
TMC : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె


TMC : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత విభేదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె

Rahul : ఇండియా (I.N.D.I.A) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలు కూటమిని బలోపేతం చేయకపోగా, అధికార భారతీయ

Lt General Dheeraj Seth: భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. భారత సైన్యానికి నూతన అధిపతిగా (Chief of Army Staff) లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది

Jnaneswari Missing Case Updates: కాకినాడ జిల్లా తుని పరిధిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాను ఆచూకీ కోసం వారం రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది

Four Maoists granted bail: గత ఏడాది విజయవాడలో సంచలనం సృష్టించిన మావోయిస్టుల అరెస్ట్ ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 200 రోజులకు పైగా జైలులో రిమాండ్లో ఉన్న నలుగురు మావోయిస్టులకు మచిలీపట్నం జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పొందిన వారిలో పొడియం రెంగు అలియాస్ బీమ (A1), మదకం మదన్ అలియాస్ మదనన్న (A2), సోది మనీలా (A3), సోది మంగి (A4) ఉన్నారు. Read Also: Dundigal Air Force Academy : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్నాథ్ గత ఏడాది నవంబర్ 18వ తేదీన విజయవాడ కానూరు సమీపంలోని కొత్త ఆటోనగర్లో ఉన్న ఒక భవనంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కా సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసుల సహాయంతో సదరు భవనాన్ని ముట్టడించి వ్యూహాత్మకంగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిపై పటమట పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నెల్లూరు కేంద్ర కారాగారానికి జ్యుడీషియల్ రిమాండ్పై తరలించారు. నిందితులు 200 రోజులకు పైగా జైలులోనే ఉన్నప్పటికీ, పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్పై కోర్టు కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దానిని వెనక్కి పంపింది. చట్టబద్ధమైన గడువు ముగిసినా సరైన ఛార్జిషీట్ దాఖలు కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, నిందితుల తరఫు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ కోర్టులో ‘డిఫాల్ట్ బెయిల్’ (Default Bail) పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ఒత్తిడి కారణంగానే చాలా మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోతున్నారని, నిందితులు సుదీర్ఘకాలంగా జైలులో