వెనిజులాలో భూకంపాల విధ్వంసం.. 235 మందికి
Actor ProfilePolitician

వెనిజులాలో భూకంపాల విధ్వంసం.. 235 మందికి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెనిజులాలో భూకంపాల విధ్వంసం.. 235 మందికిపైగా మృతి.. 40వేల మంది ఆచూకీ గల్లంతు.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
10TV Telugu25 Jul 2026
వెనిజులాలో భూకంపాల విధ్వంసం.. 235 మందికిపైగా మృతి.. 40వేల మంది ఆచూకీ గల్లంతు.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య

Venezuela Earthquake Updates : దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. 7.2 తీవ్రతతో.. 7.5 తీవ్రతతో కేవలం నిమిషం వ్యవధిలో సంభవించిన ఈ భూకంపాల కారణంగా ఇప్పటి వరకు కనీసం 235 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,300 మందికిపైగా గాయపడ్డారు. భవనాలు కూలిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40వేల మంది జాడ తెలియరాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా భూకంప పరిశోధన సంస్థ (యూఎస్జీఎస్) వివరాల ప్రకారం.. తొలి భూకంపం 7.2 తీవ్రతతో మోరోన్ పట్టణానికి పశ్చిమంగా సంభవించింది. దాని తరువాత కేవలం నిమిషంలోనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం అదే ప్రాంతానికి నైరుతి దిశలో నమోదైంది. ఈ రెండు భూకంపాలు గత దశాబ్దంలో వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు. వెనెజువెలా రాజధాని కారకాస్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. అయితే, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన లాగువేరాలో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా శిథిలాల దిబ్బగా మారినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలను రంగంలోకి దించింది