
డిచ్‌పల్లి గ్రామీణం: గణేశ్‌ మండపం అలంకరణ కోసం ఖర్చు తగ్గించడానికి డిచ్‌పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలోని ఫ్రెండ్స్ యూత్ గణేశ్‌ మండలి వారు నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గతంలో అలంకరణ కోసం రూ.30 వేల వరకు పైగా ఖర్చు చేసేవారమని, ఈ ఏడాది మండపంలో డిజైన్లతో కూడిన మూడు ప్లెక్సీలను చేయించినట్లు తెలిపారు. దీనికోసం రూ.5 వేల వరకు మాత్రమే ఖర్చు చేశామన్నారు. అలంకరణ కోసం చేసిన ఖర్చు తగ్గడంతో ఆ నగదుతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించాలని అనుకుంటున్నట్లు నిర్వహకులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





