
Harish Rao:రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్న భారీ ఖాళీలను భర్తీ చేయకుండా, అరకొర పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని హరీష్ రావు పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అంశంపై విమర్శలు గుప్పించారు. పోలీస్ శాఖలో మొత్తం 19 వేల ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేసినా, ప్రభుత్వం మాత్రం కేవలం 5 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. Read also: HYD Kanchanbagh Incident: హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి ఎన్నికల ముందు పరీక్షల ఫీజులు పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు 400 రూపాయలుగా ఉన్న ఫీజును ప్రస్తుతం 800 రూపాయలకు పెంచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని, యువత ఆశలను వమ్ము చేయవద్దని ఆయన డిమాండ్ చేశారు. 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్ల నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం, ఇలా నిరుద్యోగులను విస్మరించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. వెంటనే స్పందించి మొత్తం ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. G7 Summit : G7 సదస్సు కోసం స్లోవేకియా నుంచి ఫ్రాన్స్కు బయలుదేరిన మోదీ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని