
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్లు రాణించారు. ఓ దశలోఅర్షదీప్ సింగ్ (3/19) ధాటికి ఆఫ్ఘన్ 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే ఒమర్జాయ్ (64 నాటౌట్) అర్ధశతకంతో రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 157 పరుగులు చేయాల్సి ఉంది. రీఎంట్రీ మ్యాచులో బుమ్రా ఒక వికెట్ తీశాడు.





