
ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్లో జరిగిన చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ పాటించిన పాకిస్థాన్కు ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఏకంగా 11 ఓవర్లు తక్కువగా వేయడంతో 11 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధించడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ పాయింట్ల శాతం 4.63 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఈ టేబుల్లో అట్టడుగు స్థానమైన 9వ ప్లేసులో నిలిచి.. ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.





