
పదమూడేళ్ల సుదీర్ఘ కాలం... ఆసియా సీనియర్ జూడోలో భారత్ పతకం సాధించి. కానీ ఎంతోమంది అథ్లెట్లు ప్రయత్నించి... విఫలమైనచోట ఇనుంగాన్బి తాఖెల్లామబమ్ అద్భుతం చేసింది... పదమూడేళ్ల సుదీర్ఘ కాలం... ఆసియా సీనియర్ జూడోలో భారత్ పతకం సాధించి. కానీ ఎంతోమంది అథ్లెట్లు ప్రయత్నించి... విఫలమైనచోట ఇనుంగాన్బి తాఖెల్లామబమ్ అద్భుతం చేసింది. ఈమధ్య చైనాలో జరిగిన చాంపియన్షి్పలో కాంస్య పతకం గెలిచి... అంతర్జాతీయ వేదికపై మన కీర్తి పతాక ఎగురవేసింది. ‘పతకాలు గెలవడం చాలా ముఖ్యం. నా కోసమే కాదు... అందరి కోసం. మార్చేస్తుంది. అథ్లెట్లలో తాము ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని కలిగిస్తుంది’ అంటున్న ఇనుంగాన్బి... ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ‘‘చైనాలోని ఓర్డోస్ నగరం... ఆసియా సీనియర్ జూడో చాంపియన్షి్ప మహిళల 70 కిలోల విభాగం... కాంస్యం కోసం సమరం. ప్రత్యర్థిని లాక్ చేసి పతకం గెలిచినప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. ఆ క్షణం నాకు తెలియదు... అది పదమూడేళ్లుగా భారతీయులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెర దించిందని. మా రాష్ట్రం మణిపూర్కే చెందిన అంగోమ్ అనితా చాను (2013) తరువాత ఆ ఘనత సాధించిన భారత అథ్లెట్ను నేనే అని. కోచ్ విషయం చెప్పాక ఎలా స్పందించాలో అర్థంకాలేదు. గతంలో పతకాలు కూడా మణిపూర్ నుంచే వచ్చినందుకు, ఆ వారసత్వాన్ని ఇన్నేళ్ల తరువాత తిరిగి నేను కొనసాగించినందుకు గర్వంగా అనిపించింది. ప్రస్తుతం అనిత టీమ్ ఇండియా మెంటార్గా ఉన్నారు. ఆమె సమక్షంలోనే పతకం సాధించడం నిజంగా మరుపురాని అనుభూతి. తను చాలా సంతోషించారు. మొదటి నుంచీ నాకు క్రీడలంటే మక్కువ. అయితే ఏదో సరదాకు కాకుండా ప్రొఫెషనల్గా ఎదగాలని కోరుకున్నాను. దాని కోసం కష్టపడ్డాను. ‘నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ’కి ఎంపికయ్యాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. కెరీర్లో ఎదగాలంటే ఏమేంకావాలో, ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలిసేది కాదు. ఎప్పుడూ జాతీయ క్రీడలు ఆడకపోవడంతో మణిపూర్ మినహా మరే ఇతర రాష్ట్రాల క్రీడాకారులను చూసే