.webp)
Ye Devi Varamo Neevu: రోహిత్ కి రాఖీ కట్టాలని అంజలిప్లాన్.. ఆపేసిన గీత!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 64లో.. మనీష్ వర్క్ చేస్తుంటే అంజలి అక్కడికి వస్తుంది.
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 64లో.. మనీష్ వర్క్ చేస్తుంటే అంజలి అక్కడికి వస్తుంది.

Tirumala | వేయి నామాలు గల వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

అనురాధ అంత్యక్రియలు పాపన్నపేట లో నిర్వహించగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు.

Vijay Deverakonda: స్కిన్కేర్ రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘Unhype’ బ్రాండ్ ప్రత్యేకత ఏంటంటే?

Anand Deverakonda: అందుకే ఎంతో నమ్మి ఈ సినిమా చేశా.. ఇప్పుడు ఆడియన్స్కు కూడా నచ్చుతుంది

Vijay Devarakonda | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సీడ్ గణేశుడిని పూజించాలని విజయ్ దేవరకొండ పిలుపు

నిన్న మహారీక్షలో ఒక ఫైట్ జరిగింది రెండు టీమ్స్ మధ్య. (Bigg Boss 10 Day 3 Promo)

Ajay Devgn | 'దృశ్యం 3'తో ఎండ్ కార్డ్.. మోహన్లాల్కు ఈ సినిమా చూపించాలని ఉంది : అజయ్ దేవగన్!

Vijay Deverakonda: డైరెక్టర్పై కొండంత ప్రేమ.. సందీప్ రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన విజయ్ దేవరకొండ..

ఈ ముగ్గురూ వరుస పెట్టి తమ సినిమాలతో రాబోతున్నారు. (Deverakonda Family)

Vijay Devarakonda | ఎపిక్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ .. వాటికి ఆపరేషన్ TFI పేరు పెట్టిన రౌడీ బాయ్
Vijay Deverakonda: ‘నా లైఫ్లో ఈటీవీ చూసేవాడిని కాదు.. ఆదిత్య హాసన్ కారణంగా ETV Win సబ్స్క్రిప్షన్ తీసుకున్నా’.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ గెస్టులుగా హాజరయి సందడి చేశారు.

Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!

Vijay Deverakonda | మరో మల్టీప్లెక్స్ను ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. హైదరాబాద్లో ఏర్పాటుపై కసరత్తు!

తాజాగా ఈ సినిమా నిర్మాత ఆదిత్య హాసన్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. (Little Hearts 2)

Vijay Devarakonda: ‘రణబాలి’ టీజర్ ఎప్పుడంటే.. కొత్త పోస్టర్తో క్లారిటీ!

ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Epic Pre release event) మంగళవారం హైదరాబాద్లో జరగనుంది.

Anand Devarakonda: అందులో నాదొక రోల్ అంతే

టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బాగా వైరల్ అవుతోంది. గుజరాతీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన భక్తిరస చిత్రం లాలో – కృష్ణ సదా సహాయతే తెలుగులో రీమేక్ కానుంది. గుజరాతీలో కేవలం రూ. 50 లక్షల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రారంభంలో తక్కువ వసూళ్లు నమోదు చేసినప్పటికీ, అద్భుతమైన మౌత్ టాక్తో ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక ఆటో డ్రైవర్ జీవితంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి ఆయనను సరైన మార్గంలో ఎలా నడిపించాడనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్ర తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ రీమేక్లో శ్రీకృష్ణ పరమాత్మ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. చరణ్ కటౌట్ కి కృష్ణుడు అంటే అసలు ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగిపోతుంది అనుకున్నారు. కానీ,అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ ఈ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఈ కీలక పాత్రను పోషించనున్నాడని సమాచారం.తన కెరీర్లో మాస్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండకు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడు అనేసరికి సోషల్ మీడియా షేక్ అయ్యింది. పౌరాణిక పాత్ర చేయడం విజయ్ కి కొత్తేమీ కాదు. కల్కి సినిమాలో అర్జునుడిగా విజయ్ కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మోడ్రన్ టచ్తో ఉండే ఈ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ లో విజయ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడని అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథనంలో

