
హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 3,576 ఫ్లాట్లతో నిర్మిస్తున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీకి నేరుగా చేరుకునేలా స్కైవాక్ నిర్మించనున్నారు. రెసిడెన్షియల్ టౌన్షిప్కు మెట్రో అనుసంధానంగా నిర్మిస్తున్న తొలి స్కైవాక్ ఇదేనని వాసవి గ్రూప్ తెలిపింది. ట్రాఫిక్ పోలీసుల ఎన్వోసీతో పాటు అవసరమైన అనుమతులు లభించాయన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ స్కైవాక్కు ఐఐటీ హైదరాబాద్ డిజైన్ రూపొందించింది. ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ర్యాంప్, లిఫ్ట్, మెట్ల సదుపాయాలు ఉంటాయి.





