
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM Vijay govt good news to tamil nadu mlas: తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ దళపతి తనదైన మార్కుచూపిస్తున్నారు. ఒకవైపు అపోసిషన్ పార్టీలు ఆరు నెలలు, ఎనిమిది నెలలు అంటూ విమర్శలు గుప్పిస్తున్న తనదైన స్టైల్ లో ప్రజలకు పాలన అందిస్తున్నారు. మరోవైపు కొంత మంది నేతలు రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విషయాల్ని మధ్యలోకి తీసుకొచ్చిన సీఎం విజయ్ వాటిని ఎదుర్కొంటు తనదైన స్టైల్ లో అపోసిషన్ పార్టీల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా ఊహించని వరాలు జల్లును కురిపించారు.
రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనంతో పాటు భారీగా అలవెన్సులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేలకు ఒక కారు, దీని నిర్వాహణకు భత్యంతో పాటు పీఏను కూడా నియమించుకునేందుకు గ్రాంట్ను అందిస్తున్నట్టు ప్రకటించారు.
ముఖ్యంగా తమ తమ నియోజక వర్గాల్లో ఎప్పటికప్పుడు సందర్శిస్తు ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని సీఎం విజయ్ దళపతి సూచించారు. ఎమ్మెల్యేలకు .. ప్రభుత్వ వాహనం కేటాయించడం ద్వారా పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించడానికి వీలవుతుందన్నారు. చాలా మంది అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వచ్చారని అన్నారు. వీరికి తమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు తమ ప్రభుత్వంఅన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ప్రతి ఎమ్మెల్యేకి కారు డ్రైవర్, ఇంధనం ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75,000 అలవెన్సు అందనుందని వెల్లడించారు. అదనంగా అధికారిక పనుల కోసం ఒక సెక్రటరీని నియమించుకునేందుకు నెలకు రూ.25,000 రాష్ట్ర గ్రాంట్ను ప్రభుత్వం ఇస్తుందన్నారు. అంతే కాకుండా.. ముఖ్యమంత్రి సమగ్ర బీమా పథకం కిం కుటుంబాలకు ఏటా అందించే బీమాను రూ. 5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆదాయం, ప్రాంతంతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ టార్గెట్ అని పేర్కొన్నారు.
Read more: తిరుచానూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కాచిగూడ - తిరుచానూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ సర్వీస్!
మరోవైపు సీఎం విజయ్ కురిపించిన వరాల జల్లుపై అపోసిషన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం హర్షం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ దళపతి తీసుకున్న నిర్ణయంను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే దీన్ని డీఎంకే మాత్రం వ్యతిరేకించింది. ఈ చర్యల వల్ల ఖజానాపై భారీగా భారం పడుతుందని విమర్శలు గుప్పించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




