
Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?
Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?

Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాల్లో సాగిన సూచీలు చివరికి అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెంచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బాండ్ ఈల్డ్స్లో కదలికలు కూడా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగొచ్చనే అంచనాలకు బలం చేకూర్చాయి.సెన్సెక్స్ 417.49 పాయింట్లు నష్టపోయి 76,152.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 23,873.45 వద్ద ముగిసింది.నిఫ్టీకి 24,000 స్థాయి కీలకమైన అడ్డంకిగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దిగువన 23,800 స్థాయి తక్షణ కీలక మద్దతుగా ఉందన్నారు. ఈ స్థాయి కంటే నిఫ్టీ నిర్ణయాత్మకంగా దిగువకు వెళ్తే అమ్మకాలు మరింత పెరిగి 23,600 వరకు సూచీ పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.నిఫ్టీ షేర్లలో బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ట్రెంట్ ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.37 శాతం పెరగగా.. స్మాల్క్యాప్ సూచీ 1.2 శాతం లాభపడింది.రంగాల వారీగా చూస్తే రియల్టీ సూచీ అత్యధికంగా 2 శాతానికి పైగా పడిపోయింది. మీడియా, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్యూ బ్యాంక్, బ్యాంక్ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ రంగాలు కూడా విస్తృత మార్కెట్తో పోలిస్తే వెనుకబడ్డాయి.మరోవైపు రూపాయి కాస్త కోలుకుంది. డాలర్తో పోలిస్తే రూ.94.48 వద్ద బలంగా నిలిచింది. డాలర్ లిక్విడిటీ మెరుగుపడటం దీనికి మద్దతుగా నిలిచింది. దాదాపు 127 బిలియన్ డాలర్ల ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లు రూపాయిపై ఒత్తిడిని తగ్గించే బఫర్గా పనిచేస్తున్నాయని నిపుణులు తెలిపారు. రూపాయి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు. అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే.. హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48

Nalgonda: రైస్ మిల్లర్లపై అధికారుల వేధింపులు ఆపాలి: నల్లగొండ మిల్లర్ల సంఘం డిమాండ్! నల్లగొండ: రాష్ట్ర ప్రగతికి రైతు ఒక కన్నయితే.. రైస్ మిల్లరు మరో కన్ను. రైతు-మిల్లరు ఇద్దరూ బాగుంటేనే దేశం బాగుంటుంది" అని నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు. మిల్లులపై అధికారుల వేధింపులు ఆపాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మిల్లుల మూసివేత కొనసాగుతోందని తెలిపారు. బకాయిలు ఉన్న మిల్లులపై తనిఖీలు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బకాయిలు లేని మిల్లులను కూడా తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. 90 శాతం మంది మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం మానుకోవాలన్నారు

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా (Gold Smuggling)కు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా కేరళంలోని ఓ విమానాశ్రయంలో 8 నెలల చిన్నారిని స్మగ్లింగ్కు ఉపయోగించుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. శిశువు డైపర్లో దాదాపు రూ.50లక్షల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ ‘నవ్వే’.. పదేళ్లకు అతణ్ని కుటుంబంతో కలిపింది! యూఏఈలోని రస్ అల్ ఖైమా విమానాశ్రయం నుంచి మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి కరిపుర్ (కాలికట్) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు.. ఎనిమిది నెలల శిశువు, మరో ఇద్దరు చిన్నారులతో వచ్చిన సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. తనిఖీ చేయగా శిశువు డైపర్లో రూ.50లక్షల విలువైన బంగారంతోపాటు అతడి వద్ద మరింత బంగారం లభించింది. మొత్తం విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్మగ్లింగ్ మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. శిశువును ఉపయోగించి గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. లఖ్నవూలో మాజీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ నివాసం సమీపంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది

వివో V80 లైట్ 5Gలో భారీ 10,000mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండనుంది సెల్ఫీల కోసం 32MP HD వైడ్-యాంగిల్ కెమెరా Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. సెప్టెంబర్ 3న వివో V80 లైట్ 5G ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ మలేషియా మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది. ఇటీవలే ఈ ఫోన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది. వివో V80 లైట్ 5G మలేషియాలో లాంచ్ కాకముందే ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ అతిపెద్ద ఫీచర్ 10000mAh బ్యాటరీ (Vivo V80 Lite 5G) స్పెషల్ అట్రాక్షన్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో V80 లైట్ 5G లాంచ్ ముందు ఈ ఫోన్ ఇతర స్పెషల్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లాంచ్ తేదీ, ధర (అంచనా) : ఈ వివో V80 లైట్ 5G ఫోన్ సెప్టెంబర్ 3న మలేషియా మార్కెట్లోకి లాంచ్ కానుంది. లాంచ్ ముందే ఈ ఫోన్ ఫీచర్లపై తెగ చర్చ నడుస్తోంది. ప్రీ-ఆర్డర్లు ముందే ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ ఫోన్ను 3 మెయిన్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేయనుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! అందులో 6GB+128GB, 6GB+256GB, 8GB+256GB వేరియంట్లు ఉన్నాయి. అలాగే, పింక్, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా లభించనుంది. ఈ ఫోన్ ధర RM9,999.00గా కంపెనీ నిర్ణయించినట్టు అంచనా. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఈ వివో V80 లైట్ 5జీలో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఈ మోడల్ నంబర్తో పాటు, డైమెన్సిటీ చిప్సెట్ కూడా
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందిస్తున్న మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ గడువును మరో ఐదు రోజుల పాటుపొడిగించింది. దీంతో ఇప్పటివరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను తీసుకోలేకపోయిన అర్హులైన లబ్ధిదారులకు మరికొంత సమయం లభించింది. తాజా నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ కొనసాగనుంది.వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఆగస్ట్ 1వ తేదీన ప్రారంభమైంది. తొలుత ఆగస్ట్ 31వ తేదీ వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేయాలని అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరిగింది. దీంతో కొందరు కార్డుదారులు తమకు కేటాయించిన కోటాను నిర్ణీత సమయంలో తీసుకోలేకపోయారు.మరోవైపు.. రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లారు. దీంతో రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకునే అవకాశం చాలామందికి లేకుండా పోయింది. చివరి రోజుల్లో రేషన్ షాపుల వద్ద రద్దీ కూడా పెరగడంతో పంపిణీ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ.. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మూడు నెలల బియ్యం కోటాను కోల్పోకూడదనే ఉద్దేశంతో గడువును పొడిగించింది.తాజాగా పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రేషన్ దుకాణాల్లో 3 నెలల బియ్యం కోటాను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు రేషన్ సరుకులు తీసుకోని అర్హులైన కార్డుదారులు ఈ అదనపు గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత బియ్యం పంపిణీపై మరింత అవకాశం ఉండకపోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు

Ration Rice | రాయపోల్, సెప్టెంబరు 2 : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం మరోసారి వెలుగు చూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఈచర్ వాహనాన్ని టాస్క్ఫోర్స్ టీం-5 బుధవారం తెల్లవారుజామున పట్టుకుంది. వాహనాన్ని వెంబడించిన అధికారులు రాయపోల్ మండలం రామారం గ్రామంలోని మహాలక్ష్మి రైస్మిల్ వద్ద తనిఖీ చేయగా 120 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. ఇదే మిల్లులో మరో 280 క్వింటాళ్ల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో మొత్తం సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ టీం–5 అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఈచర్ వాహనాన్ని గుర్తించారు. వెంటనే వాహనాన్ని వెంబడించగా అది సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామంలోని మహాలక్ష్మి రైస్మిల్ వద్దకు చేరుకుంది. అక్కడ వాహనాన్ని తనిఖీ చేయగా 9 మెట్రిక్ టన్నుల (120 క్వింటాళ్ల) పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిల్లులోనూ భారీగా నిల్వ.. ఈచర్ వాహనంలో బియ్యాన్ని గుర్తించిన అధికారులు మహాలక్ష్మి రైస్మిల్లోనూ తనిఖీలు నిర్వహించారు. మిల్లులో మరో 280 క్వింటాళ్ల వరకు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో వాహనంలోని 120 క్వింటాళ్లతో కలిపి మొత్తం సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు వెల్లడైంది. పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన ఈచర్ వాహనం TS-05-UC-5599తో పాటు డ్రైవర్ మాలోత్ శ్రీకాంత్ (పుట్టగూడెం, రాజాపేట మండలం, యాదాద్రి-భువనగిరి జిల్లా)ను టాస్క్ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. మిల్లు యజమాని బచ్చు నాగరాజును కూడా విచారించారు. అనంతరం వాహనం, బియ్యం, డ్రైవర్ను స్థానిక పోలీసులకు అప్పగించారు. సంబంధిత డీటీసీఎస్ అధికారులకు సమాచారం అందించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయడానికి చర్యలు

