
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). ఇక ఈ సినిమా తరువాత ఆమె బాగా బిజీగా మారింది. తాజాగా ఆమె నటించిన ఇసకపట్నం రిలీజ్ కు సిద్ధమవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). ఇక ఈ సినిమా తరువాత ఆమె బాగా బిజీగా మారింది. తాజాగా ఆమె నటించిన ఇసకపట్నం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య రాజేష్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సెల్ఫ్ లవ్ గురించి చెప్పుకొచ్చింది. మొదట తనను తాను ప్రేమించుకున్నాకే ఎదుటివారిని ప్రేమించాలని తెలిపింది. సాధారణంగా సెలబ్రిటీలు ఒకరికొకరు ఇచ్చే ఖరీదైన బహుమతుల గురించి వింటూనే ఉంటాం. కానీ, ఐశ్వర్య రాజేష్ మాత్రం ఇతరుల కంటే మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్స్ చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. సినిమా రంగంలో ఎంతో కష్టపడుతున్నప్పుడు, ఆ కష్టానికి ప్రతిఫలంగా మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, అది ఒక గొప్ప సంతృప్తిని ఇస్తుందని తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్.. మీ దగ్గర ఉన్న ఎక్స్ పెన్సివ్ వస్తువు ఏది అంటే.. ఐశ్వర్య రాజేష్ తన రూ.15 లక్షల వాచ్ ని చూపించింది. దాని వెనుక ఉన్న ఒక క్రేజీ సీక్రెట్ కూడా బయటపెట్టింది. తనకు ప్రతి సినిమా పూర్తయిన తర్వాత లేదా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నచ్చిన ఏదో ఒక గిఫ్ట్ తనకు తానుగా గిఫ్ట్ ఇచ్చుకోవడం అలవాటని తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె తన జీవితంలో కొనుక్కున్న అత్యంత ఖరీదైన వస్తువు ఈ వాచ్ అని, దాని విలువ అక్షరాలా రూ. 15 లక్షలు అని చెప్పింది. తన దగ్గర