
వర్షాలు, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లపై ఏర్పడే గోతులు, పగుళ్ల సమస్యకు కొత్త పరిష్కారాన్ని పరీక్షిస్తున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో ముడిగేడు-సంజామల రహదారిపై డానిష్ ఫైబర్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. డానిష్ ఫైబర్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ విధానంలో అరామిడ్, పాలీఓలిఫిన్ ఫైబర్స్ను ఆస్ఫాల్ట్లో కలిపి రోడ్డును అంతర్గతంగా బలోపేతం చేస్తారు. దీంతో పగుళ్లు, భారీ వాహనాల వల్ల ఏర్పడే గాడులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ వినియోగంపై స్పష్టత రానుంది.




