
Namasthe Telangana•18 Jun 2026
సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై కారు-డీసీఎం ఢీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలుSircilla Bypass |రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు, డీసీఎం వ్యాన్ సిరిసిల్ల బైపాస్పై ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అభిషేక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న వారిది జగిత్యాలగా తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది