
Rajavommangi crime:పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో మద్యం సేవించి దుర్వినియోగం చేయడంపై కొడుకును తండ్రి మండలించడంతో బాటు సెల్ ఫోన్ తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు త్రాగిన గిరిజన


Rajavommangi crime:పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో మద్యం సేవించి దుర్వినియోగం చేయడంపై కొడుకును తండ్రి మండలించడంతో బాటు సెల్ ఫోన్ తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు త్రాగిన గిరిజన

Kollu Ravindra: గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అమలైన లోపభూయిష్ట మద్యం విధానాల కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Read also: Vivek Yadav: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. కీలక అప్డేట్ ఇచ్చిన సీఈఓ వివేక్ యాదవ్ గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి సుమారు రూ.18,860 కోట్ల ఆదాయం కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఆదాయం పొరుగు రాష్ట్రం తెలంగాణకు మళ్లిందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. మద్యం ధరలను భారీగా పెంచడం, ప్రభుత్వ దుకాణాల ద్వారా నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించడం, అలాగే వైకాపా అనుబంధ సంస్థలకే వ్యాపార అవకాశాలు ఇవ్వడం వల్ల చట్టబద్ధమైన అమ్మకాలు తగ్గాయని మంత్రి తెలిపారు. దీని కారణంగా సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. 2019–2024 మధ్య ఏపీ, తెలంగాణ మధ్య మద్యం అమ్మకాల వ్యత్యాసం రూ.42,762 కోట్లకు చేరిందని, గతంలో ఇది కేవలం రూ.4,186 కోట్లుగా మాత్రమే ఉండేదని గణాంకాలతో వివరించారు. వైకాపా పాలనలో జరిగిన మొత్తం రూ.99,413 కోట్ల అమ్మకాల్లో కేవలం రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్ రూపంలో జరిగాయని, మిగతా మొత్తం నగదు రూపంలోనే సాగిందని ఆయన ఆరోపించారు. నాణ్యమైన బ్రాండ్ల వాటా 51 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందని, ఇది పెద్ద ఆర్థిక అక్రమమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే రూ.99 కే క్వార్టర్ బాటిళ్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. డిజిటల్ లావాదేవీలను 60 శాతానికి పెంచినట్లు పేర్కొంటూ, ఈ సంస్కరణల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కాపాడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర