
భారత విదేశాంగ శాఖ మసూద్ అజర్పై పాకిస్థాన్ ప్రకటించిన రివార్డ్పై తీవ్రంగా స్పందించింది. జైషే మహ్మద్ చీఫ్గా ఉన్న మసూద్ అజర్, భారత్కు అత్యంత మోస్ట్ వాంటెడ్ భారత విదేశాంగ శాఖ మసూద్ అజర్పై పాకిస్థాన్ ప్రకటించిన రివార్డ్పై తీవ్రంగా స్పందించింది. జైషే మహ్మద్ చీఫ్గా ఉన్న మసూద్ అజర్, భారత్కు అత్యంత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. పాకిస్థాన్ ఇటువంటి ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదని, ఇది ప్రజలను మోసం చేసే ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రకటనలతో అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించలేరని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో నిజంగా చర్యలు తీసుకోవాలని, ప్రకటనలు చేయడం కాకుండా ఉగ్రవాద సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసూద్ అజర్ పేరు పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) రెడ్ బుక్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉంది. అతడిని 2019 మేలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2001 పార్లమెంట్పై దాడి, 2008 ముంబయి ఉగ్రదాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి వంటి ఘటనలలో మసూద్ అజర్ పాత్ర ఉందని భారత దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే, పాకిస్థాన్ మసూద్ అజర్ తమ దేశంలో లేడని, అతడు అఫ్గానిస్థాన్కు పారిపోయాడని చెబుతోంది. ఈ విషయాన్ని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ఇటీవల ఖండించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ భారత్-చైనా సంబంధాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం సందర్భంగా, ద్వైపాక్షిక సంబంధాలకు గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు అంశాలపై ఆధారపడి ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా జిన్పింగ్ భేటీలో భారత ప్రధాన ఆందోళనలను మోదీ ప్రస్తావించినట్లు తెలిపారు. భారత్-చైనా సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత తప్పనిసరి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరుదేశాలు ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి దీర్ఘకాలిక, రాజకీయ పరిష్కారం కోసం చర్చలు కొనసాగించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.




