
Eenadu•1 Jul 2026
రైల్వే మంత్రితో రేవంత్ , కిషన్ రెడ్డి భేటీదిల్లీ: రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దిల్లీలోని రైల్ భవన్లో భేటీ అయ్యారు. మెట్రో రైలు ఫేజ్-2 అనుమతులపై వారు చర్చించారు. ఐఆర్ఎఫ్సీ రుణ నిధుల విడుదలపై సమీక్షించారు. ఇటీవల కిషన్రెడ్డికి రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలుకు ఐఆర్ఎఫ్సీ రుణం త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. రైల్వేమంత్రితో భేటీ ఏర్పాటు చేయించాలని కోరారు. ఈక్రమంలో తాజా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రైల్వే మంత్రితో రేవంత్, కిషన్రెడ్డి భేటీ