
Asia Cup 2026: దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 13న భారత్, శ్రీలంక జట్ల మధ్య మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ పోరు జరుగుతోంది. విజేతగా నిలిచే జట్టుకు ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ట్రోఫీ అందిస్తారా లేదా అనే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఈ వేడుకపై అందరి దృష్టి నెలకొంది. గతేడాది జరిగిన పురుషుల ఆసియా కప్లో భారత జట్టు పాకిస్థాన్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంతో ఉత్పన్నమైన రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధినేత అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. ఆ సమయంలో నఖ్వీ విజేత ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ కప్పు ఇప్పటికీ భారత జట్టుకు అధికారికంగా అందకపోవడం గమనార్హం.






