
Indian Railways: ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి భారతీయ రైల్వే రైల్ వన్ యాప్లో కొత్త షేర్డ్ సీజన్ టికెట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త సదుపాయం కింద రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుడు తమ కోసం మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు లేదా ఇతర ప్రయాణికులతో సహా మరో ఐదుగురి వరకు సీజన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం సెప్టెంబర్ 9, 2026 నుండి అమల్లోకి వచ్చింది.




