
Visakhapatnam Steel Plant steel liquid leakage : విశాఖపట్నం స్టీల్ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – RINL) లో ఇటీవల జరిగిన ఘోర ఉక్కు ద్రవం లీకేజీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం (జూన్ 13) నాడు నగరంలోని సెవెన్హిల్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ గోకివాడ సూరిబాబు అనే కార్మికుడు మృతి చెందాడు. దీనితో ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 10కి చేరింది. తాజాగా మరణించిన గోకివాడ సూరిబాబు విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం సీతానగరం ప్రాంతానికి చెందిన నివాసిగా అధికారులు గుర్తించారు. ఈ నెల 8న జరిగిన ప్రమాదంలో సూరిబాబు శరీరానికి తీవ్రమైన నిప్పు గాయాలయ్యాయి (సుమారు 70 శాతానికి పైగా కాలిన గాయాలు). ఘటనా స్థలం నుండి ఆయన్ను వెంటనే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి బర్న్ వార్డులో వెెంటిలేటర్పై ఉంచి వైద్యులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. సూరిబాబు మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. Read Also: Kesineni Nani: కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఈ నెల 8వ తేదీ (సోమవారం) సాయంత్రం స్టీల్ప్లాంట్ లోని ‘స్టీల్ మెల్టింగ్ షాప్-1’ (SMS-1) విభాగంలో ఈ ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. దాదాపు 1,600 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న సుమారు 150 టన్నుల ద్రవ ఉక్కును మోసుకెళ్తున్న ఒక భారీ పారిశ్రామిక పాత్ర (Ladle) ఒక్కసారిగా పేలి కిందపడిపోయింది. పాత్ర పేలడంతో అందులోని మరుగుతున్న ద్రవ ఉక్కు షాప్ ఫ్లోర్పై లావా లాగా చెల్లాచెదురుగా పడింది. ఈ ద్రవం కింద పనిచేస్తున్న కార్మికులపై పడటంతో ఎనిమిది మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. భారీగా