హర్మూజ్’ను దాటి భారత్ కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు
Actor ProfilePolitician

హర్మూజ్’ను దాటి భారత్ కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హర్మూజ్’ను దాటి భారత్ కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు
AP7AM3 Jul 2026
హర్మూజ్’ను దాటి భారత్ కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు

భారత వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ సాగుకు సిద్ధమవుతున్న దేశీయ రైతాంగానికి కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న అంతర్జాతీయ జలమార్గం 'హర్మూజ్ జలసంధి'నుంచి నాలుగు భారీ కార్గో నౌకలు సురక్షితంగా బయటపడి భారత తీరానికి బయలుదేరాయి. వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా, డీఏపీ, సల్ఫర్ వంటి సుమారు 1.8 లక్షల టన్నుల ఎరువుల ముడిసరుకుతో ఈ నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కాకినాడ రేవులతో పాటు ఒడిశాలోని పారాదీప్, గుజరాత్‌లోని ముంద్రా పోర్టులకు చేరుకోనున్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలపై ఉన్న ఆంక్షల వల్ల ఎరువుల సరఫరా నిలిచిపోతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ నాలుగు నౌకలు సురక్షితంగా దాటడంతో ఖరీఫ్ పంటల సాగుకు ఎరువుల లభ్యతపై ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోయింది. జూన్ 22 నాటికి దేశంలో మొత్తం 196.08 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ఉన్న 168.67 లక్షల టన్నులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇందులో ప్రస్తుతం 81.44 లక్షల టన్నుల యూరియా, 20.92 లక్షల టన్నుల డీఏపీ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 1 నుంచి జూన్ 21 వరకు ఎరువుల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోలిస్తే 13.2 లక్షల టన్నులు పెరిగి, మొత్తం 153.4 లక్షల టన్నులకు చేరడం దేశీయంగా ఉన్న భారీ డిమాండ్‌ను సూచిస్తోంది.మరోవైపు దేశీయంగా కూడా ఎరువుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 133.12 లక్షల టన్నులకు