
UAE : మారుతున్న కాలంలో చిన్న పిల్లలు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండటంపై అరబ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అత్యంత కఠినమైన, సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 15 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఎవరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను ఆయా సోషల్ మీడియా సంస్థలకే అప్పగించింది. తమ ప్లాట్ఫామ్లలో ఉన్న యూజర్ల అకౌంట్లను నిరంతరం పర్యవేక్షించాలని (మానిటర్ చేయాలని), నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్ల లోపు పిల్లలు నిర్వహిస్తున్న ఖాతాలన్నింటినీ రాబోయే 12 నెలల వ్యవధిలో పూర్తిగా బ్లాక్ చేయాలని టెక్ కంపెనీలకు గడువు విధించింది. పిల్లల వ్యక్తిగత డేటా భద్రత, సైబర్ వేధింపుల నివారణే ధ్యేయంగా యూఏఈ ఈ ముందడుగు వేసింది. Read Also : పాకిస్థాన్ గురుద్వారాలో ఘోరం: సిక్కు సంరక్షక దంపతుల కాల్చివేత చిన్నారులకు స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వల్ల ఎదురవుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఇతర సామాజిక రుగ్మతల నుంచి వారిని రక్షించడమే ఈ నిషేధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. కేవలం యూఏఈ మాత్రమే కాకుండా, ఇప్పటికే ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ తరహా కఠినమైన నిర్ణయాల వైపు అడుగులు వేశాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు కూడా పిల్లల వయోపరిమితిని సవరిస్తూ సోషల్ మీడియా వినియోగంపై చట్టపరమైన ఆంక్షలు మరియు కఠినమైన నిబంధనలను తీసుకువచ్చాయి. అంతర్జాతీయంగా మారుతున్న ఈ ట్రెండ్, భవిష్యత్ తరాలను డిజిటల్ దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడటం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. Beetroot Side Effects: బీట్రూట్ ఆరోగ్యకరం..కానీ వారు జాగ్రత్తగా ఉండాలి! DMK సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ ను NDA దింపబోతుందా ? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన