
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం కలకలం రేపుతోంది. అవసరమైన ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తికాకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు భారత్ నుంచి బయటకు వెళ్లిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసి, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.





