
ప్రభుత్వ పథకాలు గడప గడపకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం 47వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మేయర్ ప్రజలకు వివరించారు.





