
భారత క్రీడా రంగంలో, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోని అత్యంత విలువైన ప్రభుత్వేతర కంపెనీలతో రూపొందించిన 'బుర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500' జాబితాలో తొలిసారిగా ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలు చోటు దక్కించుకున్నాయి. క్రికెట్ కేవలం క్రీడగానే కాకుండా, ఒక బలమైన కార్పొరేట్ శక్తిగా రూపాంతరం చెందుతోందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.ఈ జాబితా ప్రకారం, రూ. 20,850 కోట్ల విలువతో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) 270వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ. 19,550 కోట్ల విలువతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 285వ స్థానాన్ని, రూ. 16,700 కోట్ల విలువతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 330వ స్థానాన్ని సాధించాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 15,700 కోట్లతో 343వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ (PBKS) రూ. 14,050 కోట్లతో 390వ స్థానంలో నిలిచాయి. ఈ ఐదు ఫ్రాంచైజీల ఉమ్మడి విలువ రూ. 71,000 కోట్లకు పైగా ఉండటం విశేషం.హురున్ ఇండియా ప్రతియేటా ఈ నివేదికను విడుదల చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం పొందాలంటే సంబంధిత కంపెనీ కనీస విలువ రూ. 10,230 కోట్లుగా ఉండాలి. సాధారణంగా రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ఆధిపత్యం వహించే ఈ జాబితాలో క్రీడా ఫ్రాంచైజీలు చేరడాన్ని విశ్లేషకులు ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తున్నారు.బుధవారం (జూన్ 24) విడుదలైన ఈ నివేదిక ప్రకారం, దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీల మొత్తం విలువ