
HYROX బీజింగ్ పోటీలో అథ్లెట్ మద్యలోనే మలవిసర్జన.. నెటిజన్లలో చర్చలు
hyrox బీజింగ్ ఫిట్నెస్ పోటీలో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా వివాదానికి దారితీస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన అథ్లెట్ జొవాన్నా వియెట్రిక్ ఈ సంఘటనలో ప్రధాన పాత్

hyrox బీజింగ్ ఫిట్నెస్ పోటీలో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా వివాదానికి దారితీస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన అథ్లెట్ జొవాన్నా వియెట్రిక్ ఈ సంఘటనలో ప్రధాన పాత్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన అద్భుతమైన ఆట తీరుతోనే కాకుండా, ఇటీవల నుదుటిపై ధరించిన ఒక విచిత్రమైన చిన్న పరికరంతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో సింధు తలపై కనిపించిన ఈ హైటెక్ గాడ్జెట్ పేరు టెంపుల్. ఇది పూర్తిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వేరబుల్ టెక్నాలజీతో రూపొందించబడిన ప్రయోగాత్మక ఫిట్నెస్ మరియు బ్రెయిన్ ట్రాకింగ్ డివైజ్.క్రీడాకారులు తీవ్రమైన ఒత్తిడి, పోటీ వాతావరణంలో ఉన్నప్పుడు వారి మెదడు, శరీరం ఎలా స్పందిస్తాయో నిజ సమయంలో విశ్లేషించడానికి దీనిని ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది మెదడు రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలు, మానసిక ఏకాగ్రత, ఒత్తిడి, అలసట స్థాయిలను ఖచ్చితంగా ట్రాక్ చేస్తుంది. ఈ అత్యాధునిక పరికరాన్ని జోమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసింది. గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్ ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్లో వెంకటేష్, మోహన్లాల్

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారం అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించి 17 మంది క్రీడాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అయితే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నకు ఈసారి ఎవరినీ ఎంపిక చేయకపోవడం గమనార్హం. అర్జున అవార్డుల జాబితాలో అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్లేయర్ దివ్యా దేశ్ముఖ్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి గోపిచంద్ తదితరులు చోటు దక్కించుకున్నారు. అర్జున అవార్డు గ్రహీతలు వీరే.. అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి. బ్యాడ్మింటన్: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ బాక్సింగ్: నరేందర్ బెర్వాల్ చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్ముఖ్ పారా షూటింగ్: ధనుష్ శ్రీకాంత్ హాకీ: లాల్రెమ్సియామి, రాజ్కుమార్ పాల్ కబడ్డీ: సుర్జీత్, పూజ పారా-షూటింగ్: రుద్రాంశ్ ఖండేల్వాల్ పారా-అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్ రోయింగ్: అరవింద్ సింగ్ షూటింగ్: అఖిల్ షియోరాన్ లైఫ్టైమ్ అర్జున అవార్డు 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్బాల్ జట్టులో సభ్యుడైన మాజీ ఆటగాడు ఐ. అరుమైనాయగానికి అర్జున అవార్డు (లైఫ్టైమ్) దక్కింది. ద్రోణాచార్య అవార్డులు ద్రోణాచార్య అవార్డులు రెగ్యులర్ కేటగిరీలో పార్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), ఛోటేలాల్ యాదవ్ (బాక్సింగ్), నేహా నంద్కుమార్ చవాన్ (షూటింగ్) ఎంపికయ్యారు. లైఫ్టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రీయ క్రీడా ప్రోత్సాహన్ పురస్కారాన్ని పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్కు ప్రకటించారు. ఆగస్టు 29 సంప్రదాయానికి బ్రేక్ సాధారణంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఆగస్టు 29న జరుగుతుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. అయితే కరోనా తర్వాత ఈ సంప్రదాయంలో మార్పులు వచ్చాయి. క్రీడా క్యాలెండర్కు అనుగుణంగా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2025లోనూ పురస్కారాల

ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడమచేతితో పనులు చేసే వారి ప్రత్యేకతలు, అలవాట్లు, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏడాది ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎడమ చేతితో రాయడం, తినడం, ఇతర పనులు చేయడం అలవాటుగా ఉన్నవారు ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ రోజును ఎడమచేతి వాటం వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి ప్రత్యేకతలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ప్రపంచంలోని చాలా వస్తువులు, పనిముట్లు కుడిచేతి వాటం వారికి అనుకూలంగా రూపొందించబడి ఉంటాయి. దీంతో ఎడమచేతి వాటం వారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు తమకు అనుకూలమైన విధంగా వాటిని ఉపయోగిస్తూ పనులను పూర్తి చేస్తారు. లెఫ్ట్-హ్యాండర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు డీన్ ఆర్. క్యాంప్బెల్ 1976లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటం వారి ఆలోచనా విధానం, సృజనాత్మకతలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కువ తెలివితేటలు లేదా అధిక ఐక్యూ కలిగి ఉంటారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. వారిలో సృజనాత్మకత, సమస్యలను విభిన్నంగా పరిష్కరించే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్ వంటి క్రీడల్లో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ప్రత్యర్థులకు భిన్నమైన సవాలుగా నిలుస్తారు. రఫెల్ నాదల్, డియెగో మారడోనా, బ్రియాన్ లారా, పీలే వంటి ప్రముఖ క్రీడాకారులు ఎడమచేతి వాటం వారిగా గుర్తింపు పొందారు. మొత్తంగా చూస్తే, ఎడమచేతి వాటం అనేది లోపం కాదు.. ఒక సహజమైన భిన్నత్వం. తమకు అనుకూలంగా లేని పరిస్థితులను అధిగమిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న ఎడమచేతి వాటం వారిని గౌరవించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో

కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది. ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది. 2015 మిలిటరీ వరల్డ్ గేమ్స్లో పాకిస్థాన్ బాక్సర్తో జరిగిన పోరును గుర్తుచేసుకున్న బేర్వాల్.. ఆ మ్యాచ్ తర్వాత అతడు చెప్పిన మాటలను మోదీకి వివరించాడు. ‘2015 మిలిటరీ వరల్డ్ గేమ్స్లో నా తొలి రౌండ్ పోరు పాకిస్థాన్ బాక్సర్తో జరిగింది. పాకిస్థాన్ ఆటగాడితో ఓడిపోవద్దని అప్పుడు ఉన్నతాధికారులు, సహచరులు చెప్పేవారు. ఆ మ్యాచ్లో నేను గెలిచాను. అయితే పోరులో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి వెళ్లాం. మీరు 2014లో ప్రధానిగా వచ్చారు. మా ఆర్మీ కోచ్ పేరు కూడా నరేంద్ర రాణా. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. పాక్ బాక్సర్ ఓ విషయాన్ని గమనించాడు. ‘బ్రదర్ నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నా’ అన్నాడు. సరే చెప్పు అని బదులిచ్చా. ‘నీ పేరు నరేంద్ర. మీ కోచ్ పేరు నరేంద్ర. మీ ప్రధాని నరేంద్ర. నాకు ఈ పేరు అంటేనే అసహ్యం వచ్చేసింది’ అన్నాడు’ అని బాక్సర్ బేర్వాల్ చెప్పాడు. దీనికి మోదీ గట్టిగా నవ్వేశారు. జట్టు నుంచి పిలుపు రాకపోయినా ప్రయత్నాలు ఆపొద్దు.. షమీకి జహీర్ ఖాన్ సూచన బుమ్రా కాదు.. ఆ స్టార్ ప్లేయర్ గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

PM Narendra Modi, CWG 2026 Medallists: స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. గత ఎడిషన్లతో పోలిస్తే ఈసారి కొన్ని క్రీడా విభాగాలను తొలగించినప్పటికీ, మన క్రీడాకారులు లభించిన అవకాశాలను రెండు చేతులా ఒసిసిపట్టుకున్నారు. భారత్ మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో గర్వకారణంగా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. తక్కువ క్రీడల్లో పాల్గొన్నప్పటికీ పతకాల సాధన రేటులో భారత్ అగ్రశ్రేణి ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని ఎగురవేసింది. బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్లో పతకాల పంట.. ఈ టోర్నీలో భారత్కు అత్యంత బలాన్ని ఇచ్చిన విభాగంగా బాక్సింగ్ నిలిచింది. రింగులోకి దిగిన భారత బాక్సర్లు ప్రత్యర్థులపై విరుచుకుపడి రికార్డు స్థాయిలో 10 పతకాలను కొల్లగొట్టారు. ముఖ్యంగా మహిళా బాక్సర్లు ప్రదర్శించిన ధీరత్వం నభూతో నభవిష్యత్ అనేలా సాగింది. ఏకంగా ఐదు స్వర్ణ పతకాలను మహిళా బాక్సర్లే సాధించడం విశేషం. మిరాబాయి చాను వరుసగా మూడోసారి పసిడి పతకం గెలుచుకుని వెయిట్లిఫ్టింగ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. జూడో, అథ్లెటిక్స్ విభాగాల్లోనూ మన క్రీడాకారులు అంచనాలను మించి రాణించారు. పారా-అథ్లెట్లు సైతం దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ పసిడి, రజత పతకాలతో మెరిశారు. "జో ఖేలేగా వో ఖిలేగా".. క్రీడాకారుల్లో నవ ఉత్తేజం.. విజేతలను తన నివాసానికి ఆహ్వానించిన ప్రధాని మోదీ వారితో ఎంతో ఆప్యాయంగా సమయం గడిపారు. క్రీడాకారుల అనుభవాలు తెలుసుకుంటూ వారి కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా పసిడి విజేత సాక్షి చౌదరి, ఇతర అథ్లెట్లతో కలిసి మోదీ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఆడేవాడు ఎల్లప్పుడూ వికసిస్తాడు" అనే తన సంకల్పాన్ని మోదీ పునరుద్ధరించారు. ప్రతి పౌరుడు భారత క్రీడాకారులకు నిరంతరం అండగా నిలవాలని, వారి విజయాన్ని వేడుకగా జరుపుకోవాలని కోరారు. ప్రధాని

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ వేదికగా జరిగిన ఈ భేటీలో పతక విజేతలతో ఆయన ముచ్చటించారు. క్రీడల్లో వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారుల కృషిని అభినందిస్తూ, వారి విజయాలు దేశ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత క్రీడా చరిత్రలో ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు కీలక మలుపుగా నిలిచాయి. గ్లాస్గోలో జరిగిన ఈ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే తక్కువ క్రీడాంశాలు ఉన్నప్పటికీ, పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ముఖ్యంగా బాక్సింగ్లో భారత్ ఏకంగా 10 పతకాలు సాధించడం విశేషం. దీంతో క్రీడా ప్రపంచంలో భారత్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. మహిళా బాక్సర్లు ఒంటరిగా 5 స్వర్ణ పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. మరోవైపు, వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా మూడోసారి కామన్వెల్త్ స్వర్ణాన్ని దక్కించుకుని అరుదైన ఘనత సాధించారు. ఇదిలా ఉండగా, జూడో మరియు అథ్లెటిక్స్లోనూ భారత క్రీడాకారులు ఆశించిన స్థాయికి మించి రాణించి మెరుగైన ఫలితాలను అందించారు. ఫలితంగా, గ్లాస్గో క్రీడల ముగింపు కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల జెండాను భారత్కు అందజేశారు. 2030లో జరగబోయే సెంటెనీయల్ కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియా తర్వాత రెండుసార్లు క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న రెండో దేశంగా భారత్ నిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ భేటీలో “ఆడేవారే ఎదిగే వారు” అంటూ మోదీ పిలుపునిచ్చారు. క్రీడాకారులకు నిరంతరం ప్రజా మద్దతు

కామన్వెల్త్ గేమ్స్ 2026 సందర్భంగా భారత మ్యాప్ను తప్పుగా ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్లో జాతీయ పతాకంలో ఈశాన్య రాష్ట్రాలు కనిపించకపోవడాన్ని గమించిన లవ్లీనా.. వెంటనే సిబ్బందికి చెప్పి సరి చేయించిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 సందర్భంగా భారత మ్యాప్ను తప్పుగా ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్లో జాతీయ పతాకంలో ఈశాన్య రాష్ట్రాలు కనిపించకపోవడాన్ని గమించిన లవ్లీనా.. వెంటనే సిబ్బందికి చెప్పి సరి చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రస్తావించిన మోదీ.. దేశం పట్ల ఆమెకున్న గౌరవాన్ని అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లవ్లీనాను ఉద్దేశించి మోదీ సరదాగా.. ‘ఏమైంది? రెస్టారెంట్ వాళ్లతో గొడవ పడుతున్నారట?’ అని అడిగారు. దీనికి ఆమె నవ్వుతూ.. ‘సర్.. కామన్వెల్త్ గేమ్స్లో మేం చాలా బాగా ఆడాం. చివరి రోజు కావడంతో అందరం సంతోషంగా వేడుక చేసుకుంటున్నాం. అక్కడ జాతీయ పతాకాన్ని తప్పుగా ముద్రించి అక్కడ పెట్టారు. అది నాకు నచ్చలేదు. అందుకే రెస్టారెంట్ సిబ్బందికి మర్యాదగా చెప్పాను. వాళ్లు కూడా వెంటనే దాన్ని సరిచేశారు’ అని వివరించింది. కాగా లవ్లీనా చర్యను మోదీ అభినందించారు. ‘గేమ్స్ పూర్తయ్యాయి. మీరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో కూడా ఆ మ్యాప్ ప్రాముఖ్యాన్ని గుర్తించడం గొప్ప విషయం. గెలుపు సంబరాల్లోనూ దేశ ప్రతిష్ఠను గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేయడం సామాన్యమైన విషయం కాదు. చాలా కాలం పాటు ప్రజలు దాన్ని

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో మోదీ సమావేశమై వారి ప్రదర్శనను ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వారు చూపిన పట్టుదల, కృషిని కొనియాడారు. దేశంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అన్ని క్రీడల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని.. యువత మరింత మంది క్రీడల వైపు వచ్చేలా వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు. ‘జో ఖేలేగా వో ఖిలేగా. భారత్కు ఎప్పుడూ మద్దతుగా నిలవండి. భారత్ మాతా కీ జై!’ అంటూ మోదీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. యువత క్రీడల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ గతంలోనూ ఆయన ‘జో ఖేలేగా వో ఖిలేగా’ నినాదాన్ని పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రధానితో సమావేశమైన బాక్సింగ్ స్వర్ణ పతక విజేత సాక్షి చౌదరి ఈ భేటీపై ఆనందం వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలందరినీ ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఆయనను కలవడం ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. ప్రధానమంత్రి చాలా సౌమ్యంగా ఉంటారు. ఆయనతో మాట్లాడటం అద్భుతమైన అనుభవం’ అని సాక్షి తెలిపింది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పతకాల వేటలో బాక్సింగ్ కీలక పాత్ర పోషించింది. భారత బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా.. అందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత బాక్సింగ్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా భారత మహిళా బాక్సర్లు అదరగొట్టారు. ఏడు స్వర్ణాల్లో ఐదు మహిళల ఖాతాలోనే చేరాయి. శ్రీలంక ఎలెవన్తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వచ్చిన భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ఢిల్లీ నివాసంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ పతక విజేతలతో సుదీర్ఘంగా సంభాషించి.. వారి అనుభవాలను తెలుసుకున్నారు. వారి అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసిస్తూ, యావత్ దేశం తరపున అభినందనలు తెలిపారు. ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పంచుకున్నారు, అది వేగంగా వైరల్ అవుతోంది.రష్యా నుంచి భారత్కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!ప్రధానమంత్రి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకోవడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్ అథ్లెట్లతో జరిగిన ఈ ప్రత్యేక సమావేశం గురించి తెలియజేశారు. ఆ వీడియోలో ఆయన స్వర్ణ పతక విజేత బాక్సర్ సాక్షి చౌదరి, పలువురు ఇతర ఛాంపియన్లతో సంభాషిస్తూ కనిపించారు. ఆ వీడియోలో సాక్షి చౌదరి ప్రధాని మోదీ నిరాడంబరతను ప్రశంసిస్తూ.. ప్రధానమంత్రిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా వినయశీలి అని అన్నారు. సంభాషణ సందర్భంగా ఆటగాళ్లు ప్రధానమంత్రిని ఏదైనా మాట్లాడమని కోరగా.. దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే తన ప్రసిద్ధ సందేశాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు, జో ఖేలేగా, వో ఖిలేగా! ఆల్వేస్ చీర్4భారత్. అంటూ చివరకు భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.1947లో భారత్లోనే కలవాల్సిన దుబాయ్! మన పాస్పోర్ట్తో అరబ్ ప్రజలు...39 పతకాలు గెలిచిన భారత్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించి, మొత్తం 39 పతకాలను గెలుచుకోవడం గమనార్హం. వీటిలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచగా.. ప్రధానమంత్రితో ఈ సమావేశం అథ్లెట్ల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది