
అమెరికాలో కన్నుమూసిన వైఎస్ కమలమ్మ భౌతికకాయాన్ని స్వగ్రామమైన పులివెందులకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందులలోని వైఎస్సార్ సమాధుల తోటలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం. కమలమ్మ ఆకస్మిక మృతి పట్ల వైఎస్సార్ భార్య వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ షర్మిల, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.