'మేమ్ ఫేమస్' చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు 'రోమాంచకం' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బ్లాక్బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనంతిక సనిల్కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ రేపు (సెప్టెంబర్ 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.రోమాంచకం సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సుమంత్ తెలిపాడు. తన పాత్ర కోసం దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో కలిసి దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేశానని వెల్లడించాడు. "ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే అమాయకమైన, క్యూట్ యువకుడి పాత్ర నాది. ఆ పాత్రలో సహజంగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేశాం. కొన్ని సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రాక్టీస్ చేశాక, నా నటనలో ఎంతో మెరుగుదల కనిపించింది" అని సుమంత్ వివరించాడు. ఓ అవార్డు ఫంక్షన్లో సందీప్ రెడ్డి వంగా తనను కలిసి ఓ 'క్యూట్ స్టోరీ' ఉందని చెప్పారని, ఆ తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రెండున్నర గంటల పాటు కథ వినిపించగా తాను ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా సందీప్, ప్రణయ్ రెడ్డి చాలా మంచి వారని పేర్కొన్నాడు.ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల మద్దతు లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. పాన్

ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్తో పంచుకోలేకపోతారు. ఎంతసేపూ చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ.. వాళ్ల భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు-పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి.. తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్నీ పేరెంట్స్తో పంచుకోలేకపోతారు. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లల మార్కులు, ఆటల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. వారికి తామున్నామన్న భరోసా కల్పించడం, ఎమోషనల్గా దగ్గరవడం ముఖ్యమంటున్నారు. దీన్నే ‘ఎలిఫెంట్ పేరెంటింగ్’ అంటారు. మరి, దీనివల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.. ⚛ ఏనుగుల్ని పరిశీలిస్తే.. అవి వాటి పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తాయి. ఎప్పుడూ వాటికి దగ్గరగా ఉంటూనే వాటిని సంరక్షిస్తుంటాయి. ఇలా పిల్లల్ని మన రక్షణ వలయంలో ఉంచుకోవడం వల్ల వారిలో ఒక రకమైన ధైర్యం అలవడుతుంది. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారంటున్నారు నిపుణులు. ⚛ గున్న ఏనుగు తన తల్లితోనే కాదు.. ఇతర ఏనుగులతోనూ ప్రేమగా ఉంటుంది. ఇందుకు ఆ పిల్ల ఏనుగు తల్లే కారణం. ఎందుకంటే తల్లి ఏనుగు చిన్న వయసు నుంచే తన పిల్లల్ని ఇతర ఏనుగులతో కలిసిపోయేలా ప్రోత్సహిస్తుందట! ఇలా మనమూ మన పిల్లలకు.. మన బంధువులు, స్నేహితులతో కలుపుగోలుగా ఉండడం నేర్పితే.. వారిలో సామాజిక నైపుణ్యాలు అలవడతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల అనుబంధాల విలువ తెలుసుకోవడంతో పాటు నలుగురిలోనూ దూసుకుపోయే శక్తి లభిస్తుందంటున్నారు. ⚛ ఏనుగులు తమ తోటి జంతువులు చేసే పనుల్ని సునిశితంగా పరిశీలిస్తాయట. ఈ క్రమంలోనే పిల్ల ఏనుగులు చాలా విషయాలు నేర్చుకుంటాయట!

ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు

హైదరాబాద్ ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభిస్తు్న్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పుకొచ్చారు. నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ మధ్య ఈ కారిడార్ ఉందని మంత్రి పొన్నం తెలిపారు. 3.23 కిలోమీటర్ల పొడవున కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్ నిర్మాణం ఉంటుందని వివరించారు. 2.53 కిలోమీటర్ల ప్రధాన వయాడక్ట్.. 200 మీటర్ల అప్ ర్యాంప్ ఉంటుందని చెప్పారు. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. చంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారమవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. ఆయా వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలోనూ కారిడార్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. హైదరాబాద్ను ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నూతన కారిడార్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి

కన్నడ స్టార్ నటుడు, అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ తన పుట్టినరోజున అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు. ఆయన కథానాయకుడిగా రాబోతున్న భారీ చారిత్రక చిత్రానికి 'దేవరాయ' అనే టైటిల్ను ఖరారు చేస్తూ, ఫస్ట్ లుక్తో కూడిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో సుదీప్, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రాజసంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియా సుదీప్ తన సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో ద్వారా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. టైటిల్ వీడియోలో సుదీప్ లుక్ అత్యంత గంభీరంగా, రాజసం ఉట్టిపడేలా ఉంది. తలపై కిరీటం, మెడలో ముత్యాల హారాలు, ఇతర రాజాభరణాలతో ఆయన ఆహార్యం ఆకట్టుకుంటోంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం ఈ వీడియోకు మరింత బలాన్ని చేకూర్చింది."చరిత్రను మలుపుతిప్పిన సామ్రాజ్యం, ఒక శకాన్ని నిర్మించిన రాజు, కాలానికి అతీతంగా నిలిచిన లెజెండ్" అనే శక్తివంతమైన వాక్యాలతో చిత్ర బృందం 'దేవరాయ' పాత్రను పరిచయం చేసింది. ఈ వ్యాఖ్యలు శ్రీకృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్ఠలకు అద్దం పడుతున్నాయి. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసే సుదీప్, ఈ చారిత్రక పాత్ర కోసం అద్భుతంగా రూపాంతరం చెందారని ఫస్ట్ లుక్ను చూస్తేనే అర్థమవుతోంది.ఈ భారీ చారిత్రక చిత్రాన్ని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి

ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి తెలుగుతల్లి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసి సీఎం జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్రకు గోదారమ్మను తీసుకువచ్చామని తెలిపారు. నదులు, వాగులు, వంకలు దాటుకుని గోదారమ్మ వచ్చిందని ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణమ్మను తరలించి.. కరువు పీడిత మార్కాపురానికి నీళ్లిచ్చామని ఉద్ఘాటించారు. నల్లమల కొండలను చీల్చుకుని కృష్ణమ్మ వచ్చిందని అన్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి గోదావరి జలాలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా మారేలా చేస్తామని తెలిపారు. ఈ జల విజయం.. ప్రజల విజయమని చెప్పుకొచ్చారు. ఆధునిక దేవాలయాలు.. సాగునీటి ప్రాజెక్టులు అని అభివర్ణించారు. నీరు ఉంటేనే భద్రత, భవిష్యత్తుపై ఓ భరోసా కల్పిస్తుందని తెలిపారు. నీరు ఉంటేనే పరిశ్రమలు.. తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వివరించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టామని అన్నారు. 2019 నాటికి 72 శాతం పోలవరం పనులు పూర్తిచేశామని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం.. పోలవరాన్ని పర్యవేక్షించేలా మార్చామని వెల్లడించారు. 2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిందని.. పోలవరానికి శాపమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులకు గొడ్డలి పార్టీ పైసా కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరానికి శాపవిముక్త కలిగిందని వ్యాఖ్యానించారు. 2028 నాటికి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని కోరారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని కేంద్రమంత్రికి.. సీఎం రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో రన్ వే ఫైనలైజ్కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ వెల్లడించారు. ఆ పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్ తెలిపారు. తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్కు.. సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. హుస్సేన్ సాగర్లో సీ ప్లేన్ ల్యాండింగ్కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్తో జరిగే టీ20 సిరీస్కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే, మరోవైపు.. కేంద్రమంత్రులతో సమావేశం అవుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న రక్షణ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, అలాగే హైదరాబాద్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026, రక్షణ ఎక్స్పో-2026పై సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రి రాజ్నాథ్తో చర్చించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ను సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్నాథ్సింగ్ను కోరారు.రక్షణ ఎక్స్పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్షో, పారిశ్రామిక ప్రదర్శన, అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ పరిశ్రమలు, స్టార్టప్లు, యువ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రక్షణ ఎక్స్పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు కేంద్ర రక్షణశాఖ సహకారం అందించాలని కోరారు. ఎయిర్షోకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలని.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్పోలో ప్రదర్శించాలని కోరారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఏఎల్

విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్లో గూస్బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ రిలీజ్ బాక్సాఫీస్ షేక్!
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం

కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ తీపి కబురు అందడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రం దేవరాయ ఫస్ట్ లుక్ పోస్టర్ను అధికారికంగా విడుదల చేశారు. చిత్రబృందం ఈ సర్ప్రైజ్ ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక దృశ్యమాధ్యమాల్లో ఈ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కిచ్చా సుదీప్ కనిపించిన తీరు మరియు ఆయన గెటప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సుదీప్ తనదైన ముద్రతో దేవరాయ పాత్రలో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పోస్టర్లో చూపించిన ప్రతి అంశం కూడా కథలోని తీవ్రతను, సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ ఘట్టాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విజువల్స్ సినీ విమర్శకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ విడుదలై క్షణాల్లోనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సుదీప్కు సామాజిక వేదికల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా దేవరాయ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన తదుపరి తాజా వివరాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముందుముందు ఈ చిత్రం నుంచి మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. దేవరాయ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీప్ కెరీర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన మరియు విభిన్నమైన ప్రాజెక్ట్గా నిలిచిపోతుందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కథనంలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేవరాయ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు

Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

టీటీడీలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈవో) ఎం. లోకనాథం నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. తిరుపతి, తిరుమలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏడు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈరోజు ఉదయం 6 గంటలకే అధికారులు తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉండగా తనిఖీలు ప్రారంభించారు. అదే సమయంలో తిరుమలలోని ఆయన కార్యాలయంలో మరో బృందం సోదాలు చేపట్టింది. ఈ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా జరుగుతున్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి.ఈ సోదాలను అధికారులు బహుళ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. తిరుపతిలో లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో, యెర్పేడు మండలం చెల్లూరులో ఉన్న ఆయన సోదరి నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుమలలో లోకనాథంకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక గెస్ట్ హౌస్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా తిరుపతి ఎస్టీవీ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలో ఉన్న లోకనాథం బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు తెరిచి పరిశీలిస్తున్నారు. లోకనాథం ప్రస్తుతం శ్రీవారి ఆలయం టెంపుల్ డిప్యూటీ ఈవోగా కీలక బాధ్యతల్లో ఉండగా, గతంలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు.గత దశాబ్ద కాలంలో ఒక టీటీడీ ఉన్నతాధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

