
శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం కు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు సిద్దం చేసారు. ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో తాజా ప్రతిపాదనల మేరకు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 2లేన్లుగా నిర్మించాలని భావించిన కారిడార్‌ను 4లేన్లుగా నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, ఈ ప్రాజెక్టును కేంద్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌) నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు బదిలీ చేసింది. దీని ద్వారా అనుమతులు.. పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నారు.శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పైన వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మోర్త్‌ పరిధిలో ఉన్న 54 కిలోమీటర్ల ఈ కారిడార్‌ ను పనుల పర్యవేక్షణ అనువుగా ఉండేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్‌ఏఐ (NHAI)కి బదిలీ చేస్తూ నిర్ణయించారు. భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను 2 లేన్లకు బదులుగా 4 లేన్లుగా నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రతిపాదించారు.శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, దర్శనంలో కీలక మార్పులు..!!ఒకే పిల్లర్‌పై రెండు వైపులా ప్రయాణించేలా నిర్మించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక, టెండర్ల సమస్యలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ విస్తరణ వల్ల దాదాపు 2 లక్షల చెట్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, అధికారులు కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా (ఎన్‌హెచ్‌-765) ఆంధ్రప్రదేశ్‌ వెళ్లేందుకు ప్రస్తుతం గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తోందని చర్చల వేళ ప్రస్తావనకు వచ్చింది.దీంతో, ఈ సమస్య నుంచి బయటపడేందుకు తుక్కుగూడ దగ్గర ఓఆర్‌ఆర్‌ దిగిన తర్వాత నుంచీ డిండి వరకు ఒక రోడ్డును ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించగా, ఆ తరువాత కొంగర్‌కలాన్‌ నుంచి ఆమనగల్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డును ప్రతిపాదించింది. ఫలితంగా ఏపీకి వెళ్లేందుకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. మన్ననూరు నుంచి శ్రీశైలానికి దగ్గర్లోని పాతాళగంగ వరకు రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఎక్కువగా ఉండడంతో సాధారణ రోడ్డుకు బదులుగా 20-25 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. పోటెత్తుతున్న కృష్ణమ్మ- శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం, గేట్లు ఎత్తివేత..!!ఈమేరకు 2లేన్లతో కూడిన కారిడార్‌ నిర్మాణానికి రూ.7,668 కోట్లు అవసరమని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో మోర్త్‌ పేర్కొంది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టు NHAI కి బదిలీ అయింది. ఇదే సమయంలో ఒకేసారి 4 లేన్లతో నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కారిడార్‌ నిర్మాణంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గం సుగమం కావడంతోపాటు ఏపీ వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందని, రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలు మెరుగుపడుతాయని అంచనా వేస్తున్నారు.





