
ఆసియా క్రీడలు మరో రెండ్రోజుల్లో ఆరంభంకానున్నాయి.. కానీ భారత ఆట గురువారమే మొదలవనుంది. టెక్‌బాల్‌ పురుషుల డబుల్స్‌లో డెక్లాన్‌ గొన్‌సాల్వెస్, మహ్మద్‌ అనాస్‌ పతక వేట ఆరంభించనున్నారు. ఈ ఆటలో భారత్‌ నుంచి మొత్తం ముగ్గురు బరిలో ఉన్నారు. మరి ఈ టెక్‌బాల్‌ ఎలా ఆడతారో చూద్దామా. ఫుట్‌బాల్, టేబుల్‌టెన్నిస్‌ కలిపి రూపొందించిందే టెక్‌బాల్‌. హంగేరికి చెందిన ముగ్గురు ఫుట్‌బాల్‌ ప్రేమికులు దీన్ని రూపొందించారు. ఈసారి ఆసియా క్రీడల్లో ఈ ఆట అరంగేట్రం చేయనుంది. వివరాలకు..





