
మనం రోజువారీ జీవితంలో కొనుగోలు చేసే ఆహార పదార్థాల విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. లాభాల వేటలో పడి వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న బ్రాండ్లపై కేంద్ర.. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఉక్కుపాదం మోపుతోంది. అటు ప్యాకింగ్ విషయంలోనూ, ఇటు ప్రకటనల విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.మిఠాయి దుకాణాలు, బేకరీలు, హోటళ్లలో ఆహార పొట్లాలు, కేకు బాక్సులను స్టాపుల్ పిన్నులతో ప్యాక్ చేయడం మనకు నిత్యం కనిపించే దృశ్యమే. అయితే, ఈ అలవాటు వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల కొన్ని ప్రాంతాలలో కేకులు, ఇతర తినుబండారాలను పిన్నులతో ప్యాక్ చేయగా, అవి తెలియకుండానే ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీనిని అత్యంత ప్రమాదకరమైన విషయంగా పరిగణించిన FSSAI.. ఇకపై ఆహార ప్యాకింగ్లో స్టాపుల్ పిన్నులు, మెటాలిక్ వస్తువులు, ఇనుప తీగలను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ నిబంధనను అతిక్రమించి ప్యాకింగ్ చేస్తే వ్యాపారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.హెల్తీ పేరిట మభ్యపెడితే నోటీసులే: బోనులో ప్రముఖ బ్రాండ్లుమార్కెట్లో లభించే వివిధ ఆహార ఉత్పత్తులపై హెల్తీ, ఆరోగ్యకరం అంటూ తప్పుదోవ పట్టించే లేబుళ్లను వాడటంపై FSSAI ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఎనిమిది ప్రముఖ ఆహార కంపెనీలకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ బ్రాండ్లు ఇవే..ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్.. మీసాలు పెంచితే యాక్షనే!ఇమామీ హెల్తీ అండ్ టేస్టీ: వంటనూనెల వ్యాపారంలో ఉన్న ఈ బ్రాండ్ పేరులోనే హెల్తీ అని వాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని నియంత్రణ సంస్థ ఆక్షేపించింది.ప్లాన్ బి (Plan B): ఎలాంటి ముందస్తు లైసెన్స్ లేదా FSSAI అనుమతి (ఎండార్స్మెంట్) లేకుండానే తన ఉత్పత్తులను ప్లాంట్ బేస్డ్ వెగాన్గా ప్రచారం చేస్తూ విక్రయిస్తోంది.ది హెల్తీ ఫ్యాక్టరీ: ఈ సంస్థ తయారు చేస్తున్న జీరో