6.67-అంగుళాల HD LCD డిస్ప్లే అదుర్స్ 64MP ప్రైమరీ కెమెరా, 5,700mAh బ్యాటరీ అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కొనేసుకోవచ్చు Philips S7221 5G Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫిలిప్స్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది. అదే.. ఫిలిప్స్ S7221 5జీ.. ఇందులో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,700mAh బ్యాటరీ ఉంది. 64MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ (Philips S7221 5G Launch) అందిస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫిలిప్స్ S7221 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.. ధర ఎంతంటే? : ఫిలిప్స్ S7221 5జీ స్మార్ట్ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,499 కాగా, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, యాష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : ఫిలిప్స్ S7221 5జీలో 720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల HD LCD డిస్ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్ప్రెడ్ట్రమ్ T765 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB LPDDR4 ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. Read Also : Lava Virat V1 5G : వారెవ్వా.. లావా కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. 128GB వేరియంట్ మీ బడ్జెట్ ధరలోనే..! ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టు ఇచ్చే 5,700mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 166mm పొడవు, 77mm వెడల్పు, 8.95mm మందం, బరువు 200 గ్రాములు ఉంటుంది. కెమెరా సెటప్ పరంగా.. ఫిలిప్స్ S7221 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్బీ 7 ఫేజ్లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది. ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు
గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ)లో నిర్వహించిన భూముల బహిరంగ వేలం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్టాపిక్గా మారింది. కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలు పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు తెలంగాణ హౌసింగ్ బోర్డు తాజాగా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలానికి ముందుగా చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీ పడటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వేలంలో ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్కు గజం రూ.2.36 లక్షల ధర పలికింది. మరో 2 ప్లాట్లు చదరపు గజం రూ.2.06 లక్షల చొప్పున విక్రయం అయ్యాయి. దీంతో కేపీహెచ్బీ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.ఈ బహిరంగ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు వారు పోటీపడటంతో పలు ప్లాట్లు హౌసింగ్ బోర్డు నిర్ణయించిన కనీస ధర కంటే అధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. వేలం పూర్తి అయ్యే సమయానికి 16 ప్లాట్లకు కలిపి చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.హైదరాబాద్లో కేపీహెచ్బీ ప్రాంతానికి ఇప్పటికే ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ గుర్తింపు ఉంది. నగరంలోని ప్రధాన ఐటీ, వాణిజ్య ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, మెట్రో సహా రవాణా సదుపాయాలు, నివాస ప్రాంతంగా ఉన్న డిమాండ్ వంటి అంశాలు ఈ

దేశంలో కోడిగుడ్ల ధరలు సామాన్యులకు భారాన్ని కలిగిస్తున్నాయి. గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు ఏకంగా 35 నుంచి 40 శాతం వరకు పెరిగాయని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) వెల్లడించింది. ఇటీవలి వరకు ఫామ్ వద్దే ఒక్కో గుడ్డు ధర రూ. 7 ఉండగా, రిటైల్ మార్కెట్లో అది రూ. 8 నుంచి రూ. 9కి చేరింది. రాబోయే శీతాకాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఈ20' ఇంధన విధానమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలన్న లక్ష్యంతో మొక్కజొన్నను భారీగా వినియోగిస్తున్నారు. కోళ్ల దాణా తయారీ వ్యయంలో 65 నుంచి 70 శాతం మొక్కజొన్నదే కావడం గమనార్హం. దేశీయంగా ఉత్పత్తవుతున్న మొక్కజొన్నలో దాదాపు 37 శాతాన్ని ఇథనాల్ తయారీ పరిశ్రమలకే మళ్లించడంతో, కోళ్ల పరిశ్రమకు దాణా కొరత ఏర్పడి ధరలు గణనీయంగా పెరిగాయి.గత మూడేళ్ల కాలంలో టన్ను మొక్కజొన్న ధర రూ. 14,000 నుంచి రూ. 26,500కి పెరిగింది. ముఖ్యంగా గత ఐదు నెలల్లోనే ధరలు 20 శాతం పెరగడం గమనార్హం. 2024లో 6 మిలియన్ టన్నుల మొక్కజొన్నను ఇథనాల్ తయారీకి వినియోగించగా, ప్రస్తుతం ఆ వినియోగం 17 మిలియన్ టన్నులకు చేరింది.ఇథనాల్ విధానంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాల రేటు పెరగడం వంటివి కూడా ఇటీవల ధరల పెరుగుదలకు ఇతర కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు

సన్న వడ్లకు రూ.500 బోనస్.. తెలంగాణ రైతులకు భారీ ఊరట రూ.8 లక్షల కోట్ల అప్పులు.. కాంగ్రెస్ పాలనపై పొంగులేటి ఫైర్ బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే.. పొంగులేటి సంచలన ఆరోపణలు Ponguleti Srinivasa Reddy : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని తమకు అప్పగించినప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం మోపిందని మంత్రి విమర్శించారు. అయినప్పటికీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 1000 రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించిందని తెలిపారు. రాజకీయ బేషజాలకు వెళ్లకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత పాలనలో పేరుకుపోయిన సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ : వ్యవసాయ రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ప్రోత్సాహకాలతో తెలంగాణ వరి ఉత్పత్తి పంజాబ్ను మించి రికార్డు స్థాయికి చేరిందని తెలిపారు. Read Also : Vivo T5 Launch : బడ్జెట్లో బిగ్ బ్యాటరీ బీస్ట్.. 50MP కెమెరా, 7050mAh బ్యాటరీతో ఈ వివో 5G ఫోన్ దుమ్మురేపుతోంది! ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టామని అన్నారు. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియగా మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే

టీ5 సిరీస్లో వివో కొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది. 7,050mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 50MP కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.వివో టీ5 5జీ ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 8జీబీ + 128జీబీ మోడల్ రూ.39,999, 8జీబీ + 256జీబీ ధర రూ.44,999. టాప్ వేరియంట్ 12జీబీ + 256జీబీ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.ఫోన్లో 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 1260×2800 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్సెట్, మీడియాటెక్ ఎన్పీయూ 850 ప్రాసెసర్తో ఫోన్ పనిచేస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయివెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరాకు ఓఐఎస్ సపోర్ట్ ఉంది. దీనికి 8MP అల్ట్రావైడ్ కెమెరా జత చేశారు. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4కే వీడియో రికార్డింగ్

రాత్రి భోజనంలో అన్నం తినాలా? చపాతీ తినాలా? లేక జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? బరువు తగ్గాలని ప్రయత్నించేవారు, షుగర్ గురించి జాగ్రత్త పడేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునేవారు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో.. రాత్రి భోజనంలో ఏం తినడం మంచిదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది రాత్రి భోజనంలో అన్నం తింటుంటారు. అన్నం శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లకు మంచి వనరు. అయితే అన్నం ఎంత మోతాదులో తింటున్నామన్నది చాలా ముఖ్యం. పెద్ద ప్లేట్ నిండా అన్నం తీసుకొని, కూర లేదా ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం కంటే, అన్నం పరిమాణాన్ని తగ్గించి కూరగాయలు, పప్పు, పెరుగు లేదా ఇతర ప్రోటీన్ ఆహారాలతో కలిపి తినడం మంచిది. ముఖ్యంగా రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తినే అలవాటు ఉన్నవారు పరిమాణంపై మరింత శ్రద్ధ పెట్టాలి. గోధుమ పిండితో తయారు చేసే చపాతీ కూడా రాత్రి భోజనానికి మంచి ఎంపిక. చపాతీలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారం కడుపు నిండిన భావనను ఎక్కువసేపు కలిగించడంలో సహాయపడుతుంది. అయితే చపాతీపై ఎక్కువ నెయ్యి లేదా వెన్న రాయకుండా, కూరగాయలు, పప్పు వంటి పోషకమైన ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది. సాధారణంగా జొన్నను ఎక్కువగా పాలిష్ చేయకుండా తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్, కొన్ని ఖనిజాలు, ఇతర పోషకాలు అందుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. 100 గ్రాముల జొన్నలో సుమారు 10.22 గ్రాముల ఫైబర్ 9.97 గ్రాముల ప్రోటీన్, అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. జొన్నలోని ఫైబర్ కారణంగా ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కలిగిస్తుంది. అందుకే రాత్రి భోజనంలో అన్నం పరిమాణాన్ని తగ్గించాలనుకునేవారికి జొన్న రొట్టె మంచి ఎంపిక. అయితే రాత్రి భోజనంలో ఏం తింటున్నాం అన్నదానికంటే మొత్తం ప్లేట్ ఎలా ఉందన్నది ముఖ్యం. అన్నం లేదా రొట్టెతో
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు

భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాన, సాంబార్ ఒక సంప్రదాయ వంటకం. దీనిని ఉదయం అల్పాహారంతో పాటు, మధ్యాహ్నం భోజనంలోనూ ఆనందిస్తారు. అనేక రకాల సాంబార్ వంటకాలు ఉన్నప్పటికీ, ఈ రెసిపీలో ఉల్లిపాయ, టమాటోను మాత్రమే ఉపయోగించి, సులభమైన పద్ధతిలో రుచికరమైన సాంబార్ను ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం... ఇది ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. టమాటాలు: 2 చిన్నవి (పప్పు ఉడికించడానికి), 2 చిన్నవి (తరిగినవి), 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) ఉల్లిపాయలు: 3 చిన్నవి (పొడవుగా కట్ చేసినవి) కరివేపాకు: కొద్దిగా (మరిగించేటప్పుడు, పోపులో) పప్పు ఉడికించుకోవడం: ముందుగా 100 గ్రాముల కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దానిలోకి రెండు చిన్న సైజు టమాటాలను పొడవుగా కట్ చేసి వేయాలి. పప్పు తీసుకున్న గ్లాస్ తో రెండు గ్లాసుల నీరు పోసి, కుక్కర్లో మూత పెట్టి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు చల్లారిన తర్వాత, మూత తీసి మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. కావాలంటే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కూరగాయలు - మసాలాలు కలపడం: మెత్తగా మెదుపుకున్న పప్పులోకి పొడవుగా కట్ చేసిన మూడు చిన్న సైజు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, సన్నగా తరిగిన రెండు టమాటాలు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉడికించడం: ఇప్పుడు దీనిలోకి అర కప్పు నీరు పోసి, మూత కొద్దిగా క్రాస్గా పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉల్లిపాయలు, టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత, నిమ్మ సైజు చింతపండును నానబెట్టి తీసిన రసాన్ని సాంబార్లోకి కలపాలి. మీ రుచికి తగ్గట్టు పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీరు - సుగంధ ద్రవ్యాలు: తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు నీరు

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని

బంగారం ధరల్లో వరుసగా రెండో రోజు కూడా భారీ తగ్గుదల నమోదైంది. గత కొద్దిరోజులుగా భారీగా పెరిగిన పసిడి రేట్లు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం ప్యూర్ గోల్డ్పై రూ.6,220 వరకు తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,900 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,39,350 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించిన అంచనాలు కూడా మార్కెట్ కదలికలకు కారణమవుతున్నాయి. అయితే బంగారం ధరలు ఇక్కడితోనే తగ్గుతాయా లేదా మళ్లీ పెరుగుతాయా అన్నదానిపై మార్కెట్ నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెండితో పోలిస్తే బంగారానికి ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచుకునేందుకు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం పసిడికి ప్రధాన బలంగా మారింది. వెండి విషయంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. వెండికి పారిశ్రామిక రంగం నుంచి వచ్చే డిమాండ్ కీలకం కావడంతో తయారీ కార్యకలాపాల్లో మందగమనం ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనాలో సోలార్ మాడ్యూల్స్ వృద్ధి నెమ్మదిస్తే వెండి డిమాండ్పై ఒత్తిడి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 2026 చివరి నాటికి తులం బంగారం రూ.1.35 లక్షల నుంచి రూ.1.55 లక్షల పరిధిలో ఉంటుంందని అంచనా. అయితే అమెరికా లేబర్ మార్కెట్లో తీవ్ర బలహీనత ఏర్పడి, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, రియల్ ఈల్డ్స్ పడిపోవడం, సంస్థాగత పెట్టుబడులు మళ్లీ బంగారం వైపు మళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం

అన్నం వండటం చాలా సులభమే అనిపిస్తుంది. కానీ చిన్న పొరపాటు జరిగినా అన్నం మెతుకులు ఒకదానికొకటి అంటుకుని జిగురుగా మారుతాయి. కొన్నిసార్లు అడుగున కూడా అంటుకుంటాయి. ముఖ్యంగా అన్నం గింజలు విడివిడిగా, పొడిపొడిగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం ముందుగా బియ్యాన్ని చల్లటి నీటితో బాగా కడగాలి. బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి చేతితో మెల్లగా కలపాలి. ఇలా రెండు, మూడు సార్లు కడిగితే బియ్యం మీద ఉన్న అదనపు పిండి కొంత వరకు తొలగిపోతుంది. దీంతో అన్నం ఉడికిన తర్వాత గింజలు ఒకదానికొకటి అంటుకునే అవకాశం తగ్గుతుంది. అయితే బియ్యం రకాన్ని బట్టి ఫలితం మారొచ్చు. బియ్యం కడిగిన తర్వాత నీళ్ల మోతాదుపై కూడా శ్రద్ధ పెట్టాలి. పొడవాటి గింజల బియ్యానికి చిన్న గింజల బియ్యం కంటే కొంచెం ఎక్కువ నీళ్లు అవసరం కావచ్చు. సాధారణంగా ఒక కప్పు బియ్యానికి సుమారు ఒకటిన్నర నుంచి రెండు కప్పుల నీళ్లు వాడొచ్చు. అయితే బియ్యం రకం, వండే విధానం బట్టి ఈ మోతాదు మారుతుంది. కొత్త రకం బియ్యం వండుతున్నప్పుడు ప్యాకెట్ మీద ఇచ్చిన సూచనలు చూడటం మంచిది. ముందుగా నీటిని మరిగించి అందులో బియ్యం వేయాలి. తర్వాత మూత పెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. బియ్యం మరింత పొడిపొడిగా రావాలంటే నీటిలో ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా కొద్దిగా వెన్న వేయొచ్చు. ఇది గింజలు ఎక్కువగా అంటుకోకుండా కొంత సాయం చేస్తుంది. బియ్యం ఉడుకుతున్నప్పుడు పదే పదే మూత తీసి చూడకూడదు. అలా చేస్తే లోపల ఉన్న ఆవిరి బయటకు వెళ్లి అన్నం ఉడికే విధానంపై ప్రభావం పడుతుంది. మంటను కూడా చాలా ఎక్కువగా పెట్టకూడదు. తక్కువ లేదా మధ్యస్థ మంటపై నెమ్మదిగా ఉడికిస్తే మంచి ఫలితం వస్తుంది. నీళ్లు పూర్తిగా ఇంకిపోయి అన్నం ఉడికిన తర్వాత వెంటనే వడ్డించకుండా గ్యాస్ ఆపి ఐదు నిమిషాలు మూత పెట్టి

Hyderabad Real Estate: హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరంలో భూముల ధరలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు నగరానికి సమీపంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్లో ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్ చుట్టూ రోడ్లు, హైవేలు, రవాణా సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, కొత్త రహదారులు, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులు నగర భవిష్యత్ అభివృద్ధిలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి క్రమంగా నగర శివారు ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు. ప్రధాన ప్రాజెక్టులకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొంతమంది పెట్టుబడిదారులు ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రోడ్డు సౌకర్యాలు, రవాణా, ఇతర మౌలిక వసతులు పెరిగితే భవిష్యత్తులో అక్కడ భూములకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వికారాబాద్ హైదరాబాద్కు దగ్గరగా ఉండటంతో పాటు ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండలు, పచ్చని ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వికారాబాద్కు రహదారి కనెక్టివిటీ మరింత మెరుగైతే ప్రయాణం సులభమవుతుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడు నివాస ప్రాంతాలు, చిన్న వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా అభివృద్ధి చెందవచ్చు. హైదరాబాద్ ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ పరిసరాల్లో కొన్ని చోట్ల భూములు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 120 గజాల ప్లాట్లు రూ.10 లక్షల లోపు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదు. రోడ్డు పక్కన ఉన్న భూములు, పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: పసిడి ప్రియులకు భారీగా ఊరటనిచ్చే వార్త. బంగారం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. 24క్యారెట్ల పసిడిపై రూ. 2,680 మేర దిగివచ్చింది. తాజా ధరల మార్పుతో హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,090కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.10,000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిర పడింది. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 6,000 మేర పైగా తగ్గింది. ఇరాన్ పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ దాడుల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై అంచనాలు తగ్గడం, డాలర్ కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపాయని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గింది. దీంతో 4,323 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ కూైడా 3.20శాతం నష్టపోయింది. దీంతో ఔన్సు వెండి 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన

ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్వర్క్తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 ‘సూపర్ ఛార్జర్ల’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్లో కొత్తగా 'టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్' (టీఏబీ), సర్వీస్ సెంటర్ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. అహ్మదాబాద్లో కొత్త సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా టెస్లా ఇండియా కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్లో తెరిచిన ఈ సెంటర్ భారత్లో కంపెనీకి చెందిన 7వ బాడీ షాప్, సర్వీస్ సెంటర్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే గురుగ్రామ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై నగరాల్లో టెస్లా తమ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తోంది. గుజరాత్ పరిధిలోని వినియోగదారులకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో బాడీ రిపేర్, కొలిజన్ రిపేర్ సేవలను ఇది అందిస్తుంది. టెస్లా వాహనాలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అవసరం చాలా స్వల్పమని అగర్వాల్ పేర్కొన్నారు. సింహభాగం సాంకేతిక సమస్యలను ‘రిమోట్ డయాగ్నోసిస్’ (సాఫ్ట్వేర్ ఆధారిత తనిఖీ) ద్వారానే పరిష్కరించవచ్చని, 24/7 సర్వీస్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో మోడల్ Y రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ధర సుమారుగా రూ.51.89 లక్షలు, మోడల్ వైఎల్ రూ.61.99 లక్షలుగా ఉంది. ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల

షావోమీ 17 అల్ట్రా అధికారిక ధర రూ. 1,39,999 అమెజాన్లో ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లతో రూ. 10వేలు తగ్గింపు మీ పాత స్మార్ట్ఫోన్తో ఎక్స్చేంజ్ చేసుకుంటే మరింత ఆదా Xiaomi 17 Ultra Price : షావోమీ 17 అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్. ఇందులో ప్రీమియం హార్డ్వేర్, హై-ఎండ్ కెమెరా ఉంది. ధర పరంగా చాలా ఖరీదైనది అయినా ప్రస్తుతం అమెజాన్ అదిరిపోయే డీల్ అందిస్తోంది. తద్వారా అసలు ధర రూ. 10వేల వరకు తగ్గుతుంది. షావోమీ 17 అల్ట్రా కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.. షావోమీ 17 అల్ట్రా డీల్ : షావోమీ 17 అల్ట్రా ఫోన్ అధికారిక ధర రూ. 1,39,999 మాత్రమే. ఈ ఫోన్ను అమెజాన్లో కొంటే ఎస్బీఐ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లతో ఈఎంఐ రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. అదనపు తగ్గింపు కోసం మీ పాత స్మార్ట్ఫోన్ అమెజాన్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. Read Also : OnePlus 16 : సూపర్ ఫోన్ మావా.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో వన్ప్లస్ 16 వస్తోంది.. ఫుల్ డిటెయిల్స్! షావోమీ 17 అల్ట్రా స్పెసిఫికేషన్లు : షావోమీ 17 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్పై రన్ అవుతుంది. అంతేకాదు.. ఈ షావోమీ ఫోన్ 6,000mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. షావోమీ

దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం క్రితం రోజు లాభాలను నిలబెట్టుకోలేక స్వల్ప నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 24,055 పాయింట్ల వద్ద స్థిరపడగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 12 పాయింట్లు పడిపోయి 76,944 వద్ద నిలిచింది. దేశీయంగా ఇటీవలి జీడీపీ గణాంకాలు బలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల పెరుగుదల పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరగడం భారతదేశం లాంటి దిగుమతి ఆధారిత దేశాల ద్రవ్యోల్బణానికి సవాలుగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. అమెరికా బాండ్ ఈల్డ్లు పెరగడం, అక్కడి వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగుతాయనే అంచనాలు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణకు దారితీశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్లు తీవ్ర ప్రతికూలతల్లో ఉన్నప్పటికీ రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎమ్సీజీ, ఐటీ విభాగాలు సూచీలకు ఆసరాగా నిలిచాయి. ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిసి నష్టాల తీవ్రతను పరిమితం చేశాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం స్వల్పకాలంలో విదేశీ మార్కెట్ల సంకేతాలు, అంతర్జాతీయ చమురు ధరల గమనం ఆధారంగానే ఇండియన్ మార్కెట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు! మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. 2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి

బ్లాక్ రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు..డాక్టర్లు ఆశ్చర్యపోయారు!బ్లాక్ రైస్ తో ఆరోగ్య ప్రయోజనాలు..డాక్టర్లు ఆశ్చర్యపోయారు! September 01 Jyothi Gadda బరువు తగ్గించడంలో సహాయం: బ్లాక్ రైస్లో పీచు పదార్థం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపుని నిండుగా ఉంచి, ఆకలిని తగ్గించడం ద్వారా వేగంగా బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడతాయి. మధుమేహం నియంత్రణ: దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా చూస్తూ, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలం: బ్లాక్ రైస్కు ఆ నలుపు రంగు ఆంతోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ వల్ల వస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి, కణాల నష్టాన్ని నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు: ఇందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీనివల్ల రక్తనాళాలు పూడుకుపోకుండా గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది పేగుల కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను నివారించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయ పరిశుభ్రత: నల్ల బియ్యంలో ఉండే ప్రత్యేక ఆంటియాక్సిడెంట్లు కాలేయంలోని వ్యర్థాలు, విషపదార్థాలను బయటకు పంపుతాయి. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు రాకుండా కాలేయం శుభ్రపడుతుంది. క్యాన్సర్ నివారణ గుణాలు: ఇందులోని ఆంతోసైనిన్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను, అవి వ్యాపించడాన్ని అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పేగు క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. క్యాన్సర్ నివారణ గుణాలు: ఇందులోని ఆంతోసైనిన్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను, అవి వ్యాపించడాన్ని అడ్డుకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పేగు క్యాన్సర్ల ముప్పును తగ్గించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్! ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! వర్షాకాలంలో రాగులు
Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్నాలజీ సెక్టార్ కంపెనీ టీసీసీ కాన్సెప్ట్ లిమిటెడ్ (TCC Concept Limited) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ సెప్టెంబర్ 4గా నిర్ణయించినట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. ఈ కంపెనీ స్టాక్ ఈ ఏడాది 2026 ఫిబ్రవరి నెలలోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం విశేషం. ఆరు నెలల్లోనే తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 100 షేర్లు కొని ఉంటే 500 షేర్లుగా మారనున్నాయి.అయితే సెప్టెంబర్ 4వ తేదీకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. 3 రోజుల్లో ఈ కంపెనీ షేర్స్ ఎక్స్ - స్ప్లిట్ ట్రేడింగ్ చేయనున్నాయి. ఆలోపు షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది. ప్రతి ఒక్క షేరు 5 షేర్లుగా మారనున్నాయి. అయితే, అందుకు తగినట్లుగానే ఈ స్టాక్ ధర తగ్గుతుందని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కానీ, పెట్టుబడి విలువలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ కంపెనీ షేరు గత 6 నెలల కాలంలో 52 శాతం వరకు నష్టపోయింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 225 సమీపంలో ఉన్న షేర్ ధర రూ. 45ల స్థాయికి దిగివస్తుంది.Read Also: Stock Split: 6 నెలల్లోనే పెట్టుబడి ట్రిపుల్.. లక్షకు రూ.3.45 లక్షలు.. ఇప్పుడు 1 షేరు కొంటే 10 షేర్లుగా మారుస్తోన్న కంపెనీ!కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. టీసీసీ కాన్సెప్ట్ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీస్ యాక్ట్ 2013 లోని సెక్షన్ 61కి అనుగుణంగా 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండే 5 షేర్స్ గా స్ప్లిట్ చేసేందుకు ఆమోదం

