
ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత రవి మోహన్ (జయం రవి) తన శబరిమల యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మే నెలలో చేపట్టిన అయ్యప్ప దీక్షను జూన్ 24న విరమించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసిన అనంతరం, ఇకపై చిత్ర పరిశ్రమలో మరింత నిబద్ధతతో శ్రమిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.యాత్ర ముగిసిన అనంతరం ఆలయం వద్ద దిగిన ఛాయాచిత్రాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. "ప్రతిరోజూ నేను మరింత శక్తిని పుంజుకుంటున్నాను. నాపై నిరంతరం ప్రేమను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీస్సులే నాకు ప్రేమ, గౌరవాన్ని తిరిగి ఇవ్వాలనే స్ఫూర్తినిస్తున్నాయి. నేను ఎదగాలని కోరుకునే వారందరి కోసం సినీ రంగంలో అలుపెరగకుండా కృషి చేస్తాను. అభిమానులు, పరిశ్రమ మిత్రులు, మీడియా నుంచి లభిస్తున్న ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. దైవశక్తే నన్ను ముందుకు నడిపిస్తోంది. స్వామియే శరణం" అని తన పోస్ట్లో పేర్కొన్నారు.వ్యక్తిగత జీవితంలో విడాకుల ప్రక్రియ వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో, రవి మోహన్ మే నెల మధ్యలో అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం ఆధ్యాత్మిక ప్రశాంతత కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ సమయంలో సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.వృత్తిపరమైన విషయానికొస్తే, రవి మోహన్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. యోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'యాన్ ఆర్డినరీ మ్యాన్' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు. దీనితో పాటు, రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్