిడార్ ఉందని మంత్రి పొన్నం తెలిపారు. 3.23 కిలోమీటర్ల పొడవున కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్ నిర్మాణం ఉంటుందని వివరించారు. 2.53 కిలోమీటర్ల ప్రధాన వయాడక్ట్.. 200 మీటర్ల అప్ ర్యాంప్ ఉంటుందని చెప్పారు. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. చంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారమవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. ఆయా వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలోనూ కారిడార్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. హైదరాబాద్ను ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నూతన కారిడార్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్ శంషాబాద్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్: నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.90 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎలా చలామణి చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక మరికొందరు ఉన్నారా? నకిలీ కరెన్సీ తయారీకి అవసరమైన సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్ సైబరాబాద్ పరిధిలో 10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

560GHz బ్యాండ్తో ఈ 112 Gbps స్పీడ్ 5జీ టెక్నాలజీతో పోలిస్తే 20 రెట్లు వేగం భారీ ఫైల్స్ను వేగంగా డౌన్లోడ్ చేయొచ్చు Japan 6G Device : 5G కాదు.. 6G వస్తోంది.. ఇక సెకన్లలో కాదు.. క్షణాల్లో భారీ డేటా ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.. ఇటీవలే కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీపై జపాన్ సంచలన ప్రయోగం చేసింది. టోకుషిమా యూనివర్సిటీ రీసెర్చర్లు 560GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఏకంగా 112Gbps డేటా ట్రాన్స్మిషన్ సాధించారు. ఈ సక్సెస్ 6G భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచుతోంది. దాంతో 6జీ టెక్నాలజీపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. 5జీ కన్నా 20 రెట్లు స్పీడ్? : ఈ ప్రయోగంలో సాధించిన 112Gbps స్పీడ్ అనేది ప్రస్తుతం వినియోగంలో ఉన్న 5జీ టెక్నాలజీతో పోలిస్తే భవిష్యత్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఎంత వేగంగా ఉండొచ్చో చెప్పొచ్చు. అంటే.. భారీ మొత్తంలో డేటాను చాలా తక్కువ సమయంలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అయితే, ప్రస్తుతం మన ఫోన్లలో లభించే 6G స్పీడ్ కాదు. ఇది ల్యాబ్ స్థాయిలో చేసిన ప్రయోగం మాత్రమే. 6Gతో ఏం మారొచ్చు? : 6జీ కమర్షియల్గా వస్తే.. భారీ ఫైల్స్ డౌన్లోడ్లు, హై-క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, VR/AR, క్లౌడ్ గేమింగ్ వంటి డేటా-హెవీ సర్వీసులు మరింత వేగంగా పనిచేస్తాయి. రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రియల్టైమ్ కమ్యూనికేషన్ వంటి రంగాల్లోనూ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇంత స్పీడ్ ఎలా? : 560GHz వంటి అత్యంత హై ఫ్రీక్వెన్సీల వద్ద ట్రెడిషనల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లకు లిమిట్స్ ఎదురవుతాయి. ఇలాంటివి అధిగమించేందుకు రీసెర్చర్లు లేజర్ ఆధారిత ఆప్టికల్ టెక్నాలజీ, ఆప్టికల్ మైక్రోకోంబ్ వంటి విధానాలను వాడారు. వైబ్రేషన్లు, టెంపరేచర్ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆప్టికల్ ఫైబర్లను సిలికాన్ నైట్రైడ్ మైక్రోరెసోనేటర్ చిప్కు నేరుగా ఇంటిగ్రేట్ చేశారు. Read Also : Ration Card Update : రేషన్ తీసుకోలేకపోయారా? మరో ఛాన్స్

4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,499 మాత్రమే ఈ ఫోన్లో UFS 2.2 స్టోరేజ్, 1TB వరకు పెంచుకోవచ్చు బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా కూడా ఉంది Lava Virat V1 5G : వావ్.. లావా నుంచి కిర్రాక్ ఫోన్.. 128GB వేరియంట్లో లావా కొత్త ఫోన్ వచ్చేసింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, లావా విరాట్ V1 5జీ పేరుతో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. ఈ లావా ఫోన్ భారత మార్కెట్లో ఫస్ట్ టైమ్ గత జూలైలోనే వచ్చింది. అయితే, అది 4GB + 64GB అనే సింగిల్ వేరియంట్ మాత్రమే. కానీ, ఇప్పుడు కంపెనీ హై స్టోరేజ్ వేరియంట్ కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్లో 128GB స్టోరేజ్ ఆప్షన్ అందిస్తుంది. ఈ కొత్త వేరియంట్ ధర, స్పెషల్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. భారత్లో 128GB ధర ఎంత? : కంపెనీ లావా విరాట్ V1 5జీ ఫోన్ 128GB వేరియంట్ను లాంచ్ చేసింది. గతంలో ఈ ఫోన్ కేవలం 4GB + 64GB కాన్ఫిగరేషన్లో మాత్రమే లభించేది. ఇప్పుడు 128GB వేరియంట్ కూడా లభిస్తోంది. ఈ ఫోన్ కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,499 కాగా, కంపెనీ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్కార్ట్లో కూడా లభ్యమవుతోంది. లావా విరాట్ V1 5జీ స్పెసిఫికేషన్లు : ఈ లావా 5జీలో HD+ రిజల్యూషన్కు సపోర్ట్ చేసే 6.75-అంగుళాల LCD ప్యానెల్ ఉంది. స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ప్రాసెసింగ్ కోసం యూనిసోక్ T8200 చిప్సెట్ అమర్చారు. Read Also : Japan 6G Device : 5G కన్నా 20 రెట్లు స్పీడ్.. 6Gతో జపాన్ సంచలనం.. 112 Gbps

6.67-అంగుళాల HD LCD డిస్ప్లే అదుర్స్ 64MP ప్రైమరీ కెమెరా, 5,700mAh బ్యాటరీ అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కొనేసుకోవచ్చు Philips S7221 5G Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫిలిప్స్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది. అదే.. ఫిలిప్స్ S7221 5జీ.. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,700mAh బ్యాటరీ ఉంది. 64MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ (Philips S7221 5G Launch) అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫిలిప్స్ S7221 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. ధర ఎంతంటే? : ఫిలిప్స్ S7221 5జీ స్మార్ట్ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,499 కాగా, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, యాష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఫిలిప్స్ S7221 5జీలో 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల HD LCD డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్ప్రెడ్ట్రమ్ T765 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB LPDDR4 ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టు ఇచ్చే 5,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 166mm పొడవు, 77mm వెడల్పు, 8.95mm మందం, బరువు 200 గ్రాములు ఉంటుంది. కెమెరా సెటప్ పరంగా.. ఫిలిప్స్ S7221 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ram Mandir CEO: అయోధ్య రామమందిర్ ట్రస్టు బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత వైమానిక దళంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పశ్చిమ వైమానిక కమాండ్కు నాయకత్వం వహించిన అధికారిగా ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్గా భారత వైమానిక దళంలో చేరిన జితేంద్ర మిశ్రా.. తన సుదీర్ఘ కెరీర్లో 3,000 గంటలకు పైగా విమానాలు నడిపారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్గా సేవలందించారు. బెంగళూరులోని ఎయిర్క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో చీఫ్ టెస్ట్ పైలట్గా పనిచేశారు. ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్గా, రెండు కీలక వైమానిక స్థావరాలకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్గా బాధ్యతలు నిర్వహించారు. ఎయిర్ హెడ్క్వార్టర్స్తో పాటు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లోనూ కీలక పదవుల్లో పనిచేశారు. అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, బ్రిటన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో ఉన్నత స్థాయి రక్షణ శిక్షణ పొందారు. 2025 జనవరి 1న వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్తో సరిహద్దు ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక వసతులపై దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. దాదాపు నాలుగు

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Dr Subhash Chandra Case: తుది లీగల్ ఆర్డర్ లేకుండా పదిహేను రోజులుగా సాగుతున్న మీడియా ట్రయల్పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) దృష్టికి ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తీసుకువెళ్లారు. అదేవిధంగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి ఏకంగా ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సుభాష్ చంద్ర తరుఫున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. NCLAT తాత్కాలిక ఛైర్మన్ జస్టిస్ యోగేష్ ఖన్నా, సాంకేతిక సభ్యులు బరుణ్ మిత్రా, అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. సుభాష్ చంద్ర తరఫున సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్ర వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి అధికారిక తుది ఉత్తర్వు అమల్లో లేదని స్పష్టం చేశారు. అయినా.. రూ.22,006 కోట్ల మేర ఉన్న క్లెయిమ్లకు బదులుగా ఆయన కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారంటూ ఆయన ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రూ.22,006 కోట్ల రుణం సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని.. ఎస్సెల్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన గ్యారెంటర్గా మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆయన వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ.31.79 కోట్లు ఉండగా.. దాని ఆధారంగానే నిబంధనల ప్రకారం రూ.6.25 కోట్లు రుణదాతలకు, మరో రూ.25 లక్షలు న్యాయ ప్రక్రియ ఖర్చుల కోసం రీపేమెంట్ ప్లాన్ను రూపొందించారని వివరించారు. రీపేమెంట్ ప్లాన్ను ఆమోదిస్తూ ఎలాంటి

భారత పేస్ బౌలర్ ఆకిబ్ నబీ ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా యార్క్షైర్తో మ్యాచ్ సందర్భంగా సర్రే జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. కాగా కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ వన్-2026లో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో సర్రే- యార్క్షైర్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సర్రే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యార్క్షైర్ బ్యాటింగ్కు దిగింది. రంజీల్లో దుమ్ములేపాడు జమ్మూ కశ్మీర్కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. గత రెండు సీజన్లలో కలిపి వందకు పైగా వికెట్లు తీసి ఆకిబ్ నబీ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో భారత్-ఎ తరఫున ఇటీవలే అరంగేట్రం చేసిన ఆకిబ్.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వైదొలగగా.. అతడి స్థానంలో సెలక్టర్లు నబీని ఎంపిక చేశారు. అయితే, లంకతో రెండు టెస్టులు ఆడిన భారత తుదిజట్టులో మాత్రం నబీకి చోటు దక్కలేదు. కివీస్ టూర్ సన్నాహకాల్లో భాగంగా ఇక టీమిండియా తదుపరి టెస్టు సిరీస్లో న్యూజిలాండ్తో తలపడేందుకు అక్కడికి వెళ్లనుంది. కివీస్ టూర్లో బౌన్సీ పిచ్లపై నబీ సేవలను వాడుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఆ సన్నాహకాల్లో భాగంగానే అతడు ఇంగ్లండ్ కౌంటీల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆకిబ్ నబీ సర్రే తరఫున యార్క్షైర్తో పాటు.. హోవ్ వేదికగా సస్సెక్స్తో.. సర్రే సొంతమైదానంలో గ్లామోర్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్లలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే.. సర్రే తరఫున ఆకిబ్ నబీ తాజాగా అరంగేట్రం చేయగా.. భారత ఆటగాడు రాహుల్ చహర్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదే జట్టులో ఉన్న భారత ఆల్రౌండర్ మహిపాల్ లామ్రోర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్తో కలిసి పవన్ కళ్యాణ్తో ఓజీ యూనివర్స్కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్కు సొంత యూనిఫామ్ ఉంటుంది… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి. యూనిఫామ్ డిజైన్ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది. స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది. ప్రతి స్కూల్కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో పవన్ కు బర్త్ డే విషెస్ వెల్లువలా కురుస్తున్నాయి. అభిమనులతో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆయన బర్త్ డే రోజున సందర్భంగా అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అద్భుతమైన బిగ్ సర్ప్రైజ్ లభించింది. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ నుంచి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా విజన్ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ.. సౌత్ ఈస్ట్ ఎమోషన్స్, ఇండియన్ బ్యాక్డ్రాప్ను వెస్ట్రన్ శైలిలో ప్రజెంట్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ రోజుల నుంచి నేటి 1970ల కాలం దాకా సాగే ఈ కథాంశంలో అద్భుతమైన పొటెన్షియల్ ఉందని, ప్రతి ఒక్కరం మన లైఫ్టైమ్లో ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్లకు పవన్ కళ్యాణ్ సూచించారు.ఈ చిత్రంలో జపనీస్ సంస్కృతికి చెందిన సమురాయ్ ఎలిమెంట్స్, జపాన్ యాకుజా నేపథ్యం కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక వీడియోలో పవన్ సమురాయ్ కత్తి పట్టుకొని ఓజస్ గంభీర ఎంతో గాంభీర్యంగా కనిపించారు. 'సమురాయ్ రేమై.. యాకుజా మేకై' అనే పవర్ ఫుల్ క్యాప్షన్తో ఈ ఓజీ విశ్వం యొక్క విస్తృతిని పరిచయం చేశారు. ఓజీ యూనివర్స్ గురించి పవన్, తమన్, సుజీత్ మాట్లాడుతూ.. 'మన కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ సార్ అని తమన్ అనగా ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజీత్ అనడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. తమన్ అందించిన నేపధ్య సంగీతం, యానిమేషన్

కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. కోలీవుడ్ వర్సటైల్ హీరో కార్తీ (Karthi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే సర్దార్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది కాకుండా కార్తీ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో సినిమాకు ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కమర్షియల్ హంగుల దర్శకుడు సుందర్ సి (Sundar C) కాంబినేషన్లో కార్తీ హీరోగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఖరారైంది. వైవిధ్యమైన కథలతో పాటు వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన సుందర్ సి, కార్తీకి ఒక మంచి కథను వినిపించాడని, అది బాగా నచ్చడంతో హీరో కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని సుందర్ సి.. సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మాస్, యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సుందర్ సి.. ఈమధ్యనే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ధర్మాన్ సినిమాకు మొదట సుందర్ సినే దర్శకత్వం వహించాల్సింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ, ఆ తరువాత సుందర్ టను ఈ పెద్ద ప్రాజెక్టు ని హ్యాండిల్ చేయలేనని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత ధర్మాన్ అశ్వత్ మారిముత్తు చేతికి వెళ్ళింది. ఇక రజనీ సినిమా మిస్ అయ్యాక సుందర్.. కార్తీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది .. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా.. సర్దార్ 2 కూడా ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి

ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇప్పుడు ఇండియా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్పై సీరియస్గా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కేవలం రూ.10 లక్షలలోపు ధరలో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయడానికి ఈ కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం… మారుతి తీసుకురాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్యూవీల లాగా పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్ కాకుండా నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి ఈ కారు సరిగ్గా సరిపోతుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 నుంచి 315 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడమే దీని లక్ష్యం. ఈ రేంజ్, టాటా మోటార్స్ వారి టియాగో ఈవీకి సమానం. ఇప్పటికే ఉన్న పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడం కాకుండా పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్పైనే డిజైన్ రెడీ అవుతోందట. దీనివల్ల బ్యాటరీని సరైన స్థలంలో అమర్చడానికి, క్యాబిన్లో ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి, ఎలక్ట్రిక్ భాగాలను పర్ఫెక్ట్ గా అమర్చడానికి వీలవుతుందని మారుతి సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా ఎక్కువ భాగాలను తయారు చేయడం, చిన్న బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం వల్ల కారు ధరను అదుపులో ఉంచవచ్చని మారుతి సుజుకి భావిస్తోంది. సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య కొత్త ఈవి ఎక్స్-షోరూమ్ ధరను నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే భారత్లో చాలా మంది ఎలక్ట్రిక్ కారు కొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వ్యాగనార్, స్విఫ్ట్ వంటి కార్లను కొనాలనుకునే కస్టమర్లను కూడా ఈ కొత్త ఈవీ ఆకర్షిస్తుందని అంచనా. మారుతి ప్రీమియం షోరూమ్ నెక్సా ద్వారా ఇ-విటారా అమ్ముడవుతోంది. కానీ ఈ కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును అరీనా డీలర్షిప్ల ద్వారా అమ్మే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అరీనా నెట్వర్క్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్ని చాలా ప్రత్యేకంగా మార్చబోతున్నారట. హౌజ్ నుంచి, కంటెస్టెంట్ల ఎంపిక, వచ్చే కంటెస్టెంట్లు, గేమ్స్, టాస్క్ లు ఇలా అన్ని కొత్తగా ఉండబోతున్నాయని, ఎంటర్టైన్మెంట్ 10 టైమ్స్ అనేలా ప్లాన్ చేస్తున్నట్టు నాగార్జున ప్రోమోల్లో చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షో పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సారి చాలా వరకు తెలిసిన కంటెస్టెంట్లని ఎంపిక చేశారట. సెలబ్రిటీ విభాగంలో చాలా వరకు తెలిసిన వాళ్లే వస్తున్నారని సమాచారం. గతంలో సగం తెలియని వారు ఉండేది. ఇన్ఫ్లూయెన్సర్లు, సినిమా, టీవీకి సంబంధం లేని వారు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు ఉండేవారు. కానీ ఈ సారి చాలా వరకు ఎంటర్టైన్మెంట్ రంగానికి పరిచయం ఉన్నవాళ్లే వస్తున్నారట. అందులో ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు ఆల్మోస్ట్ కన్ఫమ్ అంటున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌజ్లోకి