September New Rules: ప్రతి నెలా మొదటి తేదీ సామాన్యుడి ఆర్థిక పరిస్థితికి, దైనందిన జీవితానికి సంబంధించిన అనేక కొత్త మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు, సెప్టెంబర్ 1, 2026 నుండి, వంటగ్యాస్ ధరల నుండి విమాన ఛార్జీలు, అద్దె, కార్ల కొనుగోళ్ల వరకు దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని నిబంధనలు ఉపశమనం కలిగించినప్పటికీ, చాలా నిర్ణయాలు జేబుపై భారాన్ని పెంచడం ఖాయం. ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రధాన మార్పులను నిశితంగా పరిశీలిద్దాం. 1. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు ఖరీదైనవిగా మారాయి: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోగ్రాముల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచాయి. ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది. అయితే, సాధారణ ప్రజలకు ఊరటనిస్తూ, 14.2 కిలోగ్రాముల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 2. విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగాయి: ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు 5.46% (సుమారుగా లీటరుకు రూ.6.28) పెరిగాయి. కొత్త ధరలు ఇప్పుడు లీటరుకు రూ.121.28 గా ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, విమానయాన సంస్థలు భవిష్యత్తులో విమాన ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. 3. ముంబైలో ఆటో, నలుపు-పసుపు టాక్సీ ఛార్జీలు పెరిగాయి: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఆటో-రిక్షా కనీస ఛార్జీని రూ.26 నుండి రూ.27కు, నలుపు-పసుపు టాక్సీల ప్రారంభ ఛార్జీని రూ.31 నుండి రూ.33కు పెంచారు. ఈ కొత్త ఛార్జీలు మొదటి 1.5 కిలోమీటర్ల వరకు వర్తిస్తాయి. 4. టాటా, హ్యుందాయ్ కార్లను కొనడం మరింత ఖరీదైనది: మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ముడిసరుకుల ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపుతూ, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25,000

భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ జీడీపీ 7.8 శాతం మేర వృద్ధి సాధించిందన్న ప్రధాని మోదీపై రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. అవన్నీ ప్రచారార్భాటమేనని కొట్టిపారేశారు. గణంకాల గారడీతో మోదీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందని ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 'హై వోల్టేజ్' ధరల భారాన్ని సామాన్యులపై మోపుతోందని ఆరోపించారు. ముడిసరకుల ధరలు పెరగడంతో సామాన్యుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరాభారం కేవలం వంటింటికే పరిమితం కాలేదని అన్నారు. రాగి వైర్ ధర రూ. 850 నుంచి రూ. 1,700 కి, అల్యూమినియం ధర రూ. 350 నుంచి రూ. 650 కి చేరిందని వెల్లడించారు. 1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలకు పెరిగిందని చెప్పారు. హోమ్ అప్లయన్సెస్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయని అన్నారు. స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్, కార్మికులు ఖర్చు ఇలా అన్ని పెరిగాయని అన్నారు. ధరాభారం అన్ని వైపుల నుంచి ప్రజలకు షాకులిస్తోందని వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా కూడా మోదీ ప్రభుత్వం మాత్రం వాస్తవాలను మరుగున పరిచి, గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉందని మండిపడ్డారు. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దేశంలోని పరిస్థితుల్ని తప్పుగా చూపిస్తున్నాయని అన్నారు. వీక్ సెంటీమెంట్ను ప్రతిఫలించట్లేదని చెప్పారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్ ప్రగతిబాటలో దూసుకుపోతుంటే నిరాశావాదులు మాత్రం అసత్యాలను ప్రతిధ్వనిస్తున్నారని విమర్శించారు. ఈ వృద్ధి రేటు భారతీయుల సమష్టి శక్తికి
Gold Rate Today: పసిడి ప్రియులు ఎగిరిగంతేసే శుభవార్త. బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. దేశీయంగా రెండు రోజుల్లోనే తులం బంగారం రేటు రూ.4300 మేర దిగివచ్చింది. ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా మెరుపుదాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం రేట్లు పడిపోతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోందని చెప్పవచ్చు. మరి సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్లో బంగారం, వెండి రేట్లుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో సెషన్లోనూ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రెండ్రోజుల్లో రూ.4360 మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1470 మేర తగ్గడంతో తులం రేటు రూ.1,56,770 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు రూ.1350 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ.1,43,700 వద్దకు దిగివచ్చింది. ఇక వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో రేటు రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.విజయవాడ, విశాఖలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు విజయవాడ, వైజాగ్ నగరాల్లోనూ ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1470 తగ్గడంతో రూ.1,56,770 వద్దకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.1350 తగ్గడంతో రూ.1,43,700 పలుకుతోంది. ఇక కిలో వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ.2,60,000 పలుకుతోంది.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి ఈరోజు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో, విలక్షణమైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు బాబు మోహన్. 90లలో సిల్వర్ స్క్రీన్ పై బాబు మోహన్ హవా నడిచింది. కామెడియన్ గా బాబు మోహన్ మార్క్ తిరుగులేనిది. కొన్ని సినిమాల్లో ఆయన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. కోట శ్రీనివాసరావుతో బాబు మోహన్ కాంబినేషన్ సూపర్ హిట్. వీరిద్దరూ కలిసి పదుల సంఖ్యలో మూవీస్ చేశారు. మామగారు మూవీలో వీరిద్దరి కామెడీ ఐకానిక్. రాజకీయాల్లోకి వచ్చాక బాబు మోహన్ సినిమాలు తగ్గించారు. ఈ మధ్య అడపాదడపా మాత్రమే నటిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ చాలా ఫిట్ గా, గ్లామర్ గా కనిపిస్తూ.. అందరికి షాక్ ఇస్తున్నాడు. దశాబ్దాలు గడిచినా, వయసు పెరుగుతున్నా ఆయన రూపంలో గానీ, ఉత్సాహంలో గానీ ఎలాంటి మార్పూ రాకపోవడం చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు. రోజురోజుకూ ఆయనలో గ్లామర్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని, మరి ఈ వయసులోనూ ఆయన ఎంతో ఎనర్జిటిక్గా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటి? అని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈక్రమలో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన డైట్ చార్ట్ ను బయటపెట్టారు. సాధారణంగా మన దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలో అన్నం (భోజనం) ప్రధాన భాగం. కానీ బాబు మోహన్ గత రెండు సంవత్సరాలుగా భోజనం చేయడం పూర్తిగా మానేశారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జీర్ణశక్తి తగ్గడం, శరీరంలో కొవ్వు పెరగడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ఆయన హెవీగా ఉండే అన్నాన్ని పక్కన పెట్టి, తేలిగ్గా జీర్ణమయ్యే సహజమైన ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎంతో తేలికైన, ఆరోగ్యకరమైన టిఫిన్ను బాబుమోహన్ ఎంచుకుంటారు. ఉదయాన్నే 3 లేదా 4 ఇడ్లీలు మాత్రమే

వంట చేసేటప్పుడు కాస్త అటూ ఇటూ దృష్టి మారినా లేదా మంట ఎక్కువగా ఉన్నా అన్నం, పప్పు లేదా గ్రేవీ కూరలు అడుగున మాడిపోవడం సహజం. అలాంటప్పుడు ఆ మాడిన వాసన వంటకం మొత్తానికి పట్టుకుని, దాని రుచిని పూర్తిగా పాడుచేస్తుంది. అయితే, మాడిపోయిన ఆహారాన్ని పారేయాల్సిన అవసరం లేకుండా, ఆ వాసనను పూర్తిగా మాయం చేసే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం.. అన్నం లేదా పప్పు మాడిపోయిందని గ్రహించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. పాత్ర అడుగున ఉన్న మాడిన భాగాన్ని అస్సలు కలపకుండా లేదా గీకకుండా, పైన ఉన్న మంచి ఆహారాన్ని మాత్రమే వేరొక శుభ్రమైన పాత్రలోకి మార్చుకోండి.ఆ వేడి వంటకం పైన 1-2 వైట్ లేదా బ్రౌన్ బ్రెడ్ ముక్కలను పరిచినట్లు ఉంచి, పాత్రపై మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇది ఎలా పనిచేస్తుంది?: బ్రెడ్లో స్పాంజ్ వంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వేడి ఆహారం నుండి వెలువడే ఆవిరిలో ఉండే మాడిన పొగ కణాలను బ్రెడ్ పూర్తిగా పీల్చేసుకుంటుంది. 10 నిమిషాల తర్వాత బ్రెడ్ ముక్కను తీసి పారేస్తే, మాడిన వాసన మాయమవుతుంది. మాడిపోయిన పప్పు లేదా అన్నాన్ని వేరే పాత్రలోకి మార్చిన తర్వాత, ఒక పెద్ద ఉల్లిపాయను రెండు సగాలుగా కోసి, ఆ ముక్కలను వేడి ఆహారంలో మునిగేలా ఉంచండి. మూతపెట్టి 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలను తీసేయండి. ఇది ఎలా పనిచేస్తుంది?: ఉల్లిపాయలో ఉండే సహజమైన సల్ఫర్ సమ్మేళనాలు, తీవ్రమైన సువాసన ఆహారంలోకి ఇంకిన మాడిన వాసనను తగ్గించేస్తుంది. ఒక చిన్న బొగ్గు ముక్కను స్టవ్పై ఎర్రగా కాలే వరకు కాల్చండి. వేరే పాత్రలోకి మార్చిన పప్పు లేదా కూర మధ్యలో ఒక చిన్న స్టీల్ గిన్నె ఉంచి, దానిలో ఈ కాలిన బొగ్గును పెట్టండి. బొగ్గుపై అర స్పూన్ నెయ్యి లేదా

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి

Gold, Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో గత కొన్ని రోజులుగా భారీగా తగ్గినట్లే తగ్గి నాలుగైదు రోజుల నుంచి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారంలో తులం బంగారం ధర రూ.1.70 లక్షల చేరువలో వెళ్లిగా క్రమంగా దిగి వచ్చింది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినట్లయ్యింది. కానీ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారంపై స్వల్పంగా అంటే రూ.160 వరకు పెరిగి ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్లపై రూ.150 పెరిగి రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై రూ.120 పెరిగి ప్రస్తుతం రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ధర పెరిగితే వెండి మాత్రం విరుద్దంగా పయనిస్తోంది. కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వ ఎండి ధర 1,50,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ.1,60,000 వద్ద ఉండగా, ఇప్పుడు వారం రోజుల్లోనే 10 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి మంగళవారం స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.44 శాతం పెరిగి 66.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పోయినవారం చివర్లో బంగారం ధర పతనం మొదలైంది. ఈ వారం కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలకు దిగారు. దీంతో పసిడిపై మరింత ఒత్తిడి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర కూడా గణనీయంగా తగ్గింది. దాని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపైనా కనిపించింది. ఫలితంగా బంగారం ధరలు కొంతమేర చల్లబడ్డాయి. ఇదే సమయంలో

దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన రేట్లు ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 9.50 పైసల మేర పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై ఎలాంటి అదనపు భారం పడలేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు ఇచ్చాయి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ధరల వివరాల ప్రకారం, ఈ పెంపు వాణిజ్య పరమైన ఎల్పీజీ వినియోగానికి మాత్రమే పరిమితమైంది. అయిదు కిలోల నాన్-డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. నిన్నటివరకు 762 రూపాయలు ఉన్న అయిదు కిలోల నాన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ధర ఇప్పుడు 764 రూపాయలకు చేరుకుంది. అయిదు కిలోల డొమెస్టిక్ సిలిండర్లు, ఎక్స్ట్రాలైట్ గ్యాస్ ధరల జోలికి వెళ్లలేదు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.ఈ పెంపుతో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,738 నుంచి రూ. 2,747.50కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సిలిండర్ ధర రూ. 2,691.50 నుంచి రూ. 2,701కు పెరిగింది. చెన్నైలో దీని ధర రూ. 10.50 పైసల మేర పెరిగింది. ఇక్కడ వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,916.50కు చేరుకుంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, ఇతర చిరు క్యాంటీన్లు.. ఈ 19 కిలోల వాణిజ్య సిలిండర్లపైనే ఆధారపడతాయి. తాజా పెంపు పెద్ద వడ్డన కాకపోయినప్పటికీ.. ఇప్పటికే రేట్లు 2,800 రూపాయలను దాటిన నేపథ్యంలో అవి భారంగానే మారాయి. చిన్న చిన్న హోటళ్ల నిర్వహణ వ్యయంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది

దేశంలో పసిడి, వెండి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత కొంతకాలంగా భారీగా ఊరట కలిగిస్తూ వచ్చిన వీటి రేట్లు.. నేడు పుంజుకున్నాయి. స్వల్ప పెరుగుదల నమోదైంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల మార్పు కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, డాలర్ లో నమోదవుతున్న హెచ్చుతగ్గులు, ఫెడరల్ బ్యాంక్ నిర్ణయాలు దీనికి కారణం అయ్యాయి.సోమవారం నాటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల నామమాత్రపు పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు 150, 18 క్యారెట్లు 120 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,56,930 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,850 వద్ద ట్రేడ్ అయింది.ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు అలాగే సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా బంగారం ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటుంది. మార్కెట్లలో నెలకొన్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు స్థిరమైన లాభాల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల మార్కెట్లో నిరంతరం డిమాండ్ పెరుగుతూ వస్తోంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ. 1,43,850 18 క్యారెట్లు రూ. 11,773 గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,56,930, 22 క్యారెట్లు రూ.1,43,850, 18 క్యారెట్లు రూ. 1,17,730 పలుకుతోంది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా 1,56,930, రూ. 1,43,850, 1,21,550 గా రికార్డయ్యాయి. ముంబైలో రూ. 1,56,930, రూ. 1,43,850 రూ. 11,770 వద్ద కొనసాగుతున్నాయి.వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక

గణపతి విగ్రహాల ధరలు పెంపు ముడిసరుకులు, రవాణా భారం అధికం ఈసారి ఇరవైశాతం రేట్లు పెరుగుదల Ganesh Idol Prices Hike: వినాయక చవితి పండగ సమీపిస్తుండటంతో భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. హైదరాబాద్ నగరంలతో పాటు శివారు ప్రాంతాల్లో విగ్రహాల తయారీ పనులు తుదిమెరుగులకు చేరుకున్నాయి. అయితే ఈ ఏడాది గణనాథుని విగ్రహాల ధరలు భారీగా పెరగనుండటంతో భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ధరల భారం తప్పేలా లేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి విగ్రహాల రేట్లు దాదాపు 25 శాతం వరకు పెరిగినట్లు తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. PMAY-U: ఏపీ పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. సొంతింటి కోసం రూ.2.89 లక్షల సాయం.. డైరెక్ట్ అకౌంట్ లోకే ముడిసరుకులు, రవాణా భారం - పెరిగిన విగ్రహాల రేట్లు: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), కొబ్బరిపీచు, రంగులు, అలంకరణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా రవాణా ఛార్జీలు కూడా భారంగా మారాయని తయారీదారులు వెల్లడించారు. గతేడాది 20 అడుగుల విగ్రహం ధర(Ganesh Idol Prices Hike) రూ.85 వేలు ఉండగా, ఈసారి అది రూ.లక్ష దాటింది. అలాగే సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 నుండి 16 అడుగుల విగ్రహాల ధరలు గతంలో రూ.50-60 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.70 నుండి 80 వేల వరకు పలుకుతున్నాయి. ఎవర్ గ్రీన్ ధూల్పేట్ - శివార్లకు విస్తరించిన వ్యాపారం: నగరంలో వినాయక విగ్రహాల తయారీ అనగానే మొదట గుర్తుకొచ్చే ధూల్పేట్తో పాటు నాగోలు, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ధూల్పేట్ విగ్రహాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా విశేషమైన డిమాండ్ ఉంది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలను దిగుమతి చేసుకుని విక్రయిస్తుండటంతో మార్కెట్లో పోటీ బాగా పెరిగింది. Telangana
LPG Price: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పెరిగింది. సెప్టెంబర్ నెల ప్రారంభం రోజున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను (Commercial LPG Cylinder Price) పెంచాయి. దీంతో వాణిజ్య సిలిండర్ వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, క్యాంటిన్ల వంటి సంస్థలపై అదనపు భారం పడుతుంది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ సామాన్యులకు ఊరట కల్పించారు. మరి నగరాల వారీగా సిలిండర్ ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) విడుదల చేసిన తాజా ధరల ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 9.50 మేర పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర రాజధాని నగరంలో రూ. 2,747.50 వద్దకు చేరుకుంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలోనూ రూ. 9.50 పెరగడంతో రూ. 2691.50 నుంచి రూ. 2701 వద్దకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో రూ. 11 మేర పెరిగి రూ.2,996 వద్దకు చేరింది. చెన్నై నగరంలో 19 కిలోల సిలిండరే ర్టు రూ. 2916.50 వద్దకు పెరిగింది. అంటే ఒక్క సిలిండర్ పై రూ. 10.50 మేర పెంచారు. ఇతర నగరాల్లోనూ ధరలు పెరిగాయి. అయితే గత ఆగస్టు నెలలో వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే. నగరం 19 కిలోల సిలిండర్ కొత్త ధరలు ఢిల్లీ రూ.2747.50 ముంబై రూ.2691.50 హైదరాబాద్ రూ.2996 చెన్నై రూ.2916.50 గురుగ్రామ్ రూ.2764 నోయిడా రూ.2747.50 లఖ్నవూ రూ.2870 పాట్నా రూ.3044 స్థిరంగానే 14.2 కిలోల సిలిండర్ ధరవాణిజ్య వినియోగ సిలిండర్ ధరలను మరోసారి పెంచినప్పటికీ గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగానే కొనసాగించారు. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కిలోల

LPG Price Hike: సెప్టెంబర్ నెల తొలిరోజే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం ఇల్లాళ్లకు ఊరటనిచ్చే విషయంగా మారింది. ఆగస్టు నెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన ఆయిల్ కంపెనీలు, సెప్టెంబర్ 1న మళ్లీ పెంచి షాకిచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ ప్రకటన ప్రకారం 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.9.50 వరకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో అయితే రూ.11 మేర భారం పెరిగింది. గతేడాది చివరిలో ధరలు తగ్గినప్పటికీ, మళ్లీ పెరగడం వల్ల హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, టీ కొట్ల నిర్వాహకులకు రోజువారీ నిర్వహణ వ్యయం పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరా వ్యయాలు, రూపాయి మారకం విలువల్లో వచ్చే మార్పుల వల్లే ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెరిగినప్పటికీ 14.2 కేజీల సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను కంపెనీలు తాకలేదు. సాధారణ ఇళ్లలో వాడే గ్యాస్ రేట్లు మునుపటిలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. 5 కేజీలు, 10 కేజీల చిన్న తరహా సిలిండర్ల ధరల్లోనూ ఎటువంటి మార్పూ చేయలేదు. ప్రస్తుతం 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ రూ.349.50 వద్ద దొరుకుతుండగా, ఎక్స్ట్రాలైట్ సిలిండర్ ధర రూ.339 వద్దే ఉంది. కాకపోతే 5 కేజీల గృహేతర వాణిజ్య సిలిండర్ రేటు రూ.762 నుంచి రూ.764 కు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో లేటెస్ట్ రేట్లు ధరల పెంపు తర్వాత నగరాల వారీగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. భాగ్యనగరం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.11 పెరిగి రూ.2,996 వద్దకు చేరి రూ.3,000 మార్కుకు అత్యంత చేరువైంది. దేశ

ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన ఎల్నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66

లావా విరాట్ V1 ప్రో 5జీలో 6.75-అంగుళాల హెచ్డీ+ LCD డిస్ప్లే ఈ స్మార్ట్ఫోన్లో యూనిసోక్ T8200 ప్రాసెసర్ ఉండొచ్చు ఆగష్టు 24న లావా విరాట్ V1 ప్రో 5జీ లాంచ్ అయ్యే ఛాన్స్ Lava Virat V1 Pro 5G : లావా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్ రాబోతుంది. భారతీయ స్వదేశీ కంపెనీ లావా వచ్చే వారం కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అంతకన్నా ముందుగానే లావా విరాట్ V1 ప్రో 5జీ కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. లావా విరాట్ V1 4G, లావా విరాట్ V1 5G రెండు ఫోన్లు గత నెలలోనే దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. కానీ, ఇప్పుడు లావా విరాట్ V1 ప్రో 5జీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో 50MP ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉండొచ్చు. స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ( అంచనా) : ఈ స్మార్ట్ఫోన్లో 6GB, 8GB ర్యామ్ ఆప్షన్లు ఉండవచ్చు. లావా విరాట్ V1 ప్రో 5Gలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.75-అంగుళాల హెచ్డీ+ (1,600 x 720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ ఉండొచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో యునిసోక్ T8200 ప్రాసెసర్ మాలి-G57 MC2 GPU ఉండొచ్చు. లావా మొబైల్స్, లావా విరాట్ V1 ప్రో 5Gని ఆగస్టు 24న లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా కంపెనీ పోస్ట్లో ప్రకటించింది . ఈ స్మార్ట్ఫోన్ను ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించనున్నారు. ఈ స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. Read Also : Vivo V80 Lite : Vivo నుంచి బ్యాటరీ బీస్ట్! 10,000mAh, 50MP డ్యూయల్ కెమెరా.. లాంచ్ డేట్ ఫిక్స్! రిపోర్టుల ప్రకారం పరిశీలిస్తే : లావా విరాట్ వి1 ప్రో 5జీలో 120Hz రిఫ్రెష్ రేట్తో 6.75-అంగుళాల HD+ (1,600 x 720

ఈ ఫోన్పై అసలు ధరపై రూ. 8వేలకుపైగా తగ్గింపు ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ 32శాతం తగ్గింపుతో కొనేసుకోవచ్చు మోటోరోలా ఫోన్లో అద్భుతమైన స్పెసిఫికేషన్లు Motorola G37 Price : మోటోరోలా జీ37 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. మోటోరోలా ఫోన్ 5200mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్ను రూ. 25వేలు ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ మోటోరోలా ఫోన్ రూ. 17వేలు కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధరపై రూ. 8వేలకుపైగా తగ్గింపుతో లభిస్తోంది. మోటోరోలా G37 బెస్ట్ డీల్ ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫ్లిప్కార్ట్లో మోటోరోలా జీ37 ధర తగ్గింపు : ప్రస్తుతం మోటోరోలా G37 ఫోన్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ను 32శాతం తగ్గింపుతో అసలు ధర నుంచి రూ.8వేలు (Motorola G37 Price) తగ్గింపుతో అందిస్తోంది. ఈ-కామర్స్ వెబ్సైట్ రూ. 16,999 ధరకు లిస్ట్ చేసింది. ఈ ఫోన్పై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో మోటోరోలా జీ37 ఫోన్పై అదనంగా రూ. 850 ఆదా చేయొచ్చు. అప్పుడు ఈ ఫోన్ ధర రూ. 16,999 అవుతుంది. Read Also : Free Google AI Plus : విద్యార్థులకు పండగే.. గూగుల్ AI Plus ఫ్రీ సబ్స్క్రిప్షన్.. ఏడాదంతా ఎంజాయ్.. ఈ ఆఫర్ ఇలా పొందండి! మోటోరోలా G37 స్పెసిఫికేషన్లు : మోటో G37లో 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్నెస్తో 6.7-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ARM మాలి-G57 MC2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్తో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉంది. 20W టర్బోఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్తో 5200mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది

