
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యాన్ని .. 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్‌ శర్మ 82 పరుగులతో (32 బంతుల్లో) సత్తా చాటాడు. ఇషాన్‌ కిషన్ 42 రన్స్‌ చేశాడు. సంజు శాంసన్‌ 10 పరుగులు మాత్రమే చేశాడు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో మహ్మద్‌ నబీ 2 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.



