
కొన్ని దేశాల్లో మహిళలు ఎలా అణిచివేతకు గువ్వుతున్నారు అనేందుకు ఈ ఘటన ఉదాహరణ. ఇంకా పలు చోట్ల వాళ్లు బయట ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేదానిపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే అక్కడి కోర్టులు ఎలాంటి శిక్షలు విధిస్తాయో తెలిస్తే విస్తుపోతారు. ఇరాన్లో ప్రముఖ గాయని పరాస్టూ అహ్మదీ హిజాబ్ ప్రస్తుతం ఆ పరిస్థితనే ఎదుర్కొంటోంది. హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ కళాకారిణి పరాస్టూ అహ్మదీకి దారుణమైన శిక్ష విధించింది అక్కడి క్రిమినల్ కోర్టు. 2024 నాటి కేసు ఇది. యూట్యూబ్లో లైవ్లో హిజాబ్ లేకుండా పాట పాడినందుకు 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది ఇరాన్ ఖోమ్ ప్రావిన్స్లోని ఒక క్రిమినల్ కోర్టు. ఈ ఆమె పాట పాడిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవ్వగానే లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఆ తక్షణమే హిజాబ్ లేకుండా దేశభక్తి గీతాన్ని ఆలపించండంతో ఇరాన్లోని ఇతర సంగీతకళాకారులు భగ్గుమన్నారు. ఆమె చేసిన పనికి అప్పుడే ఆమెను నిర్బంధించి మరీ అరెస్టు చేశారు. పరస్టూ ఇరాన్ మహిళా ప్రదర్శకులపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా పాటను ఆలపించిందామె. అక్కడ చట్టాల ప్రకారం..మహిళలు బహిరంగంగా సోలోగా పాడటానికి తీవ్రమైన పరిమితులు ఉంటాయి. తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధన ఉంది. దాంతో పరస్టూ తన వీడియో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే అరెస్టు చేసి, అధికారికంగా కేసు నమోదు చేశారు. ఆ నేపథ్యంలోనే ఖోమ్ ప్రావిన్స్ క్రిమినల్ కోర్టు ఈ కంటెంట్ను అసభ్యకరమైనది, అనైతికమైనదిగా పేర్కొంటూ ఇలా ఆమెకు శిక్ష విధించింది. కాగా పరస్టూ 2024లో ఇరాన్లోని ఒక చారిత్రాత్మక సత్రం (కారవాన్సరీ)లో "ఊహాత్మక సంగీత కచేరీ"గా పిలిచే ప్రదర్శన నిర్వహించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆ వీడియోలో ఆమె చేతులేని నల్లటి దుస్తులు ధరించి, హిజాబ్ లేకుండా ప్రదర్శించడంతోనే అక్కడి అధికారుల ఆగ్రహావేశాలకు గురయ్యారామె. కాగా పరస్టూకి విధించిన శిక్షతో అక్కడి సాంస్కృతిక సెన్సార్షిప్పై ఇరాన్ కళాకారుల్లో