సెలబ్రిటీలు, కామనర్స్ కలిపి దాదాపు 16 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారట. వీరిలో పది మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ ఉంటారని సమాచారం. వీరిలో సెలబ్రిటీ విభాగంలో టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, అదిత్(త్రిగుణ్), యాంకర్ వర్షిణి సౌందరాజన్, ముఖేష్ గౌడ, కృష్ణుడు, నటి చైత్ర రాయ్, సుధీర్ రెడ్డి, దేబ్జానీ వంటి సెలబ్రిటీ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్కి ఎంపిక చేశారట. ప్రస్తుతం వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమే అయితే హౌజ్ ఈ సారి యమ రంజుగా ఉండబోతుందని చెప్పొచ్చు. గ్లామర్కి గ్లామర్, కామెడీకి కామెడీ, ఫైట్లకి ఫైట్లు గట్టిగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక కామనర్స్ విభాగంలో సింగర్ ఝాన్సీ, రోహిత్, షాలిని

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని కోరారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని కేంద్రమంత్రికి.. సీఎం రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో రన్ వే ఫైనలైజ్కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ వెల్లడించారు. ఆ పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్ తెలిపారు. తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్కు.. సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. హుస్సేన్ సాగర్లో సీ ప్లేన్ ల్యాండింగ్కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర
Gold Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు గత మూడేళ్ల కాలంలో కొన్ని రకాల గోల్డ్ ఫండ్స్ ఊహించని రీతిలో భారీ లాభాలు అందించాయి. వాల్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత 3 సంవత్సరాల కాలంలో లంప్ సమ్ పెట్టుబడిపై ఏడాదికి 25 శాతం కంటే ఎక్కువ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) రాబడిని అందించిన టాప్-5 పథకాల గురించిన వివరాలు ఎకనామిక్ టైమ్స్ విశ్లేషించింది. ఇందులో నాలుగు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్బీఐ, యాక్సిస్ వంటి దిగ్గజ సంస్థల స్కీమ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్యూటీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (UTI Gold ETF FoF) గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సగటున వార్షిక రాబడి 36.14 శాతంతో అందించింది. ఇందులో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.2.52 లక్షలు అవుతుంది.Read Also: NFOs: మ్యూచువల్ ఫండ్స్లో మరో 3 కొత్త స్కీమ్స్.. ఈరోజు నుంచే షురూ.. రూ.100 ఉన్నా చేరొచ్చు!క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Quantum Gold ETF FoF) గత మూడేళ్ల రిటర్న్స్ చూసుకుంటే సగటున ఏడాదికి 35.98 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల క్రితం లంప్ సమ్గా రూ.1 లక్ష పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లియితే ఆ విలువ రూ.2.51 లక్షలు అవుతుంది.ఎస్బీఐ గోల్డ్ ఫండ్ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఎస్బీఐ గోల్డ్ ఫండ్ (SBI Gold Fund) గడిచిన 3 ఏళ్లలో సగటున వార్షిక రాబడి 35.77 శాతం చొప్పున అందించింది. ఇందులో లంప్ సమ్ విధానంలో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టినట్లియితే ఇప్పుడు ఆ విలువ
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్, కేక్స్, క్యాండీలు, జెల్లీలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే ఈ షుగర్ ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు. కొంతమంది గాయాలు మానేందుకు పాలు లేదా టీలో బ్రెడ్ వేసుకుని తింటారు. కానీ వైట్ బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. అందుకే గాయాలు తగ్గాలంటే వైట్ బ్రెడ్ బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిది. కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచుతాయి. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. ప్రాసెస్ చేసిన బేకాన్, హాట్ డాగ్, సలామీ వంటివి తింటే గాయానికి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే చిప్స్ వంటి ప్యాకేజీ ఐటెమ్స్ తినడం వల్ల రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి గాయాలు మానడం ఆలస్యం చేస్తుంది. అందుకే గాయం మానాలంటే కెఫిన్ తక్కువగా తీసుకోవాలి. సాస్లో సోడియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును మరింత పెంచుతాయి. అందుకే గాయాలు మానాలంటే ఈ సాస్ లాంటి పదార్థాలు తినకూడదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే గాయాలు మానడం కోసం ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది