సాయికృష్ణ కేసు
Actor ProfilePolitician

సాయికృష్ణ కేసు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరపాలి..జగన్ డిమాండ్
TeluguOne18 Jun 2026
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరపాలి..జగన్ డిమాండ్

విజయవాడలో సాయికృష్ణ తల్లిని పరామర్మించిన వైఎస్ జగన్... విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, మృతి వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి చేరుకుని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదార్చిన జగన్, ఈ దారుణ ఘటనపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డ వైఎస్ జగన్, పోలీసుల వేధింపుల వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. ఒక సాధారణ యువకుడిని మే నెలలోనే పోలీసులు తీసుకువెళ్లారని, అతని ఆచూకీ కోసం తల్లి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కనీస సమాచారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పైగా, "నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో" అంటూ పోలీసులు అమానవీయంగా సమాధానం చెప్పడం అత్యంత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో కేవలం కింది స్థాయి సిబ్బంది పాత్రే కాకుండా, పోలీసు ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నాయనే అనుమానాలను వైఎస్ జగన్ వ్యక్తపరిచారు. విజయవాడ సీపీ, ఏసీపీలతో పాటు డీజీపీకి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణలంక ప్రాంతంలో పోలీసుల అరాచకాలు హద్దులు దాటాయని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలోనూ ఇలాంటి వేధింపుల ఉదంతాలు వెలుగుచూశాయని జగన్ గుర్తుచేశారు. సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే మరో యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఒకే అధికారి వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలన్నారు. పోలీసుల లాకప్ డెత్ లపై ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై అటు రాజకీయ

సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి.. డీజీపీ సహా ఆ ముగ్గురి ప్రమేయం
10TV Telugu18 Jun 2026
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి.. డీజీపీ సహా ఆ ముగ్గురి ప్రమేయం

YS Jagan : సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో విజయవాడ కృష్ణ‌లంకలోని గాదె సాయికృష్ణ నివాసానికి వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. సాయికృష్ణ తల్లిని పరామర్శించి.. ఆమెను ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ సాయికృష్ణ అదృశ్యం ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగింది. సాయికృష్ణ ఘటనలో సీపీ, ఏసీపీ, సీఐతోపాటు డీజీపీకి కూడా సంబంధం ఉంది. మే నెలలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. సీఐ వేధిస్తున్నాడని క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. మే9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను ప్రశ్నించింది. కొడుకును చూపించమని పోలీస్ స్టేషన్ కు వెళ్లని రోజులేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పడం చూస్తుంటే.. వీళ్లు ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో అర్ధమవుతుందని జగన్ అన్నారు. సాయికృష్ణ అదృశ్యం విషయాన్ని మరుగున పడేసేందుకు అతని తల్లితో పోలీసులు బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కూడా వేసింది. కూటమి ప్రభుత్వ పాలనలో ఇలాంటి ఘోరాలను అడ్డుకట్ట వేసేందుకు బాధితులకు మేం సపోర్ట్‌గా నిలబడ్డాం. గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారు. సాయికృష్ణను చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్ చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. సీఎం చంద్రబాబు మాత్రం అతన్ని కేవలం సస్పెండ్‌ మాత్రమే చేశారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్‌కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని జగన్ ఆరోపించారు. ఒకవేళ సాయికృష్ణ తప్పుచేసిఉంటే కోర్టులు శిక్షిస్తాయి. కానీ, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చంపేశారు. సాయికృష్ణ కేసుపై