
DMK – NDA : రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశ భవిష్యత్తును మార్చే కీలకమైన డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమి గట్టి పట్టుదలతో ఉంది. రాజ్యాంగ సవరణలు అవసరమయ్యే ఈ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో మూడింట రెండు వంతుల (2/3) మెజార్టీ అంటే కనీసం 352 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 298 మంది సభ్యుల బలం ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్ష కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) కి చెందిన 22 మంది, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) కి చెందిన ఆరుగురు ఎంపీలు మద్దతు ఇస్తే ఈ సంఖ్య 326 కి చేరుతుంది. అయినప్పటికీ అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం తమిళనాడు అధికార పార్టీ అయిన డీఎంకే (DMK) కి చెందిన 22 మంది ఎంపీల మద్దతు కూడా ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ప్రసన్నం చేసుకునే బాధ్యతను ఎన్డీయే కూటమిలోని కీలక భాగస్వాములైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కేంద్ర పెద్దలు అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. Read Also : ఆధునిక రాజకీయంలో ‘ప్రసవ’ ప్రహసనం డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తే జనాభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెరిగి, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళన మొదటి నుంచీ ఉంది. ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్లిష్టమైన తరుణంలో దక్షిణాది ప్రాంతానికి చెందిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు, అటు తమిళనాడు రాజకీయాలపై మరియు సినీ రంగానికి ఉన్న సెంటిమెంట్ సంబంధాల రీత్యా మంచి పట్టున్న పవన్ కళ్యాణ్ అయితేనే డీఎంకేతో చర్చలు జరపడానికి సరైన వారbridge (వారధి)