
ఫలక్నుమా ప్యాలెస్లో సీఎం రేవంత్రెడ్డి, ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవం, పాతబస్తీ అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. శాసనమండలి భవనం, కుతుబ్షాహీ టూంబ్స్ పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సేవలను సీఎం ప్రశంసించారు. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాల పునరుద్ధరణకు ఫౌండేషన్ సహకారం కోరారు. డిసెంబర్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ప్రిన్స్ను ఆహ్వానించారు. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో నగరంగా అభివృద్ధి చేస్తున్న ప్రణాళికలను కూడా వివరించారు.





