
తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్షం డీఎంకే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం జరిగిన డీఎంకే మహిళా విభాగం లోక్సభ కార్యకర్తల సన్నాహక సమావేశంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీఎం విజయ్ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే తమరు ఢిల్లీ వెళ్లారా?, బీజేపీని గట్టిగా విమర్శిస్తే తమరి కుర్చీకి ముప్పు వస్తుందని భయపడుతున్నారా? అంటూ స్టాలిన్ ప్రశ్నలు సంధించారు. డీఎంకే మహిళా విభాగం సమావేశంలో స్టాలిన్ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల డీఎంకే ద్రావిడ మోడల్ పాలన మహిళల సంక్షేమమే ధ్యేయంగా సాగిందన్నారు. అయితే, ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విద్యుత్ కోతలు, రైతుల రుణాల మాఫీ నాటకాలతో.. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా.? అని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన సీఎం విజయ్.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడుల్లో మెజారిటీ కేసుల్లో టీవీకే నిర్వాహకులే నిందితులుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయని వివరించారు. ఇప్పుడు టీవీకే నుంచి మహిళలకు రక్షణ కావాలని ప్రజలు కోరే పరిస్థితి వచ్చిందన్నారు. డీఎంకే బ్లూప్రింట్ కాపీ కొట్టారు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం విజయ్ హాజరు కావడంపై స్టాలిన్ స్పందించారు. ఇందులో సీఎం ప్రసంగం అంతా గతంలో డీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్ర హక్కుల కోసం తాము రూపొందించిన పాలసీ నోట్ లాగే ఉందని ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదు.. రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర హక్కుల విషయంలో ద్రావిడ మోడల్ ప్రభుత్వం వేసిన బ్లూప్రింట్ ప్రకారమే ఎవరైనా నడవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను గతంలో 2030 నాటికి