కన్నడ హీరో సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలియొచ్చేమో. 'ఈగ' విలన్ అంటే మాత్రం ఎక్కువగా గుర్తుపడతారు. సైరా, బాహుబలి లాంటి తెలుగు చిత్రాల్లోనూ అతిథి పాత్రలు చేసినప్పటికీ ప్రస్తుతం సొంత భాషకే ఎక్కువగా పరిమితమైపోయాడు. ఈ రోజు సుదీప్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. (ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) తెలుగు ప్రముఖ నిర్మాణ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుదీప్ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాకు 'దేవరాయ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మనందరికీ తెలిసిన శ్రీ కృష్ణ దేవరాయలు జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ గౌరహరి సంగీత దర్శకుడు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ బాగుంది. అలానే ప్రాజెక్టుపై అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించడం వరకు బాగానే ఉంది. కానీ దర్శకుడు ఎవరనేది బయటపెట్టలేదు. ఇంకా డైరెక్టర్ ఎవరనేది ఫిక్స్ కాలేదా లేదంటే కావాలంటే పేరుని రివీల్ చేయలేదా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. అలానే ఇది పాన్ ఇండియా మూవీనా కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. (ఇదీ చదవండి: విజయ్ ప్రభుత్వంపై డైలాగ్స్.. 'జైలర్ 2' వాయిదా రూమర్స్.. తీరా చూస్తే) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..! దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన భారీ బడ్జెట్ అడ్వెంచరస్ పాన్ ఇండియా పిరియాడికల్ చిత్రానికి అంకురార్పణ జరిగింది. ఐదు శతాబ్దాల క్రితం దక్షిణాది ప్రాంతాన్ని తిరుగులేని చక్రవర్తిగా ఏలిన శ్రీ కృష్ణ దేవరాయలు (SRI KRISHNA DEVARAAYA) కథ నేపథ్యంలో దేవరాయ (Devaraaya) సినిమా తెరకెక్కుతోంది. శాండిల్ వుడ్ అగ్ర నటుడు కిచ్చా సుదీప్ (KicchaSudeep) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ రోజు (బుధవారం) సుదీప్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సామాజిక మాధ్యమాలను దున్నేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యానర్పై సుప్రియాన్వీ పిక్చర్ స్టూడియో (Supriyanvi Picture Studio)తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad), కృతి ప్రసాద్ (Krithi Prasad ) నిర్మిస్తున్నారు. గౌర హరి (Gowra Hari) సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీని 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ఎదుటకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రటించారు

నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ! ఈ వార్తకు సంబంధించిన

ప్రతీ గ్రామ పంచాయతీకి డిజిటల్ ప్రొఫైల్ జనాభా నుంచి నీటి వనరుల వరకు సమాచార సేకరణ గ్రామాభివృద్ధి కోసం మూడేళ్ల ప్రణాళికలు జిల్లాలో మొదలైన డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు వరంగల్ సిటీ: గ్రామాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైంది. జీపీలకు సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్ ప్రొఫైల్లో నమోదు చేస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడి అవసరాలు, వనరులు, సమస్యలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల వద్ద విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతీ పంచాయతీ కి ప్రత్యేక డిజిటల్ ప్రొఫైల్ను రూపొందిస్తోంది. గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం తోపాటు ప్రస్తుత అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భవిష్యత్ ప్రణాళికలను సైతం ఇందులో పొందుపరుస్తారు. వరంగల్ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితి, కుటుంబాల సంఖ్య, వ్య వసాయ భూములు, సాగునీటి వనరులు, రహదారుల పరిస్థితి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి కూలీలు వంటి వివరాలన్నీ ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, ప్రస్తుత పనులు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలనూ డిజిటల్ ప్రొఫైల్లో పొందు పరుస్తున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృది శాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఈ డిజిటల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అన్ని వివరాలు ప్రొఫైల్లో.. గ్రామపంచాయతీ ప్రొఫైల్లో భౌగోళిక వివరాల నుంచి ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వరకు సమాచారం పొందుపరుస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన గ్రామస్థాయి ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా మైసా నుంచి ఇటీవల ఒక శక్తివంతమైన పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్లో రష్మిక చేతిలో భారీ ఈటె పట్టుకుని ముఖంపై తీవ్రమైన యుద్ధ గాయాలతో కనిపించారు. మంటలు మరియు జనం గుంపు నేపథ్యంతో ఆమె ఒక వీర యోధురాలిగా కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన లుక్పై నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రష్మిక లుక్ చిత్రంతో పాటు ఆమెను వైలెంట్ పిల్లా అని సంబోధిస్తూ పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా అన్ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. రష్మిక కెరీర్లో ఇప్పటివరకు చేయని పూర్తి స్థాయి రఫ్ మరియు ఇంటెన్స్ వారియర్ అవతార్గా ఈ పాత్రను రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ పోస్టర్ను షేర్ చేస్తూ దేవతల ఆశీస్సులు నీకు ఉండాలని రాసుకొచ్చారు. ఈ సినిమా ద్వారా రష్మిక తన అభిమానులు అందరూ గర్వపడేలా మరొక గొప్ప నటనను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ కామెంట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. మరో 12 రోజుల పాటు చిత్రీకరణ పూర్తి చేస్తే మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది. ఇటీవల ఒక భారీ పోరాట సన్నివేశంలో నటిస్తున్న సమయంలో రష్మిక ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆ కారణంగా ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న రష్మిక త్వరలోనే మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఫలితంగా నవంబర్ 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ
Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్లను పూర్తిగా నిషేధించారు. విండ్షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు

సాధారణంగా మనం ఏ గుడికి వెళ్లినా.. కాళ్లకు ఉన్న చెప్పులను బయటే విడిచి పెట్టి, భక్తి శ్రద్ధలతో లోపలికి వెళతాం. ఇది మన ఆచారం. కానీ, మన దేశంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో చెప్పులు వేసుకొని లోపలికి వెళతారని మీకు తెలుసా? వినడానికి కాస్త వింతగా అనిపించినా నిజంగానే ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. వేరే ఏ ఇతర ఆలయాల్లో లేని ఈ రూల్... ఈ టెంపుల్స్ లో మాత్రం ఎందుకు ఉంది? దీని వెనక ఉన్న కారణం ఏంటి? ఈ దేవ్జీ మహారాజ్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా, మాలాజ్ పూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు చెప్పులు ధరించే.. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకు వెళ్లే భక్తులు.. పాదరక్షలను ధరించే ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు. అయితే.. రోజువారీ సాధారణ పూజల సమయంలో చెప్పులు ధరించరు. కానీ, సంవత్సరానికి ఒకసారి నిర్వహించే జాతరకు వెళ్లే వారు మాత్రం.. చెప్పులు ధరిస్తారు. అసలు కారణం: స్థానిక నమ్మకాల ప్రకారం, దుష్టశక్తులు, చేతబడులు లేదా శారీరక/మానసిక సమస్యలతో బాధపడేవారు దేవ్జీ మహారాజ్ను దర్శించుకుంటే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అక్కడ పాదరక్షలతో నడవడం వల్ల తమను ఆవహించిన దుష్టశక్తులు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ జిల్లా, భోపాల్పూర్ ప్రాంతంలో ఉన్న కాళీమాత దేవాలయం.భక్తులు తమ కాళ్లకు ఉన్న చెప్పులను తీయకుండానే అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. అసలు కారణం: ఈ ప్రాంతంలో అమ్మవారిని చాలా ఉగ్రరూపిణిగా, అలాగే భక్తులను కంటికి రెప్పలా కాపాడే తల్లిగా భావిస్తారు. భక్తులు ముళ్ల బాటలు, కఠినమైన దారుల్లో నడిచి వస్తారు కాబట్టి వాళ్లకు పాదరక్షల వల్ల ఎలాంటి హాని కలగకుండా, అమ్మవారే స్వయంగా చెప్పులతో రావడానికి అనుమతి ఇచ్చిందని ఇక్కడి స్థానిక జానపద కథనం చెబుతుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథుని ప్రధాన ఆలయంలోకి

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లకు స్పష్టం చేసింది. ఇవి అన్ని వేళల పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సు కిటికీ అద్దాలకు కర్టెన్స్ వేయవద్దని పేర్కొంది. అనధికారికంగా కిటికీ అద్దాలకు ఫిల్మ్ అతికించవద్దని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని బస్సు ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి చేరుకునే వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. మహిళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ తదితర సిబ్బందిని నియమించే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించింది. అలాగే బస్సుల్లో పానిక్ బటన్లు, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా పని చేస్తూ ఉండాలంది. ఇవి అన్ని వేళలా పని చేస్తుండాలని తెలిపింది. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా ప్రతి బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వినియోగించే పరికరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలంది. అదే విధంగా రాత్రి లేదా రద్దీ లేని సమయాల్లో బస్సులను సురక్షితమైన, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిలిపి ఉంచేలా చూడాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. బస్సులో సిబ్బంది ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సీపీఆర్లో ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులను కోరింది. ఈ నిబంధనలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని బస్సు

