
అయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) విరాళాల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారంలో కీలక ఎలక్ట్రానిక్ ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న పిటిషనర్ల ఆందోళనపై సుప్రీంకోర్టు (Supreme Court) తక్షణ విచారణకు నిరాకరించింది. వేసవి సెలవుల కాలంలో ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సెలవులు ముగిసిన తర్వాతే ఈ కేసును విచారిస్తామని, తర్వాత విచారించినంత మాత్రాన ఆకాశం మీదేమీ పడదు అని జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది.ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, డేటా రికార్డులు (DVR), క్యూఆర్ కోడ్ లాగ్లు మరియు నిధుల డిజిటల్ లెడ్జర్లను మార్చే అవకాశం ఉందని న్యాయవాది ఎన్.కె. గోస్వామి వాదించారు. సాధారణ రాతి శాసనాల తరహాలో కాకుండా, డిజిటల్ సాక్ష్యాలు చాలా తేలికగా తారుమారు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు వాయిదాలు పడుతున్న కొద్దీ సాంకేతిక ఆధారాలు శాశ్వతంగా తొలగించబడడమో లేదా మార్చబడడమో జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సుప్రీంకోర్టు అత్యవసరణ విచారణకు నిరాకరించింది. Ayodhya Ram Temple: అయోధ్య గుడిలో విరాళాల స్కాం-8 మంది అరెస్టు..!గతంలో అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు లాయర్లు అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగంపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా విచారణ జరిపించాలని కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా ఎన్.కె. గోస్వామి దాఖలు చేసిన పిటిషన్లో, దేవునికి భక్తులు సమర్పించే కానుకలు ఒక పవిత్రమైన ట్రస్ట్ ఆస్తిగా భావించాలని, వాటిని దుర్వినియోగం కాకుండా సంరక్షించే బాధ్యత అధికారులపై ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు లభించిన విలువైన కానుకలు మరియు నగదుపై తక్షణమే స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు అయోధ్య, మథుర వంటి ప్రసిద్ధ