
Gurbhej Singh: లండన్ లో మరో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్లోని సౌత్హాల్ పరిధిలో ఉన్న సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్కు చెందిన 26 సంవత్సరాల గుర్భేజ్ సింగ్ను దుండగులు కత్తితో


Gurbhej Singh: లండన్ లో మరో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్లోని సౌత్హాల్ పరిధిలో ఉన్న సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్కు చెందిన 26 సంవత్సరాల గుర్భేజ్ సింగ్ను దుండగులు కత్తితో

Lyaki Freedom Ship Attack: భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ‘లియాకి ఫ్రీడమ్’ (Lyaki Freedom) నౌకపై సైనిక దాడి జరిగిందంటూ సోషల్ మీడియా, అంతర్జాతీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న వార్తలను భారత కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, నౌకలోని భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని అధికారికంగా స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర విదేశాంగ శాఖ తక్షణమే స్పందించింది. సదరు నౌక యొక్క కెప్టెన్తో భారత అధికారులు నేరుగా మాట్లాడారు. నౌకలోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నారని కెప్టెన్ ధ్రువీకరించారు. దీంతో నౌకపై సైనిక దాడి జరిగిందనే వార్తలకు తెరపడింది. Read Also : Iran Rejects Trump Allegation : అమెరికా దాడిలోనే భారతీయులు మృతి..ఇరాన్ సంచలన ప్రకటన ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ వద్ద ‘లియాకి ఫ్రీడమ్’ నౌకపై దాడి జరిగిందని, ఈ ఘోరంలో నలుగురు భారతీయ నావికులు మృతిచెందారంటూ శనివారం కొన్ని వార్తా సంస్థలు ప్రచారం చేశాయి. అయితే, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని మరియు కల్పితమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అధికారులు వెల్లడించారు. “హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ప్రస్తుతం భద్రతా ఉద్రిక్తతలు ఉన్న మాట నిజమే. కానీ, ‘లియాకి ఫ్రీడమ్’ నౌక విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వదంతి మాత్రమే. నౌక సురక్షిత ప్రాంతంలోనే ఉంది.” సముద్ర మార్గాల్లో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కావాలనే ఇటువంటి తప్పుడు వదంతులను వ్యాప్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. నౌకాయాన సిబ్బంది కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారం లేకుండా వచ్చే ఇలాంటి పుకార్లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. నౌక ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు