Gold Rate Today: పసిడి ప్రియులు ఎగిరిగంతేసే శుభవార్త. బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. దేశీయంగా రెండు రోజుల్లోనే తులం బంగారం రేటు రూ.4300 మేర దిగివచ్చింది. ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా మెరుపుదాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపించాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు భారీగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం రేట్లు పడిపోతుండడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోందని చెప్పవచ్చు. మరి సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్లో బంగారం, వెండి రేట్లుహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో సెషన్లోనూ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రెండ్రోజుల్లో రూ.4360 మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1470 మేర తగ్గడంతో తులం రేటు రూ.1,56,770 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు రూ.1350 తగ్గడంతో 10 గ్రాముల రేటు రూ.1,43,700 వద్దకు దిగివచ్చింది. ఇక వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో రేటు రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది.విజయవాడ, విశాఖలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు విజయవాడ, వైజాగ్ నగరాల్లోనూ ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1470 తగ్గడంతో రూ.1,56,770 వద్దకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు తులానికి రూ.1350 తగ్గడంతో రూ.1,43,700 పలుకుతోంది. ఇక కిలో వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ.2,60,000 పలుకుతోంది.గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం పసిడి రేట్లు తగ్గినట్లే తగ్గి ఈరోజు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 19 డాలర్లు పెరిగి 4449 డాలర్ల