
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన 'మా ఇంటి బంగారం' మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్గా నిలిచింది. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం జూన్ 19 న గ్రాండ్గా రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ సొంతం చేసుకోవడంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో ఈ సినిమా సెకండ్ వీక్లోనూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే 'మా ఇంటి బంగారం' చిత్రానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో డిమాండ్ భారీగా పెరిగింది. థర్డ్ వీకెండ్ కోసం చాలా స్క్రీన్లు, షోలను జోడించడంతో బాక్సాఫీస్ రేంజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు యాడ్ చేయడంతో పాటు మల్టీప్లెక్సుల్లోనూ ఎక్కువ షోలు కేటాయించారు. దీంతో పాటు తెలంగాణలోనూ ఈ సినిమాకు థియేటర్ల కౌంట్ పెరగడం విశేషం. సమంత వన్ ఉమెన్ షోగా వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్ డే రోజునే వరల్డ్వైడ్గా ₹12.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకుంటే దాదాపు ₹5.35 కోట్లు రాబట్టి సమంత కెరీర్లోనే సోలో ఓపెనర్గా రికార్డు సృష్టించింది. కేవలం ₹25-30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రాఫిటబుల్ జోన్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. సినిమాలో స్వర్ణ పాత్రలో సమంత నటన అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కో-స్టార్స్ దిగంత్ మంచాలే, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి తమ నటనతో సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లారు. నందిని రెడ్డి మార్క్ ఎమోషన్స్, డ్రామా ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు భారీగా రప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా సెకండ్ వీక్లోనూ ఆంధ్ర, రాయలసీమ ఏరియాల్లో హౌస్ఫుల్ బోర్డులతో రన్ కావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్లో రెస్పాన్స్ రావడం సమంత స్టార్ పవర్కు నిదర్శనంగా