
మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాల గనిలో తెలంగాణ సంస్థ ఎన్ఎండీసీకి 27.29 క్యారెట్ల వజ్రం లభించింది. గని చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వజ్రంగా సంస్థ తెలిపింది. దీని ధర రూ.2–2.5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సంస్థ సీఎండీ చెప్పారు. దక్షిణాసియాలో ఏకైక యాంత్రీకృత వజ్రాల గనిగా పన్నా ప్రాజెక్టు కొనసాగుతోందన్నారు. సంవత్సరానికి 84 వేల క్యారెట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ గనిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు 6 వేల క్యారెట్ల వజ్రాలు ఉత్పత్తయ్యాయని చెప్పారు.