ఈ ఫోన్లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఆస్ఫెరిక్ లెన్స్, గీక్బెంచ్ లిస్టింగ్లో కనిపించింది వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానుంది Vivo V80 Lite : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో V80 లైట్ 5G లాంచ్ ఖరారైనట్లు సమాచారం. ఈ ఫోన్లో భారీ 10,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇదే ఫోన్ స్పెషల్ అట్రాక్షన్. ఇందులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చే నెల ఫస్ట్ వీక్ మార్కెట్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. వివో V80 లైట్ అతిపెద్ద బ్యాటరీతో వస్తోంది. గతంలో, కంపెనీ 10,200mAh బ్యాటరీతో వివో V600 ప్రోను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ దేశీయ మార్కెట్ మినహా మరే ఇతర మార్కెట్లోనూ లాంచ్ కాలేదు. వివో V80 లైట్ 5Gలోని ఇతర ఫీచర్లతో పాటు ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. సెప్టెంబర్ 3న అధికారిక లాంచ్ : వచ్చే నెలలో వివో V80 లైట్ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ను సెప్టెంబర్ 3న అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫేస్బుక్ పేజీలో ఈ ఫోన్కు సంబంధించిన టీజర్ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో ఫోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ గ్రీన్, రోజ్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. బ్యాక్ కెమెరా కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ను మలేషియాలో లాంచ్ చేసేందుకు కంపెనీ ముందుగానే ప్లాన్ చేస్తోంది. Read Also : Motorola G37 Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ మోటోరోలా G37పై రూ. 8వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..! 50MP డ్యూయల్ కెమెరా సెటప్ : వివో V80 లైట్ 5G ఫోన్లో 50MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉండబోతోంది. దాంతో పాటు అల్ట్రావైడ్ సెన్సార్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate: ప్రపంచ మార్కెట్లలో బంగారం మరోసారి దూసుకుపోతోంది. మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు వరుసగా మూడో వారంలోనూ లాభాలు నమోదు చేస్తున్నాయి. ఈ వారం మాత్రమే దాదాపు 5 శాతం పెరిగిన బంగారం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పెరుగుదల వెనుక ఒకే కారణం కాకుండా అనేక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కలిసి పనిచేస్తున్నాయి. డాలర్ బలహీనత ప్రధాన కారణం: బంగారం ధరల పెరుగుదలకు ప్రస్తుతం అతిపెద్ద కారణం అమెరికా డాలర్ బలహీనపడటం. డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనుగోలు చేయడం చౌకగా మారుతుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరుగుతుంది. ఇటీవల అమెరికా ట్రెజరీ తీసుకున్న బాండ్ బైబ్యాక్ నిర్ణయాల తర్వాత డాలర్ మే నెల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకోవడం బంగారానికి భారీ మద్దతు ఇచ్చింది. అమెరికా రుణభారం ఆందోళనలు: అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటడం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచుతోంది. భవిష్యత్తులో డాలర్ విలువ మరింత తగ్గే అవకాశం ఉందనే భావనతో చాలామంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. అందుకే ప్రస్తుతం బంగారాన్ని "కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణ కవచం"గా చూస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడం కూడా బంగారానికి అనుకూలంగా మారింది. ఇటీవల వచ్చిన బలహీన ఆర్థిక గణాంకాలు, మందగించిన ఉద్యోగ వృద్ధి, తగ్గిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేయొచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు స్థిరంగా

వివో టీ5 5G 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది ఈ స్మార్ట్ఫోన్ కోసం స్పెషల్ ల్యాండింగ్ పేజీ డిస్ప్లే TUV రైన్ల్యాండ్ వెరిఫికేషన్ Vivo T5 5G Launch : వివో ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వస్తోంది.. భారత మార్కెట్లో వివో టీ5 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఈ వివో 5జీ ఫోన్ 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ సిరీస్లో వివో టీ5 లైట్ 5జీ, వివో టీ5ఎక్స్ 5జీ, వివో టీ5 ప్రో 5జీ ఫోన్లు ఉండనున్నాయి. రాబోయే ఈ స్మార్ట్ఫోన్లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పటికే, ఫ్లిప్కార్ట్లో వివో టీ5 5జీ కోసం స్పెషల్ ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్లో జెన్ఏఐ-రెడీ NPU ఉంటుంది. ఏఐ పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. రూ. 35వేల నుంచి రూ. 50వేల లోపు : ఈ స్మార్ట్ఫోన్ వివో ఆరిజిన్ఓఎస్పై రన్ అవుతుంది. అలాగే, రూ. 34,999 నుంచి రూ. 49,999 ధరలో వివో T5 5జీ (Vivo T5 5G Launch) అత్యంత సన్నని 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. వివో T5 ప్రో 5జి 'అల్ట్రా-స్లిమ్' 7.99mm ఫ్రేమ్ అమర్చారు. ఈ వివో T5 లైట్ 5జీ స్మార్ట్ఫోన్లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.74-అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. డిస్ప్లే టీయూవీ రైన్ల్యాండ్ సర్టిఫికేషన్ అందిస్తుంది. ప్రాసెసర్గా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అందిస్తుంది. Read Also : Samsung Galaxy S25 Ultra : దిమ్మతిరిగే ఆఫర్.. శాంసంగ్ అల్ట్రా ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్లో రూ. 30వేలు డిస్కౌంట్! ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0పై రన్ అవుతుంది. ఇందులో ఏఐ క్రియేషన్, ఏఐ

బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల పరిస్థితులు, డాలర్ బలహీనపడటం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాలు గోల్డ్, సిల్వర్ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిల దిశగా కదులుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,090కి చేరింది. ఒక్కరోజులోనే రూ.1,520 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,500గా ఉండగా.. శనివారం రూ.1,400 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.2.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజులోనే దాదాపు రూ.10 వేల పెరుగుదల నమోదైంది. గత రెండు రోజుల్లో వెండి ధర సుమారు రూ.15 వేల వరకు పెరగడం మార్కెట్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం విలువైన లోహాలకు సపోర్టుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డాలర్ బలహీనపడటం బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారింది. అమెరికా కరెన్సీపై ఒత్తిడి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా అంతర్జాతీయంగా గోల్డ్కు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఆంక్షలు, ప్రతిస్పందనలు, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రిస్క్ ఉన్న ఆస్తుల కంటే సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి చూపడం సాధారణం. దీంతో బంగారం, వెండి ధరలకు మరింత సపోర్ట్ దొరికింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కదలికలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలపై ధరల దిశ ఆధారపడి ఉంటుంది

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.8,667గా నిర్ణయించింది. సీసీఐ కొనుగోళ్లు చేపడితే రైతులకు ప్రయోజనం జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్ సీజన్కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.8,667గా నిర్ణయించింది. గత సీజన్లో రూ.8, 110గా ఉన్న మద్దతు ధరను ఈసారి రూ.557 పెంచింది. దీంతో పత్తి సాగు చేస్తున్న రైతుల్లో కొంతమేర హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది 4.15లక్షల క్వింటాళ్ల క్రయవిక్రయాలు జరగ్గా, సీసీఐ 1.49లక్షల క్వింటాళ్ల పత్తిని మద్దతు ధర ప్రకారం సేకరించింది. మిగితా 2.69లక్షల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. అయితే పెంచిన మద్దతు ధర తమకు దక్కాలంటే మొత్తం పంటను సీసీఐ కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. పత్తి సాగులో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు, దిగుబడుల్లో హెచ్చుతగ్గులతో రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్వింటా ల్కు రూ.557 మద్దతు ధర పెరుగడం కొంత ఊరట నిస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినా.. పూర్తి స్థాయి లో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లు చేపట్టకపోతే ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు. ప్రతియేటా ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో ధరల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి ప్రధాన పంట. సీజన్లో సెప్టెంబర్ మాసం నుంచి పత్తి మార్కెట్కు వస్తుంది. కొనుగోళ్లలో తేమ, నాణ్యత ప్రమాణాలను పాటించినప్పటికీ రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పత్తిని మార్కెట్కు తీసుకువచ్చిన రైతులకు పారదర్శకంగా ధర నిర్ణయించి, ఎలాంటి అనవసర కోతలు లేకుండా కొనుగోళ్లు చేప ట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ.8,667 మద్దతు ధర కాగితాలకే పరిమితం కాకుండా రైతులకు అందాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలను

క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ భారీగా పుంజుకుంది. శనివారం ఉదయం 9.10 గంటలకు 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో గరిష్ఠంగా 4.8 శాతం పెరిగింది. గత వారం రోజుల్లో 24.5 శాతం లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్లను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించడం బిట్కాయిన్ జోరుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటనతో దీర్ఘకాలిక బాండ్ రాబడులు తగ్గాయి. మార్కెట్లలో రిస్క్ తీసుకునే ఆసక్తి పెరిగింది.బిట్కాయిన్ ధర పెరగడంతో పతనాన్ని అంచనా వేసి తీసుకున్న భారీ షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీంతో క్రిప్టో ధర మరింత వేగంగా పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా మే తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడం కూడా మార్కెట్కు సానుకూల సంకేతంగా మారింది. అమెరికాలో నమోదైన స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్ల్లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగాయి. 13 ఈటీఎఫ్ల్లోకి ఈ వారం ఇప్పటివరకు బిలియన్ డాలర్లకు పైగా నిధులు వచ్చాయి.2025 అక్టోబర్లో బిట్కాయిన్ దాదాపు 1,26,000 డాలర్ల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత భారీ పతనం నమోదైంది. 2026 జూన్ చివర్లో 58,642 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 80 వేల డాలర్లకు చేరువగా దూసుకెళుతోంది