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్గ్రేడ్కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లుగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల భాగం రెండో ప్యాకేజీలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మార్గం మూడో ప్యాకేజీలో ఉంటుంది. అధికారుల అంచనాల ప్రకారం తొలి ప్యాకేజీకి రూ.7,321.97 కోట్లు ఖర్చవుతాయి. రెండో ప్యాకేజీకి రూ.2,965.11 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.1,786.91 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.. భూసేకరణ, రహదారి నిర్మాణం, జీఎస్టీ తదితర అన్ని వ్యయాలను కలిపితే ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు ఖర్చు కానుంది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో పనులు కొనసాగనున్నాయి. తెలంగాణ పరిధిలోని రెండు ప్యాకేజీలకు సంబంధించి భూసేకరణ కోసం రూ.1,453.88 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ప్యాకేజీలకు కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 213.33 హెక్టార్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ-మచిలీపట్నం విభాగంలో 351.185 హెక్టార్ల భూమి అవసరం కాగా.. 344.685 హెక్టార్లు అందుబాటులో ఉంది. దీంతో అదనంగా సుమారు 6.50 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మొత్తం మార్గాన్ని హైస్పీడ్ కారిడార్
13 Year Old AI App Developer Zhu Shuhan : సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలంటే విపరీతమైన కోడింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదని, మంచి ఆలోచన ఉంటే కృత్రిమ మేధ (ఏఐ)తో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది ఓ 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిని. చైనాకు చెందిన ఝూ షుహాన్ అనే 13 ఏళ్ల చిన్నారి ఒక్క లైన్ కోడింగ్ కూడా రాయకుండానే ఒక వినూత్నమైన ఏఐ స్టడీ అసిస్టెంట్ యాప్ను తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన ఆలోచనతో తయారుచేసిన ఈ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 18,000 యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2.5 లక్షలకు పైగా) అర్జించి సంచలనం సృష్టించింది.'వర్చువల్ పేరెంట్' యాప్ వెనుక అసలు కథ ఇదే..!ఝూ షుహాన్ రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్కు 'జై చాంగ్' అని నామకరణం చేసింది. ఇంగ్లీష్లోకి దాన్ని అనువదిస్తే 'ఆన్ సైట్' అంటే అందుబాటులో ఉండటం అని అర్థం వస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే సమయంలో వారిపై నిఘా ఉంచడాన్ని, పర్యవేక్షించడాన్ని సులభతరం చేసేందుకు ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. పిల్లలు తమ ఫోటోను అప్లోడ్ చేసిన వెంటనే.. ఈ యాప్ ఒక 'వర్చువల్ పేరెంట్' లేదా 'డిజిటల్ పేరెంట్ క్లోన్' రూపంలో మారి బాధ్యతలు స్వీకరిస్తుంది.విద్యార్థి తన చదువును పక్కన పెట్టి మొబైల్ ఫోన్తో ఆడుకుంటున్నా లేదా తను కేటాయించిన స్థానాన్ని వదిలి పక్కకు వెళ్లినా.. కెమెరా సాంకేతికత ద్వారా పసిగట్టి తక్షణమే తల్లిదండ్రులకు హెచ్చరిక సందేశాలను పంపుతుంది. "నా తల్లిదండ్రులు నిరంతరం ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల నేను చదువుకునే సమయంలో నా పక్కన ఉండేందుకు సమయం దొరికేది కాదు. దాంతో హోమ్వర్క్ చేసే సమయంలో దారితప్పి రహస్యంగా ఫోన్ వాడేదాన్ని. నా తోటి విద్యార్థుల్లో చాలామంది స్వయం క్రమశిక్షణ లేక ఇదే విధమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అందుకే

తిరుమల: ఇస్రో(ISRO) చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లిన నారాయణన్.. జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్- 05 నమూనా రాకెట్ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇస్రో చేపడుతున్న జీఎస్ఎల్వీ-ఎఫ్17 సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వెళ్లనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు